ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడి, ఆకస్మిక వరద పోటెత్తిన ప్రాంతాల్లో సహాయక చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి. వాయుసేన, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కలిసి యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నాయి.
ధౌలీగంగా నది ప్రవాహ ఉద్ధృతి తగ్గించడానికి ఇంజినీరింగ్ టాస్క్ఫోర్స్తో సహా.. సైనిక సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు సమీపంలోని సొరంగ మార్గాలను క్లియర్ చేస్తున్నారు.
చమోలీలోని తపోవన్ ఆనకట్ట సమీపంలో సొరంగంలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్. అయితే.. మందాకిని నది ఉద్ధృత స్థాయిలో ప్రవహిస్తూ ఉండడం ఇబ్బందికరంగా మారింది.
అటు వరదల్లో గల్లంతైన బాధితుల కోసం కశ్మీర్లోని ఓ పాఠశాల విద్యార్థులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారంతా క్షేమంగా తిరిగొచ్చి వాళ్ల కుటుంబీకులతో కలవాలనే ఫ్లకార్డులు చేత పట్టుకుని దేవుణ్ని వేడుకున్నారు చిన్నారులు.
ఇదీ చదవండి: 2013 వరదలా... అమ్మ బాబోయ్