ETV Bharat / bharat

జైట్లీ ఆరోగ్యం మరింత విషమం- ఆస్పత్రికి నేతలు

కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్​ నేత అరుణ్​ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను లైఫ్​ సపోర్ట్​ సిస్టమ్​పై ఉంచినట్లు దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు తెలిపారు. జైట్లీని చూసేందుకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర నేతలు ఆస్పత్రికి తరలివస్తున్నారు.

author img

By

Published : Aug 17, 2019, 5:14 PM IST

Updated : Sep 27, 2019, 7:31 AM IST

జైట్లీ ఆరోగ్యం మరింత విషమం- ఆస్పత్రికి నేతలు

శ్వాస సంబంధిత సమస్యతో దిల్లీ ఎయిమ్స్​లో చేరిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను లైఫ్​ సపోర్ట్ సిస్టమ్​పై ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. ఎక్స్​ట్రా కార్పోరియల్​ మెంబ్రేన్​ ఆక్సిజనేషన్​ (ఈసీఎంఓ)ను అమర్చినట్లు తెలిపారు. కిడ్నీలు, గుండె పనితీరు మందగించినప్పుడు ఈసీఎంఓను ఉపయోగిస్తారు.

ఆస్పత్రికి పలువురు నేతలు...

కేంద్ర మంత్రులు పియూష్​ గోయల్​, హర్షవర్ధన్​, బిహార్​ ముఖ్యమంత్రి నితీష్​ కుమార్​, కాంగ్రెస్​ నేతలు అభిషేక్​ మను సింఘ్వీ, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీరేందర్​ సింగ్​ ధనోవా, భాజపా నేత సతీష్​ ఉపాధ్యాయ... ఎయిమ్స్​కు చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థతిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

ఆస్పత్రికి వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు ట్వీట్​ చేశారు బీఎస్పీ అధినేత్ర మాయావతి. జైట్లీ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Jaitley
మాయావతి ట్వీట్​

ఇదీ చూడండి: మంత్రుల బృందం భేటీలో అణు విధానంపైనే చర్చ!

శ్వాస సంబంధిత సమస్యతో దిల్లీ ఎయిమ్స్​లో చేరిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను లైఫ్​ సపోర్ట్ సిస్టమ్​పై ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. ఎక్స్​ట్రా కార్పోరియల్​ మెంబ్రేన్​ ఆక్సిజనేషన్​ (ఈసీఎంఓ)ను అమర్చినట్లు తెలిపారు. కిడ్నీలు, గుండె పనితీరు మందగించినప్పుడు ఈసీఎంఓను ఉపయోగిస్తారు.

ఆస్పత్రికి పలువురు నేతలు...

కేంద్ర మంత్రులు పియూష్​ గోయల్​, హర్షవర్ధన్​, బిహార్​ ముఖ్యమంత్రి నితీష్​ కుమార్​, కాంగ్రెస్​ నేతలు అభిషేక్​ మను సింఘ్వీ, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీరేందర్​ సింగ్​ ధనోవా, భాజపా నేత సతీష్​ ఉపాధ్యాయ... ఎయిమ్స్​కు చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థతిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

ఆస్పత్రికి వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు ట్వీట్​ చేశారు బీఎస్పీ అధినేత్ర మాయావతి. జైట్లీ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Jaitley
మాయావతి ట్వీట్​

ఇదీ చూడండి: మంత్రుల బృందం భేటీలో అణు విధానంపైనే చర్చ!

Special Advisory
Saturday 17th August 2019.
SNTV clients please note:
SNOOKER: Sheffield. Hong Kong snooker star Ng On-yee speaks to SNTV ahead of the Women's Tour Championship at the Crucible in Sheffield, England.
This is a change to Saturday's Early Prospects, where we suggested that there would be highlights coverage.
Apologies for any inconvenience.
Regards,
SNTV London.
Last Updated : Sep 27, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.