నకిలీ ఓటర్లను తొలగించేందుకు, దోష రహిత ఎలక్టోరల్ రోల్ను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఎన్నికల గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పార్లమెంటులో తెలిపారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.
ఎన్నికల గుర్తింపు కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేస్తారా అని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు మంత్రి.
'శాసనసభ విభాగం నుంచి తీసుకున్న సమాచారాన్ని బట్టి ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానం చేసేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951ని సవరణ చేసే అంశాన్ని పరిశీలిస్తాం.'
- రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి
'ఒకే దేశం- ఒకే కార్డు' ప్రవేశపెట్టే అంశంపై కూడా ప్రశ్నలు వచ్చాయి. దీనిపై మంత్రి స్పందిస్తూ.. హోంమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అలాంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదన్నారు.
ఇదీ చదవండి: 'ఎన్పీఆర్'కు ఏ పత్రమూ ఇవ్వక్కర్లేదు: షా