కరోనా కాలంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించటం తప్పని సరి అయ్యింది. మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారికి పోలీసులు జరిమానా వేస్తున్నారు. మరి కొన్ని చోట్ల జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్ ధరించకుండా రోడ్డుపై తిరుగుతోందని ఏకంగా ఓ మేకను అరెస్టు చేసిన విచిత్ర ఘటన ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్లో జరిగింది. ఈ మూగజీవాన్ని జీపులో ఎక్కించుకొని మరీ స్టేషన్కు తీసుకొని వెళ్లారు.
ఆ యువకుడి వల్లే...
రోడ్డు మీద ఓ యువకుడు మాస్క్ ధరించకుండా తనతో పాటు మేకను తీసుకువెళ్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. మాస్క్ ధరించలేదని అడగగానే సదరు వ్యక్తి మేకను అక్కడే వదిలేసి పారిపోయాడు. దీంతో ఓ అధికారి మేకను స్టేషన్కు తీసుకుని వచ్చారు. కాసేపటికి ఆ యువకుడు స్టేషన్కు వచ్చి మేకను తిరిగి ఇచ్చేయాలని బతిమిలాడాడు. చివరకు పోలీసులు అందుకు ఒప్పుకున్నారు.
మేకకు మాస్క్లేని కారణంగానే స్టేషన్కు తీసుకొని వెళ్లినట్లు అధికారి అంగీకరించారు. "ప్రస్తుత తరుణంలో ప్రజలు తాము పెంచుకునే కుక్కకు మాస్క్ వేసి బయటకు తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు మేకలకు మాస్క్లు ఎందుకు వేయకూడదు?" అంటూ ఆ అధికారి తన చర్యను సమర్ధించుకున్నారు.
ఇదీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి