ETV Bharat / bharat

భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే మ్యూజియం!

author img

By

Published : Aug 10, 2020, 11:49 AM IST

ఒక్కప్పుడు రైళ్లు దట్టమైన పొగలను ఒదులుతూ కూతపెట్టేవి. మరిప్పుడు బుల్లెట్ రైలైనా చప్పుడు చేయకుండా దూసుకెళ్తోంది. భారతీయ రైల్వేలోనూ శతాబ్ద కాలంలో ఒకటా రెండా.. ఎన్నో మార్పులు జరిగాయి. వాటన్నింటినీ కళ్లకు కట్టేలా కర్ణాటకలో ఓ మ్యూజియం ఏర్పాటు చేసింది భారత రైల్వే. ఆ మ్యూజియాన్ని హుబ్బలి ప్రజలకు అంకితమిచ్చారు రైల్వేమంత్రి.

karnataka-railway-museum-dedicated-to-public-by-union-minister
రైల్వే ప్రస్థానం తెలుపుతున్న మ్యూజియం!
భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే మ్యూజియం!

స్టీమ్ ఇంజిన్ నుంచి అత్యాధునిక బుల్లెట్ రైళ్ల వరకు.. భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే విధంగా కర్ణాటకలో ఓ రైల్వే మ్యూజియం ఏర్పాటైంది. ఈ ప్రదర్శనను హుబ్బలి జిల్లా ప్రజలకు అంకితం చేశారు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్. హుబ్బలి ప్రజలతో భారత రైల్వేకు అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు.

హుబ్బల్లిలోని దక్షిణ-పశ్చిమ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు అధికారులు. 1907లో నిర్మించిన కార్టేజీలను రెండు భాగాలుగా చేసి.. ప్రదర్శనాలయం స్థాపించారు. ఓ భాగానికి మలప్రభ, మరో భాగానికి ఘాటప్రభా అనే నదుల పేర్లతో నామకరణం చేశారు.

రైల్వే ప్రపంచంలోకి స్వాగతం పలికేలా ప్రవేశ ద్వారం వద్ద ఓ కమాను. భిన్నత్వంలో ఏకత్వం ఉట్టిపడేలా ఓ ప్యాసెంజర్ బోగీ, స్లీపర్ బోగీలు, క్రాసింగ్ గేట్లు, సిగ్నల్ లైట్లు మ్యూజియంలో ఆకట్టుకుంటున్నాయి. థియేటర్ కోచ్, సురుచి క్యాంటీన్, రైలు నమూనా, ఓ షాపు, టికెట్ ప్రింటింగ్ మెషిన్, ఇతర బొమ్మలతో పాటు.. పిల్లలు ఆడుకునే ఓ గది... ఇలా ఒకటేమిటి రైల్వే ప్రస్థానమంతా కళ్లకు కట్టేలా ఉందీ మ్యూజియం.

ఇదీ చదవండి: సబ్​మెరైన్ కేబుల్ వ్యవస్థను ప్రారంభించనున్న మోదీ

భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే మ్యూజియం!

స్టీమ్ ఇంజిన్ నుంచి అత్యాధునిక బుల్లెట్ రైళ్ల వరకు.. భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే విధంగా కర్ణాటకలో ఓ రైల్వే మ్యూజియం ఏర్పాటైంది. ఈ ప్రదర్శనను హుబ్బలి జిల్లా ప్రజలకు అంకితం చేశారు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్. హుబ్బలి ప్రజలతో భారత రైల్వేకు అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు.

హుబ్బల్లిలోని దక్షిణ-పశ్చిమ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు అధికారులు. 1907లో నిర్మించిన కార్టేజీలను రెండు భాగాలుగా చేసి.. ప్రదర్శనాలయం స్థాపించారు. ఓ భాగానికి మలప్రభ, మరో భాగానికి ఘాటప్రభా అనే నదుల పేర్లతో నామకరణం చేశారు.

రైల్వే ప్రపంచంలోకి స్వాగతం పలికేలా ప్రవేశ ద్వారం వద్ద ఓ కమాను. భిన్నత్వంలో ఏకత్వం ఉట్టిపడేలా ఓ ప్యాసెంజర్ బోగీ, స్లీపర్ బోగీలు, క్రాసింగ్ గేట్లు, సిగ్నల్ లైట్లు మ్యూజియంలో ఆకట్టుకుంటున్నాయి. థియేటర్ కోచ్, సురుచి క్యాంటీన్, రైలు నమూనా, ఓ షాపు, టికెట్ ప్రింటింగ్ మెషిన్, ఇతర బొమ్మలతో పాటు.. పిల్లలు ఆడుకునే ఓ గది... ఇలా ఒకటేమిటి రైల్వే ప్రస్థానమంతా కళ్లకు కట్టేలా ఉందీ మ్యూజియం.

ఇదీ చదవండి: సబ్​మెరైన్ కేబుల్ వ్యవస్థను ప్రారంభించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.