ETV Bharat / bharat

ఐఎన్​ఎక్స్​: చిదంబరం నిర్బంధ విచారణ పొడిగింపు

author img

By

Published : Sep 2, 2019, 8:04 PM IST

Updated : Sep 29, 2019, 5:07 AM IST

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కస్టడీని మరో రోజు పొడిగిస్తూ దిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. చిదంబరం దాఖలు చేసిన మధ్యంతర బెయిల్​ పిటిషన్​పై మంగళవారం విచారణ జరపనుంది.

చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సీబీఐ కస్టడీని దిగువ కోర్టు మరోరోజు పొడిగించింది. నేటితో 3 రోజుల గడువు ముగిసిన నేపథ్యంలో చిదంబరంను దిల్లీ కోర్టు ముందు హాజరు పరిచారు సీబీఐ అధికారులు.

చిదంబరం అరెస్టును సవాలు చేస్తూ మధ్యంతర బెయిల్​ పిటిషన్​ను దాఖలు చేశారు ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్. ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదని సీబీఐ తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వాదనలు వినిపించారు.

"పౌరులందరినీ సమానంగా చూడాలి. వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ వర్తించాలి. ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏముంది? నిర్బంధ విచారణను మరో రోజు పొడిగించాలి."

- తుషార్​ మెహతా, సొలిసిటర్​ జనరల్

ఈ కేసు ప్రత్యేకమైనందునే మెహతా వాదిస్తున్నారని చిదంబరం తరఫు మరో న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ సమాధానమిచ్చారు. ఈ కేసులో చిదంబరానికి ఉపశమనం కల్పించేందుకు సీబీఐ అంగీకరించలేదు. విచారణ నిమిత్తం కస్టడీ పొడిగించాలని కోరింది. ఈ మేరకు మరో రోజు కస్టడీకి అనుమతిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ అజయ్​కుమార్​ కుహర్​ తీర్పునిచ్చారు.

అంతకుముందు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలించాలని సీబీఐ కోర్టుకు అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

ఇదీ చూడండి: ఎయిర్​సెల్​ కేసులో చిదంబరం కస్టడీకి సీబీఐ, ఈడీ విజ్ఞప్తి

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సీబీఐ కస్టడీని దిగువ కోర్టు మరోరోజు పొడిగించింది. నేటితో 3 రోజుల గడువు ముగిసిన నేపథ్యంలో చిదంబరంను దిల్లీ కోర్టు ముందు హాజరు పరిచారు సీబీఐ అధికారులు.

చిదంబరం అరెస్టును సవాలు చేస్తూ మధ్యంతర బెయిల్​ పిటిషన్​ను దాఖలు చేశారు ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్. ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదని సీబీఐ తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వాదనలు వినిపించారు.

"పౌరులందరినీ సమానంగా చూడాలి. వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ వర్తించాలి. ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏముంది? నిర్బంధ విచారణను మరో రోజు పొడిగించాలి."

- తుషార్​ మెహతా, సొలిసిటర్​ జనరల్

ఈ కేసు ప్రత్యేకమైనందునే మెహతా వాదిస్తున్నారని చిదంబరం తరఫు మరో న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ సమాధానమిచ్చారు. ఈ కేసులో చిదంబరానికి ఉపశమనం కల్పించేందుకు సీబీఐ అంగీకరించలేదు. విచారణ నిమిత్తం కస్టడీ పొడిగించాలని కోరింది. ఈ మేరకు మరో రోజు కస్టడీకి అనుమతిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ అజయ్​కుమార్​ కుహర్​ తీర్పునిచ్చారు.

అంతకుముందు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలించాలని సీబీఐ కోర్టుకు అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

ఇదీ చూడండి: ఎయిర్​సెల్​ కేసులో చిదంబరం కస్టడీకి సీబీఐ, ఈడీ విజ్ఞప్తి

Gorakhpur (UP), Sep 02 (ANI): School students took part in a rally to spread awareness about encephalitis in Uttar Pradesh's Gorakhpur. The children with placards were seen raising slogans to spread awareness. They took to streets to make people aware of the disease. Encephalitis has been reported from many parts of India, however, it is prevalent in Eastern Uttar Pradesh. It is a mosquito-borne viral infection of the brain.
Last Updated : Sep 29, 2019, 5:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.