దేశ రాజధాని దిల్లీలోని ఐదు నక్షత్రాల హోటల్ హయత్ రిజెన్సీకి చెందిన లా పియాజ్జా రెస్టారెంట్ సిబ్బందిపై కరోనా ఎఫెక్ట్ పడింది. సదరు రెస్టారెంట్లో ఫిబ్రవరి 28న భోజనం చేసిన వ్యక్తికి సోమవారమే కరోనా వైరస్ పాజిటివ్గా తేలినందున.. సిబ్బంది మొత్తం రెండు వారాలపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని యాజమాన్యం కోరింది.
" గతనెల 28న లా పియాజ్జా రెస్టారెంట్లో డిన్నర్ చేసిన వ్యక్తికి కరోనా సోకినట్లు ప్రభుత్వాధాకారులు ధ్రువీకరించారు. అందుకే ఆ రోజున రెస్టారెంట్లో విధుల్లో ఉన్న వారందరూ 14 రోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరాం. హయత్ రిజెన్సీ దిల్లీలోని సిబ్బందితో పాటు హోటల్లోకి వచ్చే వారికి రోజూ ఉష్ణోగ్రతలను పరీక్షిస్తున్నాం."
- జూలియన్ ఆయెర్స్, హయత్ రిజెన్సీ దిల్లీ జనరల్ మేనేజర్
ఇద్దరు భారతీయులకు వైరస్ సోకినట్టు సోమవారం నిర్ధరణ అయ్యింది. వీరిలో 45ఏళ్ల దిల్లీవాసి ఒకరు. ఆయనే గతనెల 28న పియాజ్జా రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. ఆ తర్వాత ఆగ్రాలోని అతని బంధువులను కలిసినందున ప్రస్తుతం వీరికి కూడా కోరానా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి : దేశంలో మరో ఆరుగురికి కరోనా