ETV Bharat / bharat

తమిళనాట కరోనా విజృంభణ.. కొత్తగా 5,881 కేసులు

author img

By

Published : Jul 31, 2020, 7:01 PM IST

తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 5,881 మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది. కొత్తగా 97 మంది ప్రాణాలు కోల్పోయారు.

tamilnadu
తమిళనాట కరోనా విజృంభణ.. కొత్తగా 5,881 కేసులు

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో 5,881 మందికి కరోనా సోకింది. మరో 97మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,45,859కి చేరింది. మృతుల సంఖ్య 3,935కి పెరిగింది. ప్రస్తుతం 57,968 యాక్టివ్​ కేసులున్నాయి.

యూపీలో..

రాష్ట్రం​లో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. మరో 4,453 మందికి వైరస్​ సోకింది. 24 గంటల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,15,618కి చేరింది.

దిల్లీలో కరోనా..

దేశ రాజధాని ప్రాంతంలో కొత్తగా 1,195 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 3,963కు పెరిగింది.

కేరళలో ఒక్కరోజులో 1310 మంది కరోనా బారినపడ్డారు.

ఇదీ చూడండి: సరయూ నది ఒడ్డున రఫేల్ సైకత శిల్పం

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో 5,881 మందికి కరోనా సోకింది. మరో 97మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,45,859కి చేరింది. మృతుల సంఖ్య 3,935కి పెరిగింది. ప్రస్తుతం 57,968 యాక్టివ్​ కేసులున్నాయి.

యూపీలో..

రాష్ట్రం​లో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. మరో 4,453 మందికి వైరస్​ సోకింది. 24 గంటల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,15,618కి చేరింది.

దిల్లీలో కరోనా..

దేశ రాజధాని ప్రాంతంలో కొత్తగా 1,195 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 3,963కు పెరిగింది.

కేరళలో ఒక్కరోజులో 1310 మంది కరోనా బారినపడ్డారు.

ఇదీ చూడండి: సరయూ నది ఒడ్డున రఫేల్ సైకత శిల్పం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.