ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- నలుగురు ముష్కరులు హతం​

author img

By

Published : Nov 19, 2020, 7:40 AM IST

Updated : Nov 19, 2020, 10:55 AM IST

encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్

10:53 November 19

జ‌మ్ముక‌శ్మీర్‌ న‌గ్రోటాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బాన్ టోల్‌ప్లాజా సమీపంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు నిర‌్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈక్రమంలో తారసపడిన ముష్కరులు బలగాలపై కాల్పులు జరిపారు. తేరుకుని భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఘటనా స్థలం నుంచి 11 ఏకే-47 ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ నలుగురు ముష్కరులు జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలనానికి సమీపంలో ఉన్న జ‌మ్ము-శ్రీన‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిని మూసివేశారు పోలీసులు. న‌గ్రోటా చెక్‌పోస్ట్ ప్రాంతంలో భ‌ద్రత‌ను క‌ట్టుదిట్టం చేశారు.

07:37 November 19

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- నలుగురు ముష్కరులు హతం​

  • #WATCH Jammu and Kashmir: An encounter is underway near Ban toll plaza in Nagrota, Jammu. Security tightened, Jammu-Srinagar National Highway closed. More details awaited.

    (Visuals deferred by unspecified time) pic.twitter.com/PYI1KI0ykH

    — ANI (@ANI) November 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్​కౌంటర్​లో నలుగురు ముష్కరులు హతమైనట్లు సమాచారం. బాన్ టోల్‌ప్లాజా సమీపంలో ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. జమ్ము-శ్రీనగర్ జాతీయరహదారిని భద్రతా దళాలు మూసివేశాయి. నగ్రోటా చెక్‌పోస్టు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.

10:53 November 19

జ‌మ్ముక‌శ్మీర్‌ న‌గ్రోటాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బాన్ టోల్‌ప్లాజా సమీపంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు నిర‌్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈక్రమంలో తారసపడిన ముష్కరులు బలగాలపై కాల్పులు జరిపారు. తేరుకుని భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఘటనా స్థలం నుంచి 11 ఏకే-47 ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ నలుగురు ముష్కరులు జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలనానికి సమీపంలో ఉన్న జ‌మ్ము-శ్రీన‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిని మూసివేశారు పోలీసులు. న‌గ్రోటా చెక్‌పోస్ట్ ప్రాంతంలో భ‌ద్రత‌ను క‌ట్టుదిట్టం చేశారు.

07:37 November 19

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- నలుగురు ముష్కరులు హతం​

  • #WATCH Jammu and Kashmir: An encounter is underway near Ban toll plaza in Nagrota, Jammu. Security tightened, Jammu-Srinagar National Highway closed. More details awaited.

    (Visuals deferred by unspecified time) pic.twitter.com/PYI1KI0ykH

    — ANI (@ANI) November 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్​కౌంటర్​లో నలుగురు ముష్కరులు హతమైనట్లు సమాచారం. బాన్ టోల్‌ప్లాజా సమీపంలో ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. జమ్ము-శ్రీనగర్ జాతీయరహదారిని భద్రతా దళాలు మూసివేశాయి. నగ్రోటా చెక్‌పోస్టు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.

Last Updated : Nov 19, 2020, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.