ETV Bharat / bharat

భారత్-​ చైనా మధ్య వరుసగా మూడో దఫా చర్చలు

author img

By

Published : Jun 18, 2020, 3:47 PM IST

Updated : Jun 18, 2020, 4:11 PM IST

భారత్​ చైనా.. వరుసగా మూడో రోజు మేజర్ జనరల్స్ స్థాయి చర్చలు జరిపాయి. తూర్పు లద్దాక్​ గాల్వన్ లోయ నుంచి ఇరుదేశాల సైనిక బలగాలను ఉపసంహరించడం, సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ చర్చలు నిర్వహించాయి.

Indian, Chinese armies hold Major General-level talks for third straight day
భారత్​ చైనా మధ్య మూడో దఫా చర్చలు

తూర్పు లద్దాక్​ గాల్వన్​ లోయ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లబరిచేందుకు భారత్​-చైనాలు వరుసగా మూడో రోజు మేజర్ జనరల్స్ స్థాయిలో చర్చలు జరిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలు తమ సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడం సహా.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇరుదేశాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

గాల్వన్​ లోయ వద్ద చెలరేగిన ఉద్రిక్తతలను చల్లబరిచేందుకు మంగళవారం, బుధవారం జరిపిన చర్చల్లో సానుకూల ఫలితాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ మరో దఫా చర్చలు నిర్వహించారు.

ఘర్షణ

తూర్పు లద్దాక్​లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ.. ఈ నెల ప్రారంభంలోనే భారత్​ చైనా మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు సైనిక బలగాలు సరిహద్దుల నుంచి వెనక్కి మళ్లాలి. అయితే ఈ ప్రక్రియ జరుగుతుండగా.. ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.

ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు 43 మంది చైనా సైనికులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరుదేశాల సైన్యాలు మరోమారు సమావేశమయ్యాయి.

దీటుగా బదులిస్తాం..

చైనా బరితెగింపుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. సరిహద్దుల్లో శాంతి స్థాపనకే భారత్​ కట్టుబడి ఉందన్న ఆయన.. దేశ సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. శ్రుతి మించితే దీటైన సమాధానం ఇచ్చే సత్తా భారత్​కు ఉందని హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'రథయాత్రకు అనుమతిస్తే జగన్నాథుడు క్షమించడు'

తూర్పు లద్దాక్​ గాల్వన్​ లోయ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లబరిచేందుకు భారత్​-చైనాలు వరుసగా మూడో రోజు మేజర్ జనరల్స్ స్థాయిలో చర్చలు జరిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలు తమ సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడం సహా.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇరుదేశాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

గాల్వన్​ లోయ వద్ద చెలరేగిన ఉద్రిక్తతలను చల్లబరిచేందుకు మంగళవారం, బుధవారం జరిపిన చర్చల్లో సానుకూల ఫలితాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ మరో దఫా చర్చలు నిర్వహించారు.

ఘర్షణ

తూర్పు లద్దాక్​లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ.. ఈ నెల ప్రారంభంలోనే భారత్​ చైనా మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు సైనిక బలగాలు సరిహద్దుల నుంచి వెనక్కి మళ్లాలి. అయితే ఈ ప్రక్రియ జరుగుతుండగా.. ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.

ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు 43 మంది చైనా సైనికులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరుదేశాల సైన్యాలు మరోమారు సమావేశమయ్యాయి.

దీటుగా బదులిస్తాం..

చైనా బరితెగింపుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. సరిహద్దుల్లో శాంతి స్థాపనకే భారత్​ కట్టుబడి ఉందన్న ఆయన.. దేశ సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. శ్రుతి మించితే దీటైన సమాధానం ఇచ్చే సత్తా భారత్​కు ఉందని హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'రథయాత్రకు అనుమతిస్తే జగన్నాథుడు క్షమించడు'

Last Updated : Jun 18, 2020, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.