ETV Bharat / bharat

వినీలాకాశంలో ఖగోళ అద్భుతం.. అతి దగ్గరగా గ్రహాలు

author img

By

Published : Dec 21, 2020, 6:20 PM IST

Updated : Dec 21, 2020, 9:55 PM IST

Jupiter Saturn Great Conjunction
వినీలాకాశంలో ఖగోళ ఆద్భుతం

17:59 December 21

వినీలాకాశంలో ఖగోళ అద్భుతం

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గురు, శని గ్రహాల కలయిక జరిగింది. భూమి మీద నుంచి చూస్తే.. రెండు అతిపెద్ద గ్రహాలు ఒకే నక్షత్రంలో కనువిందు చేశాయి. దాదాపు 4 శతాబ్దాల తర్వాత చోటుచేసుకుంది ఈ అద్భుత ఘట్టం.  

దేశంలో దాదాపు  2 గంటల పాటు ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉంది. పరిభ్రమణంలో 20 ఏళ్లకోసారి మాత్రమే కాస్త దగ్గరగా వచ్చే గురు, శని గ్రహాలు.. భూమి నుంచి చూస్తే 0.1 డిగ్రీలు ఎడంగా కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాలు చివరి సారిగా 1623లో అతి దగ్గరగా వచ్చాయి.  

ఇలాంటి సంయోగం రాత్రివేళ జరగడం 800 ఏళ్లలో ఇదే మొదటిసారి. మళ్లీ 2080 మార్చి 15న రెండు గ్రహాలు ఈ స్థాయిలో చేరువగా రానున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

టెలిస్కోప్​ల ద్వారా 'మహా సంయోగం' వీక్షణం..

గురు, శని గ్రహాల మహో సంయోగ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో దిల్లీలోని నెహ్రూ ప్లానటోరియం వద్దకు తరలివచ్చారు ప్రజలు. టెలిస్కోప్​ల సాయంతో ఈ అద్భుతాన్ని తిలకించారు. మరింత మందికి ఈ కనువిందును అందించేందుకు పెద్ద పెద్ద స్క్రీన్ల వంటివి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  

17:59 December 21

వినీలాకాశంలో ఖగోళ అద్భుతం

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గురు, శని గ్రహాల కలయిక జరిగింది. భూమి మీద నుంచి చూస్తే.. రెండు అతిపెద్ద గ్రహాలు ఒకే నక్షత్రంలో కనువిందు చేశాయి. దాదాపు 4 శతాబ్దాల తర్వాత చోటుచేసుకుంది ఈ అద్భుత ఘట్టం.  

దేశంలో దాదాపు  2 గంటల పాటు ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉంది. పరిభ్రమణంలో 20 ఏళ్లకోసారి మాత్రమే కాస్త దగ్గరగా వచ్చే గురు, శని గ్రహాలు.. భూమి నుంచి చూస్తే 0.1 డిగ్రీలు ఎడంగా కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాలు చివరి సారిగా 1623లో అతి దగ్గరగా వచ్చాయి.  

ఇలాంటి సంయోగం రాత్రివేళ జరగడం 800 ఏళ్లలో ఇదే మొదటిసారి. మళ్లీ 2080 మార్చి 15న రెండు గ్రహాలు ఈ స్థాయిలో చేరువగా రానున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

టెలిస్కోప్​ల ద్వారా 'మహా సంయోగం' వీక్షణం..

గురు, శని గ్రహాల మహో సంయోగ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో దిల్లీలోని నెహ్రూ ప్లానటోరియం వద్దకు తరలివచ్చారు ప్రజలు. టెలిస్కోప్​ల సాయంతో ఈ అద్భుతాన్ని తిలకించారు. మరింత మందికి ఈ కనువిందును అందించేందుకు పెద్ద పెద్ద స్క్రీన్ల వంటివి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  

Last Updated : Dec 21, 2020, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.