ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

జమ్ముకశ్మీర్​లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. బందిపొరా జిల్లాలో దివ్యాంగులు హాజరుకాగా, వారికి కావాల్సిన పరికరాలను ఈ సందర్భంగా పంపిణీ చేశారు.

author img

By

Published : Aug 15, 2020, 4:41 PM IST

Jammu and Kashmi : Pakage, Army celebrates ID with persons with disabilities
జమ్ముకశ్మీర్​లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జమ్ముకశ్మీర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు పాల్గొన్నారు. కశ్మీర్ లోయలోని అన్ని జిల్లాలకు చెందిన పోలీసులు, ఇతర భద్రతా దళాలతో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులు ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నారు.

జమ్ముకశ్మీర్​లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

షోపియాన్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్ చౌదరి ముహ్మద్ యాసిన్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. ఇతర జిల్లాల్లోనూ సంబంధిత డిప్యూటీ కమిషనర్లు జెండాను ఆవిష్కరించారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

Jammu and Kashmi : Pakage, Army celebrates ID with persons with disabilities
వేడుకల్లో పాల్గొన్న పోలీసులు
Jammu and Kashmi : Pakage, Army celebrates ID with persons with disabilities
వేడుకల్లో పాల్గొన్న అధికారులు

పుల్వామా జిల్లాలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. కుల్గాం​లోనూ వేడుకలు జరగగా, కరోనా విజృంభణ నేపథ్యంలో పోలీసుల కవాతును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. బందిపొరా జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ మన్సాబ్​ అధికారులు.. దివ్యాంగులతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి కావాల్సిన పరికరాలను అందజేశారు.

ఇదీ చూడండి ప్రధాని మోదీ స్వాతంత్ర్య ప్రసంగంలో హైలైట్స్​ ఇవే...

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జమ్ముకశ్మీర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు పాల్గొన్నారు. కశ్మీర్ లోయలోని అన్ని జిల్లాలకు చెందిన పోలీసులు, ఇతర భద్రతా దళాలతో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులు ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నారు.

జమ్ముకశ్మీర్​లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

షోపియాన్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్ చౌదరి ముహ్మద్ యాసిన్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. ఇతర జిల్లాల్లోనూ సంబంధిత డిప్యూటీ కమిషనర్లు జెండాను ఆవిష్కరించారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

Jammu and Kashmi : Pakage, Army celebrates ID with persons with disabilities
వేడుకల్లో పాల్గొన్న పోలీసులు
Jammu and Kashmi : Pakage, Army celebrates ID with persons with disabilities
వేడుకల్లో పాల్గొన్న అధికారులు

పుల్వామా జిల్లాలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. కుల్గాం​లోనూ వేడుకలు జరగగా, కరోనా విజృంభణ నేపథ్యంలో పోలీసుల కవాతును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. బందిపొరా జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ మన్సాబ్​ అధికారులు.. దివ్యాంగులతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి కావాల్సిన పరికరాలను అందజేశారు.

ఇదీ చూడండి ప్రధాని మోదీ స్వాతంత్ర్య ప్రసంగంలో హైలైట్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.