ETV Bharat / bharat

దేశంలో తొలి కరోనా బాధితురాలు ఇప్పుడేం చేస్తోందంటే? - కేరళలో కరోనా వైరస్​

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 33వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో తొలి కేసు నమోదైంది మాత్రం జనవరి 30న . బాధితురాలు కేరళకు చెందిన యువతి. ఇప్పుడు ఆమె ఏం చేస్తోంది? ఆమె ఆరోగ్యం ఎలా ఉంది?

Its back to study time for India's first COVID-19 patient
భారత తొలి కరోనా బాధితురాలి కథ
author img

By

Published : May 1, 2020, 8:07 AM IST

భారత్​లో తొలి కరోనా కేసు జనవరి 30న కేరళలో నమోదైంది. బాధితురాలు వుహాన్​లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ యువతి. అప్పటికి కొన్ని రోజుల ముందే ఆమె వుహాన్​ నుంచి కేరళకు తిరిగొచ్చింది. వైరస్​తో పోరాడి జయించిన ఆమె.. ఇప్పుడు తిరిగి వుహాన్​కు వెళ్లడానికి ఎదురుచూస్తోంది.

భయపడలేదు...

వుహాన్​లో వైద్య విద్యను అభ్యసిస్తున్న 20ఏళ్ల ఆమె.. సెమిస్టర్​ సెలవుల కోసం జనవరి నెలలో కేరళకు వచ్చింది. వైరస్​ లక్షణాలతో అదే నెల 27న ఆసుపత్రిలో చేరింది. 30న ఆమెకు వైరస్​ సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఫలితంగా భారత్​లో తొలి కరోనా కేసు నమోదైంది.

దాదాపు మూడు వారాల చికిత్స అనంతరం ఆమె పూర్తిగా కొలుకుంది. రెండు సార్లు వైరస్​ నెగిటివ్​గా తేలిన అనంతరం ఫిబ్రవరి 20న డిశ్ఛార్జ్​ అయ్యింది. తనకు వైరస్​ సోకినట్టు తెలిసినప్పుడు అసలు భయపడలేదని పేర్కొంది బాధితురాలు.

"నాకు వైరస్​ సోకిన సమయానికే.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వైరస్​ బారిన పడ్డారు. వారిలో చాలా మంది కోలుకున్నారు. అందుకే నేను భయపడలేదు. చైనా నుంచి వస్తున్నప్పుడు.. అధికారులను సంప్రదించమని అక్కడి భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించు కోవాలని తెలిపింది."

- దేశంలోని తొలి వైరస్​ బాధితురాలు

అప్పటి నుంచి ఆమె కేరళ ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూనే ఉంది. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది.

'వుహాన్​కు తిరిగి వెళ్లాలని ఉంది...'

ప్రస్తుతం ఇంట్లో ఉంటూనే.. వుహాన్​లోని తన వర్సిటీ నిర్వహిస్తున్న ఆన్​లైన్​ తరగతుల ద్వారా విద్యను అభ్యసిస్తోంది బాధితురాలు. వుహాన్​కు వెళ్లడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు స్పష్టం చేసింది.

"వుహాన్​కు తిరిగి వెళ్లాలని ఉంది. ప్రస్తుతానికి వర్సటీ ఏర్పాటు చేసిన ఆన్​లైన్​ క్లాసులకు హాజరవుతున్నా. నాకు వంట చేయడం ఎంతో ఇష్టం. వుహాన్​లోని నా హాస్టల్​లో వంట గది ఉండేది. అక్కడ నా వంట నేనే చేసుకునేదాన్ని. ఇప్పుడు మా అమ్మకు వంటలో సహాయం చేస్తున్నా. సమోసాలు, కట్లెట్లు చేస్తున్నా."

-- దేశంలోని తొలి వైరస్​ బాధితురాలు.

బుధవారం నాటికి కేరళవ్యాప్తంగా 485 కరోనా కేసులు నమోదయయ్యాయి. ఇందులో 123 యాక్టివ్​ కేసులున్నాయి. వైరస్​ విజృంభించిన తొలినాళ్లల్లో భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయినా.. వైరస్​ను నియంత్రించడంలో కేరళ ప్రభుత్వం విజయం సాధించింది.

భారత్​లో తొలి కరోనా కేసు జనవరి 30న కేరళలో నమోదైంది. బాధితురాలు వుహాన్​లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ యువతి. అప్పటికి కొన్ని రోజుల ముందే ఆమె వుహాన్​ నుంచి కేరళకు తిరిగొచ్చింది. వైరస్​తో పోరాడి జయించిన ఆమె.. ఇప్పుడు తిరిగి వుహాన్​కు వెళ్లడానికి ఎదురుచూస్తోంది.

భయపడలేదు...

వుహాన్​లో వైద్య విద్యను అభ్యసిస్తున్న 20ఏళ్ల ఆమె.. సెమిస్టర్​ సెలవుల కోసం జనవరి నెలలో కేరళకు వచ్చింది. వైరస్​ లక్షణాలతో అదే నెల 27న ఆసుపత్రిలో చేరింది. 30న ఆమెకు వైరస్​ సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఫలితంగా భారత్​లో తొలి కరోనా కేసు నమోదైంది.

దాదాపు మూడు వారాల చికిత్స అనంతరం ఆమె పూర్తిగా కొలుకుంది. రెండు సార్లు వైరస్​ నెగిటివ్​గా తేలిన అనంతరం ఫిబ్రవరి 20న డిశ్ఛార్జ్​ అయ్యింది. తనకు వైరస్​ సోకినట్టు తెలిసినప్పుడు అసలు భయపడలేదని పేర్కొంది బాధితురాలు.

"నాకు వైరస్​ సోకిన సమయానికే.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వైరస్​ బారిన పడ్డారు. వారిలో చాలా మంది కోలుకున్నారు. అందుకే నేను భయపడలేదు. చైనా నుంచి వస్తున్నప్పుడు.. అధికారులను సంప్రదించమని అక్కడి భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించు కోవాలని తెలిపింది."

- దేశంలోని తొలి వైరస్​ బాధితురాలు

అప్పటి నుంచి ఆమె కేరళ ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూనే ఉంది. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది.

'వుహాన్​కు తిరిగి వెళ్లాలని ఉంది...'

ప్రస్తుతం ఇంట్లో ఉంటూనే.. వుహాన్​లోని తన వర్సిటీ నిర్వహిస్తున్న ఆన్​లైన్​ తరగతుల ద్వారా విద్యను అభ్యసిస్తోంది బాధితురాలు. వుహాన్​కు వెళ్లడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు స్పష్టం చేసింది.

"వుహాన్​కు తిరిగి వెళ్లాలని ఉంది. ప్రస్తుతానికి వర్సటీ ఏర్పాటు చేసిన ఆన్​లైన్​ క్లాసులకు హాజరవుతున్నా. నాకు వంట చేయడం ఎంతో ఇష్టం. వుహాన్​లోని నా హాస్టల్​లో వంట గది ఉండేది. అక్కడ నా వంట నేనే చేసుకునేదాన్ని. ఇప్పుడు మా అమ్మకు వంటలో సహాయం చేస్తున్నా. సమోసాలు, కట్లెట్లు చేస్తున్నా."

-- దేశంలోని తొలి వైరస్​ బాధితురాలు.

బుధవారం నాటికి కేరళవ్యాప్తంగా 485 కరోనా కేసులు నమోదయయ్యాయి. ఇందులో 123 యాక్టివ్​ కేసులున్నాయి. వైరస్​ విజృంభించిన తొలినాళ్లల్లో భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయినా.. వైరస్​ను నియంత్రించడంలో కేరళ ప్రభుత్వం విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.