ETV Bharat / bharat

'భారత జవాన్లే చైనా దళాలను రెచ్చగొట్టారు'

author img

By

Published : Sep 1, 2020, 5:22 PM IST

Updated : Sep 1, 2020, 5:37 PM IST

ప్యాంగాంగ్​ దక్షిణ ఒడ్డున చైనా సైన్యం అతిక్రమణకు పాల్పడే క్రమంలో తమ జవాన్లు వారి ప్రయత్నాలను వమ్ము చేశారన్న భారత్​ వాదనను చైనా దౌత్యవేత్త జీ రోంగ్​ ఖండించారు.​ భారత జవాన్లు సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడి చైనా దళాలను కవ్విస్తున్నాయని ఆరోపించారు.

Indian troops violated the consensus reached in previous multi-level engagements: China
'భారత జవాన్లే చైనా దళాలను రెచ్చగొట్టారు'

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్​లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి, దౌత్యవేత్త జీ రోంగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. గత నెల 29-30 మధ్యరాత్రి ప్యాంగాంగ్​ దక్షిణ ఒడ్డున తమ సైన్యం అతిక్రమణకు పాల్పడలేదని వెల్లడించారు. చైనా ప్రయత్నాలను తమ జవాన్లు వమ్ము చేశారన్న భారత్​ వాదనను ఆయన ఖండించారు. భారత జవాన్లే అతిక్రమణకు పాల్పడి సరిహద్దులో శాంతికి విఘాతం కలిగించారని ఆరోపించారు.

"గతంలో జరిగిన చర్చల్లో సంప్రదింపుల ద్వారా కుదిరిన అంగీకారాన్ని భారత్​ ఉల్లంఘించింది. ప్యాంగాంగ్​లోని దక్షిణ ఒడ్డున ఉన్న ఎల్​ఏసీ, చైనా-భారత్​ సరిహద్దు వెంబడి ఉన్న రెఖిన్​ పాస్​ వద్ద అతిక్రమణకు పాల్పడింది. చైనా దళాలను రెచ్చగొట్టింది. దీంతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. భారత చర్యలు చైనా సార్వభౌమాధికారాన్ని, సంబంధిత ఒప్పందాలను ఉల్లంఘించాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు ఎంతో కాలంగా జరుపుతున్న చర్చలకు ఈ చర్యలు విఘాతం కలిగించాయి. దీనిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది."

--- జీ రోంగ్​, చైనా దౌత్యవేత్త.

సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా తీవ్రంగా కృషిచేస్తోందన్న జీ రోంగ్​.. భారత్​ కూడా ఇందుకు సహకరించాలని అభ్యర్థించారు. తమ దళాలను భారత్​ అదుపులో పెట్టుకోవాలని, రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని సూచించారు. వాస్తవాధీన రేఖను అక్రమంగా దాటుతున్న దళాలను తక్షణమే ఉపసంహరించుకుని.. చర్చల్లో ద్వారా కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:-

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్​లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి, దౌత్యవేత్త జీ రోంగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. గత నెల 29-30 మధ్యరాత్రి ప్యాంగాంగ్​ దక్షిణ ఒడ్డున తమ సైన్యం అతిక్రమణకు పాల్పడలేదని వెల్లడించారు. చైనా ప్రయత్నాలను తమ జవాన్లు వమ్ము చేశారన్న భారత్​ వాదనను ఆయన ఖండించారు. భారత జవాన్లే అతిక్రమణకు పాల్పడి సరిహద్దులో శాంతికి విఘాతం కలిగించారని ఆరోపించారు.

"గతంలో జరిగిన చర్చల్లో సంప్రదింపుల ద్వారా కుదిరిన అంగీకారాన్ని భారత్​ ఉల్లంఘించింది. ప్యాంగాంగ్​లోని దక్షిణ ఒడ్డున ఉన్న ఎల్​ఏసీ, చైనా-భారత్​ సరిహద్దు వెంబడి ఉన్న రెఖిన్​ పాస్​ వద్ద అతిక్రమణకు పాల్పడింది. చైనా దళాలను రెచ్చగొట్టింది. దీంతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. భారత చర్యలు చైనా సార్వభౌమాధికారాన్ని, సంబంధిత ఒప్పందాలను ఉల్లంఘించాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు ఎంతో కాలంగా జరుపుతున్న చర్చలకు ఈ చర్యలు విఘాతం కలిగించాయి. దీనిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది."

--- జీ రోంగ్​, చైనా దౌత్యవేత్త.

సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా తీవ్రంగా కృషిచేస్తోందన్న జీ రోంగ్​.. భారత్​ కూడా ఇందుకు సహకరించాలని అభ్యర్థించారు. తమ దళాలను భారత్​ అదుపులో పెట్టుకోవాలని, రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని సూచించారు. వాస్తవాధీన రేఖను అక్రమంగా దాటుతున్న దళాలను తక్షణమే ఉపసంహరించుకుని.. చర్చల్లో ద్వారా కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:-

Last Updated : Sep 1, 2020, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.