ETV Bharat / bharat

ఐదు నక్షత్రాల హోటల్​ నుంచి లోక్​పాల్​ బాధ్యతలు

author img

By

Published : Apr 22, 2019, 11:42 PM IST

దిల్లీలోని 'ద అశోక్​' ఐదు నక్షత్రాల హోటల్​లో భారత లోక్​పాల్​కు తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. లోక్​పాల్​ సిబ్బందితో సహా మిగతా అధికారులూ అక్కడి నుంచే బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఐదు నక్షత్రాల హోటల్​ నుంచి లోక్​పాల్​ బాధ్యతలు

భారత తొలి లోక్‌పాల్‌ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ దిల్లీలోని ఐదు నక్షత్రాల హోటల్​ నుంచి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. లోక్​పాల్​ చైర్​ పర్సన్​తో పాటు మిగతా సిబ్బంది కూడా అదే హోటల్​ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ఇందుకోసం దిల్లీ చాణక్యపురిలోని 'ద అశోక్​' హోటల్​ను తాత్కాలిక కార్యాలయంగా వినియోగించనున్నారు.

గతనెల 23న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సమక్షంలో దేశ మొట్టమొదటి లోక్​పాల్​గా జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా లోక్​పాల్​ సభ్యులతో మార్చి 27న జస్టిస్​ చంద్రఘోష్​ ప్రమాణ స్వీకారం చేయించారు.

లోక్​పాల్​ సభ్యుల వీరే...

పారా మిలటరీ దళం ‘సశస్త్ర సీమా బల్‌’ (ఎస్‌ఎస్‌బీ) మాజీ అధిపతి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ జైన్‌తోపాటు, మాజీ ఐఆర్​ఎస్​ అధికారి మహేంద్ర సింగ్‌, గుజరాత్​ కేడర్​ మాజీ ఐఏఎస్ అధికారి ఇందర్‌జీత్‌ ప్రసాద్‌ గౌతమ్‌, జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మహంతి, జస్టిస్‌ అభిలాషా కుమారి, జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠిలు లోక్​పాల్​ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ వీరి పేర్లను సిఫార్సు చేయగా, రాష్ట్రపతి భవన్​ ఆమోదముద్ర వేసింది.

భారత తొలి లోక్‌పాల్‌ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ దిల్లీలోని ఐదు నక్షత్రాల హోటల్​ నుంచి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. లోక్​పాల్​ చైర్​ పర్సన్​తో పాటు మిగతా సిబ్బంది కూడా అదే హోటల్​ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ఇందుకోసం దిల్లీ చాణక్యపురిలోని 'ద అశోక్​' హోటల్​ను తాత్కాలిక కార్యాలయంగా వినియోగించనున్నారు.

గతనెల 23న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సమక్షంలో దేశ మొట్టమొదటి లోక్​పాల్​గా జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా లోక్​పాల్​ సభ్యులతో మార్చి 27న జస్టిస్​ చంద్రఘోష్​ ప్రమాణ స్వీకారం చేయించారు.

లోక్​పాల్​ సభ్యుల వీరే...

పారా మిలటరీ దళం ‘సశస్త్ర సీమా బల్‌’ (ఎస్‌ఎస్‌బీ) మాజీ అధిపతి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ జైన్‌తోపాటు, మాజీ ఐఆర్​ఎస్​ అధికారి మహేంద్ర సింగ్‌, గుజరాత్​ కేడర్​ మాజీ ఐఏఎస్ అధికారి ఇందర్‌జీత్‌ ప్రసాద్‌ గౌతమ్‌, జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మహంతి, జస్టిస్‌ అభిలాషా కుమారి, జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠిలు లోక్​పాల్​ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ వీరి పేర్లను సిఫార్సు చేయగా, రాష్ట్రపతి భవన్​ ఆమోదముద్ర వేసింది.

Amethi (UP), Apr 22 (ANI): While speaking to ANI, on objection raised on Rahul Gandhi's nomination, lawyer of Rahul Gandhi KC Kaushik said, "Rahul Gandhi was born in India and he holds an Indian passport, there is no issue of his citizenship. His passport, Voter-ID, and his income tax, everything is of India. Later when asked about on objections rose on Rahul's educational qualification, he added, "I don't know who Rahul Vinci is or where he came from. Rahul Gandhi had done his M.Phil in 1995 from University of Cambridge, I have attached a copy of the certificate."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.