ETV Bharat / bharat

జై బోలో 'పసుపు గణేశ్' మహారాజ్ కీ..!

ఆనాడు ఆ పార్వతీ దేవీ నలుగు పిండి, పసుపు కలిపి వినాయకుడికి ప్రాణం పోసింది. ఇప్పుడు మనింట్లో పసుపు గణేశుడిని పూజిస్తే ఈ కరోనా కాలంలో మన ప్రాణాలు పదిలంగా ఉంటాయి అంటోంది కర్ణాటక కాలుష్య నివారణ బోర్డు. వినాయక చవితి నాడు కాలుష్యాన్ని పెంచే రంగు గణనాథులను కాక, ఆరోగ్యాన్ని పంచే పసుపు వినాయకుడికే జై కొట్టాలంటూ ప్రచారం చేస్తోంది.

author img

By

Published : Aug 18, 2020, 2:31 PM IST

karnataka-pollution-board-floats-turmeric-ganesha-idea
జై బోలో 'పసుపు గణేశ్' మహారాజ్ కి..!

కర్ణాటక రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డు 'పసుపు గణేశా' ప్రచారం చేపట్టింది. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి పర్యావరణహిత విఘ్నేశ్వరుడే తోడ్పడుతాడంటూ అవగాహన కల్పిస్తోంది.

karnataka-pollution-board-floats-turmeric-ganesha-idea
జై బోలో 'పసుపు గణేశ్' మహారాజ్ కీ..!

పసుపులో బోలెడన్ని ఔషధ గుణాలుంటాయి. కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే పసుపు మన సంప్రదాయంలో భాగం కావడం అదృష్టమే. అంతేనా..? పసుపు ముద్దతో తయారుచేసిన గణేశుడికి పూజలు చేసి.. ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. దీంతో నదులు చెరువుల్లో కాలుష్యం వాటిల్లదు. విగ్రహం పూర్తిగా కరిగిపోయాక ఆ నీటిని ఇంట్లో నలుమూలలా చల్లితే ఇంటిని శానిటైజ్ చేసినట్టే అంటోంది బోర్డు.

karnataka-pollution-board-floats-turmeric-ganesha-idea
జై బోలో 'పసుపు గణేశ్' మహారాజ్ కీ..!

"బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) ఈ ఏడాది బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఉంచడం, పూజా కార్యక్రమాలను నిర్వహించడం రద్దు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బీబీఎంపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో, వినాయక చవితి వేడుకలు జరుపుకోలేమేమో అని ప్రజలు నిరుత్సాహపడిపోయారు. కానీ, ఆ చింత అక్కర్లేకుండా ఎవరింట్లో వారే ఆరోగ్యకరమైన పద్ధతిలో పసుపు వినాయకుడిని పూజించుకోవచ్చు. "

- కీర్తి కుమార్, కర్ణాటక కాలుష్య నివారణ బోర్డు అధికారి.

ఈసారి రంగు రంగుల వినాయకులనే పూజించాలని మొండిపట్టు పట్టి కూర్చోకుండా.. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యాన్ని పంచే పసుపు గణేశుడినే పూజించమంటోంది బోర్డు. అంతే కాదు, అలా ఇంట్లో తయారు చేసుకున్న పసుపు వినాయకుడిని ఓ ఫొటో తీసి, బోర్డు ఫేస్ బుక్ పేజీలో పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తోంది.

karnataka-pollution-board-floats-turmeric-ganesha-idea
జై బోలో 'పసుపు గణేశ్' మహారాజ్ కీ..!

ఇదీ చదవండి: చవితి వెతలు... విగ్రహ తయారీదారుల ఆర్థిక కష్టాలు

కర్ణాటక రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డు 'పసుపు గణేశా' ప్రచారం చేపట్టింది. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి పర్యావరణహిత విఘ్నేశ్వరుడే తోడ్పడుతాడంటూ అవగాహన కల్పిస్తోంది.

karnataka-pollution-board-floats-turmeric-ganesha-idea
జై బోలో 'పసుపు గణేశ్' మహారాజ్ కీ..!

పసుపులో బోలెడన్ని ఔషధ గుణాలుంటాయి. కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే పసుపు మన సంప్రదాయంలో భాగం కావడం అదృష్టమే. అంతేనా..? పసుపు ముద్దతో తయారుచేసిన గణేశుడికి పూజలు చేసి.. ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. దీంతో నదులు చెరువుల్లో కాలుష్యం వాటిల్లదు. విగ్రహం పూర్తిగా కరిగిపోయాక ఆ నీటిని ఇంట్లో నలుమూలలా చల్లితే ఇంటిని శానిటైజ్ చేసినట్టే అంటోంది బోర్డు.

karnataka-pollution-board-floats-turmeric-ganesha-idea
జై బోలో 'పసుపు గణేశ్' మహారాజ్ కీ..!

"బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) ఈ ఏడాది బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఉంచడం, పూజా కార్యక్రమాలను నిర్వహించడం రద్దు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బీబీఎంపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో, వినాయక చవితి వేడుకలు జరుపుకోలేమేమో అని ప్రజలు నిరుత్సాహపడిపోయారు. కానీ, ఆ చింత అక్కర్లేకుండా ఎవరింట్లో వారే ఆరోగ్యకరమైన పద్ధతిలో పసుపు వినాయకుడిని పూజించుకోవచ్చు. "

- కీర్తి కుమార్, కర్ణాటక కాలుష్య నివారణ బోర్డు అధికారి.

ఈసారి రంగు రంగుల వినాయకులనే పూజించాలని మొండిపట్టు పట్టి కూర్చోకుండా.. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యాన్ని పంచే పసుపు గణేశుడినే పూజించమంటోంది బోర్డు. అంతే కాదు, అలా ఇంట్లో తయారు చేసుకున్న పసుపు వినాయకుడిని ఓ ఫొటో తీసి, బోర్డు ఫేస్ బుక్ పేజీలో పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తోంది.

karnataka-pollution-board-floats-turmeric-ganesha-idea
జై బోలో 'పసుపు గణేశ్' మహారాజ్ కీ..!

ఇదీ చదవండి: చవితి వెతలు... విగ్రహ తయారీదారుల ఆర్థిక కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.