ETV Bharat / bharat

విపక్షాలపై స్పీకర్​ అసహనం.. లోక్​సభ రేపటికి వాయిదా

author img

By

Published : Mar 2, 2020, 6:48 PM IST

Updated : Mar 3, 2020, 4:43 AM IST

పార్లమెంట్ రెండో విడత​ బడ్జెట్​ సమావేశాల తొలి రోజు సజావుగా సాగలేదు. ఊహించిన విధంగానే విపక్షాలు 'దిల్లీ అల్లర్ల' అస్త్రాన్ని లోక్​సభలో ప్రయోగించాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాట జరిగింది. గందరగోళ వాతావరణంలో పలు మార్లు వాయిదా పడింది సభ. తిరిగి ప్రారంభమైనప్పటికీ.. ఎలాంటి ఫలితం లేకపోవడం వల్ల విపక్షాలపై అసహనం వ్యక్తం చేశారు స్పీకర్​ ఓం బిర్లా. చివరికి సభను రేపటికి వాయిదా వేశారు.

lok-sabha-adjourned-for-tomorrow
విపక్షాలపై స్పీకర్​ అసహనం.. లోక్​సభ రేపటికి వాయిదా
విపక్షాలపై స్పీకర్​ అసహనం.. లోక్​సభ రేపటికి వాయిదా

దిల్లీ అల్లర్లపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఉభయసభల వేదికగా ఘర్షణలపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. లోక్​సభలో విపక్ష సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ​సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. సభా మర్యాదను కాపాడాలని సూచించారు.

తొలుత ఎంపీ వైద్యనాథ్ ప్రసాద్ మహతో మృతికి సంతాపంగా రెండు గంటల వరకు మొదటిసారి వాయిదా పడింది లోక్​సభ. అనంతరం సభ కార్యకలాపాలు పునః ప్రారంభమైనప్పటికీ గందరగోళం కొనసాగింది. ఆందోళనల మధ్యే.. సీఏఏ అంశమై విపక్ష సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి. 1984లో 3వేలమంది ఊచకోతపై ఎలాంటి చర్యలు తీసుకోని వారు.. ప్రస్తుతం గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్​ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

తోపులాట...

ఆందోళన కొనసాగించిన విపక్ష సభ్యులు.. హోంమంత్రి అమిత్​షా రాజీనామాకు డిమాండ్ చేస్తూ వెల్​లోకి దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్​కు రక్షణగా వెల్​లోకి వచ్చారు భాజపా సభ్యులు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఫలితంగా.. మూడు గంటల వరకు వాయిదా(రెండోసారి) పడింది లోక్​సభ.

సభ కార్యకలాపాలు పునఃప్రారంభమైనా ఫలితం మాత్రం శూన్యం. దిల్లీ ఘర్షణలపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో ప్యానెల్ స్పీకర్ రమాదేవి సాయంత్రం నాలుగు గంటల వరకు సభను వాయిదా వేశారు. నాలుగు గంటల తర్వాత కూడా సభ మరోమారు వాయిదా పడింది. 4:30 గంటలకు తిరిగి సమావేశమైన అనంతరం తోపులాటపై విచారం వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా. లోక్​సభ మర్యాదను కాపాడాలని ఉద్ఘాటించారు. సభా నియమావళి మేరకు నడుచుకుని.. భారత ప్రజాస్వామ్య గౌరవాన్ని పెంచాలని వ్యాఖ్యానించారు.

దిల్లీ అల్లర్లపై విపక్షాల నిరసన మధ్య రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.

ఇదీ చూడండి: నిర్భయ దోషుల ఉరిపై వీడని ఉత్కంఠ.. మరోమారు స్టే

విపక్షాలపై స్పీకర్​ అసహనం.. లోక్​సభ రేపటికి వాయిదా

దిల్లీ అల్లర్లపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఉభయసభల వేదికగా ఘర్షణలపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. లోక్​సభలో విపక్ష సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ​సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. సభా మర్యాదను కాపాడాలని సూచించారు.

తొలుత ఎంపీ వైద్యనాథ్ ప్రసాద్ మహతో మృతికి సంతాపంగా రెండు గంటల వరకు మొదటిసారి వాయిదా పడింది లోక్​సభ. అనంతరం సభ కార్యకలాపాలు పునః ప్రారంభమైనప్పటికీ గందరగోళం కొనసాగింది. ఆందోళనల మధ్యే.. సీఏఏ అంశమై విపక్ష సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి. 1984లో 3వేలమంది ఊచకోతపై ఎలాంటి చర్యలు తీసుకోని వారు.. ప్రస్తుతం గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్​ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

తోపులాట...

ఆందోళన కొనసాగించిన విపక్ష సభ్యులు.. హోంమంత్రి అమిత్​షా రాజీనామాకు డిమాండ్ చేస్తూ వెల్​లోకి దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్​కు రక్షణగా వెల్​లోకి వచ్చారు భాజపా సభ్యులు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఫలితంగా.. మూడు గంటల వరకు వాయిదా(రెండోసారి) పడింది లోక్​సభ.

సభ కార్యకలాపాలు పునఃప్రారంభమైనా ఫలితం మాత్రం శూన్యం. దిల్లీ ఘర్షణలపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో ప్యానెల్ స్పీకర్ రమాదేవి సాయంత్రం నాలుగు గంటల వరకు సభను వాయిదా వేశారు. నాలుగు గంటల తర్వాత కూడా సభ మరోమారు వాయిదా పడింది. 4:30 గంటలకు తిరిగి సమావేశమైన అనంతరం తోపులాటపై విచారం వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా. లోక్​సభ మర్యాదను కాపాడాలని ఉద్ఘాటించారు. సభా నియమావళి మేరకు నడుచుకుని.. భారత ప్రజాస్వామ్య గౌరవాన్ని పెంచాలని వ్యాఖ్యానించారు.

దిల్లీ అల్లర్లపై విపక్షాల నిరసన మధ్య రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.

ఇదీ చూడండి: నిర్భయ దోషుల ఉరిపై వీడని ఉత్కంఠ.. మరోమారు స్టే

Last Updated : Mar 3, 2020, 4:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.