ETV Bharat / bharat

కరోనా బాధితుల కోసం సైన్యం, ఐటీబీపీ వైద్య శిబిరాలు

author img

By

Published : Jan 31, 2020, 11:32 PM IST

Updated : Feb 28, 2020, 5:40 PM IST

ఇండో-టిబెటన్​ బోర్డర్​ పోలీస్​(ఐటీబీపీ) ఆధ్వర్యంలో.. కరోనా బాధితుల కోసం దిల్లీలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. 25మంది వైద్యుల బృందం, 600 పడకలతో ఐటీబీపీ ప్రధాన కార్యాలయం వద్ద ఈ శిబిరాన్ని నెలకొల్పినట్లు వెల్లడించారు. ఐటీబీపీ మార్గంలోనే సైన్యం కూడా.. భారతీయ విద్యార్థుల కోసం దిల్లీ మానేసర్​ వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాాటు చేసింది.

ITBP sets up 600-bedded quarantine facility in south Delhi
ఐటీబీపీ ఆధ్వర్యంలో.. కరోనా బాధితులకు ప్రత్యేక శిబిరం

కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్​... ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ తరుణంలో ముందు జాగ్రత్తగా కరోనా అనుమానితులకు ప్రథమ చికిత్స అందించడానికి దిల్లీలో 600 పడకలతో ప్రత్యేక శిబిరాన్ని... సరిహద్దు భద్రత దళమైన ఇండో-టిబెటన్​ బోర్డర్​ పోలీస్​(ఐటీబీపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

600 పడకలతో..

నైరుతి దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో ఐటీబీపీ ప్రధాన కార్యాలయం వద్ద 15 మంది సఫ్దర్​జంగ్​ ఆసుపత్రికి చెందిన వైద్యులు, 10మంది ఐటీబీపీ సిబ్బందితో మొత్తం 25మంది వైద్యుల బృందం ఈ శిబిరంలో పనిచేయనున్నట్లు ఆ దళానికి చెందిన ఉన్నతాధికారి వివేక్ పాండే తెలిపారు. 600 పడకలతో ఈ శిబిరాన్ని నెలకొల్పినట్లు స్పష్టం చేశారు.

''ఈ శిబిరాన్ని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశాం. ఇందులో పిల్లలు, మహిళలకు ప్రత్యేక వార్డులు కేటాయించాం. చైనా నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలో స్కీనింగ్​ టెస్టు నిర్వహించి, తరువాత బాధితులను ఈ శిబిరానికి తీసుకొస్తారు.''
-వివేక్​ కుమార్ పాండే

ఐటీబీపీ పంథాలోనే సైన్యం

చైనాలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక విమానాన్ని పంపించింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చైనాలోని హుబే రాష్ట్రం నుంచి రాబోతున్న 300మంది విద్యార్థుల కోసం దేశ రాజధానికి సమీపంలోని మానేసర్​ వద్ద భారత సైన్యం వైద్య శిబిరాన్నిఏర్పాటు చేసింది. విద్యార్థులు ఇక్కడ రెండు వారాల పాటు వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంటారని సైన్యాధికారి ఒకరు తెలిపారు.

ఐటీబీపీ ఆధ్వర్యంలో.. కరోనా బాధితులకు ప్రత్యేక శిబిరం

ఇదీ చదవండి: బ్రిటన్​కు కరోనా భూతం- రెండు కేసులు నిర్ధరణ

కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్​... ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ తరుణంలో ముందు జాగ్రత్తగా కరోనా అనుమానితులకు ప్రథమ చికిత్స అందించడానికి దిల్లీలో 600 పడకలతో ప్రత్యేక శిబిరాన్ని... సరిహద్దు భద్రత దళమైన ఇండో-టిబెటన్​ బోర్డర్​ పోలీస్​(ఐటీబీపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

600 పడకలతో..

నైరుతి దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో ఐటీబీపీ ప్రధాన కార్యాలయం వద్ద 15 మంది సఫ్దర్​జంగ్​ ఆసుపత్రికి చెందిన వైద్యులు, 10మంది ఐటీబీపీ సిబ్బందితో మొత్తం 25మంది వైద్యుల బృందం ఈ శిబిరంలో పనిచేయనున్నట్లు ఆ దళానికి చెందిన ఉన్నతాధికారి వివేక్ పాండే తెలిపారు. 600 పడకలతో ఈ శిబిరాన్ని నెలకొల్పినట్లు స్పష్టం చేశారు.

''ఈ శిబిరాన్ని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశాం. ఇందులో పిల్లలు, మహిళలకు ప్రత్యేక వార్డులు కేటాయించాం. చైనా నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలో స్కీనింగ్​ టెస్టు నిర్వహించి, తరువాత బాధితులను ఈ శిబిరానికి తీసుకొస్తారు.''
-వివేక్​ కుమార్ పాండే

ఐటీబీపీ పంథాలోనే సైన్యం

చైనాలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక విమానాన్ని పంపించింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చైనాలోని హుబే రాష్ట్రం నుంచి రాబోతున్న 300మంది విద్యార్థుల కోసం దేశ రాజధానికి సమీపంలోని మానేసర్​ వద్ద భారత సైన్యం వైద్య శిబిరాన్నిఏర్పాటు చేసింది. విద్యార్థులు ఇక్కడ రెండు వారాల పాటు వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంటారని సైన్యాధికారి ఒకరు తెలిపారు.

ఐటీబీపీ ఆధ్వర్యంలో.. కరోనా బాధితులకు ప్రత్యేక శిబిరం

ఇదీ చదవండి: బ్రిటన్​కు కరోనా భూతం- రెండు కేసులు నిర్ధరణ

Last Updated : Feb 28, 2020, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.