మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ సహా ఇద్దరు పీడీపీ సభ్యులపై ఉన్న పీఎస్ఏ(ప్రజా భద్రత చట్టం)ను రద్దు చేస్తున్నట్టు జమ్ముకశ్మీర్ యంత్రాంగం ప్రకటించింది. ఈ ఇద్దరిలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి మేనమామ కూడా ఉన్నారు.
ఫైజల్పై వివాదాస్పద పీఎస్పీని మరో మూడు నెలలు అమలు చేస్తూ మే 14 ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. అయితే దీనిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర పాలిత ప్రాంత హోంశాఖ విభాగం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని భారత్ రద్దు చేసిన సమయం నుంచి ఫైజల్ నిర్బంధంలోనే ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు పీఎస్ఏను ఫైజల్పై మోపారు. అయితే ఆయన్ని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆయనతో పాటు పీడీపీ పార్టీ నాయకులు సర్తాజ్ మదానీ, పీర్ మన్సూర్ల నిర్బంధాన్నీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి ఆలీ మహమ్మద్ సాగర్తో కలిపి మదానీని ప్రభుత్వ బంగ్లాలో ఉంచారు.
ఇదీ చూడండి: 'దిల్లీలోని సెయిల్ కంపెనీలో ఐదుగురికి కరోనా'