ప్రేమించుకున్నవాళ్లు కరోనా కారణంగా దూరంగా ఉండటం వింటున్నాం. అయితే అదే వైరస్ ఇద్దరు ప్రేమికులను ఒక్కటి చేసింది. ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట.. లాక్డౌన్ కారణంగా తిరిగి స్వస్థలానికి వచ్చారు. ఆ తర్వాత క్వారంటైన్ కేంద్రంలోనే ప్రేమపక్షులు వివాహం చేసుకొని జీవిత భాగస్వాములయ్యారు. ఒడిశాలోని నిమాపాడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
షాగాడ గ్రామానికి చెందిన సౌరభ్ దాస్, డెలాంగ్కు చెందిన దీప్తి రాణీ దాస్లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, కుటుంబసభ్యులు వారి ప్రేమకు అంగీకారం తెలపకపోవడం వల్ల ఇద్దరూ గుజరాత్కు పారిపోయారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన 4 నెలల అనంతరం కరోనాతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఈ క్రమంలోనే మే 10న స్వగ్రామానికి తిరిగొచ్చిందీ జంట.
వారిరువురిని షాగాడ గ్రామంలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. 14 రోజుల అనంతరం వైరస్ నెగిటివ్గా నిర్ధరణ కాగా.. క్వారంటైన్ నుంచి పంపించారు. స్థానికులు, అధికారులు ఇరువురి గురించి తెలుసుకొని.. వారే పెళ్లి పెద్దలై వివాహం జరిపించారు. అనంతరం ఇద్దరి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.
- ఇదీ చదవండి: వలస కష్టాలు: అసలే కరోనా.. ఆపై మండే ఎండలు