చంద్రయాన్-2 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్తో చివరి నిమిషంలో సంబంధాలు కోల్పోయినప్పటికీ.. దేశ ప్రజలు తమకు మద్దతుగా నిలిచారని తెలిపింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది.
" మాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆకాంక్షలు, కలలే ఊపిరిగా ముందుకు సాగుతాం. ఎల్లప్పుడూ ఆకాశమే లక్ష్యంగా సాగాలని మమ్మల్ని ఉత్తేజితుల్ని చేసినందుకు ధన్యవాదాలు."
- ఇస్రో
ఈ 7న జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలు మోపేందుకు ఎంతో ప్రతిష్టాత్మంగా చంద్రయాన్-2ను ప్రయోగించింది ఇస్రో. అయితే చంద్రుడికి కేవలం 400 మీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్తో కమ్యూనికేషన్ కోల్పోయారు శాస్త్రవేత్తలు. అయినప్పటికీ ప్రధాని మోదీ నుంచి సామాన్య పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ ఇస్రో ప్రయత్నానికి అండగా నిలిచారు.
ధైర్యం చెప్పిన ప్రధాని..
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే అద్భుత దృశ్యాలను ప్రత్యక్షంగా చూసేందుకు బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లిన మోదీ.. " మీ ముఖాల్లో నాకు నిరాశ కనిపిస్తోంది. చంద్రయాన్ ప్రయత్నంలో చింతించాల్సిన అవసరం లేదు. మనం ఎంతో నేర్చుకున్నాం." అని శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. సైన్స్లో పరాజయం అనే పదం ఉండదని... ప్రయత్నం చేసే కొద్దీ మనకు జ్ఞానం వస్తూనే ఉంటుందంటూ.. శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకున్నారు దేశ ప్రజలు.
ఫలితం లేదు
సెప్టెంబర్ 7 నుంచి విక్రమ్తో భూ కేంద్ర సంబంధాల పునరుద్ధరణకు నిరంతరాయంగా కృషి చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.