ETV Bharat / bharat

ఇంధన బంధమే లక్ష్యంగా... మోదీ హ్యూస్టన్ సభ

అమెరికాతో ఇంధన బంధమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ హ్యూస్టన్​లో పర్యటిస్తున్నారు. హౌదీ-మోదీ కార్యక్రమం ద్వారా ఈ లక్ష్యం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల మద్దతు పొందడమే లక్ష్యంగా ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

author img

By

Published : Sep 21, 2019, 5:37 AM IST

Updated : Oct 1, 2019, 10:00 AM IST

ఇంధన బంధమే లక్ష్యంగా... మోదీ హ్యూస్టన్ సభ

అమెరికా హ్యూస్టన్​ నగరాన్ని హౌదీ మోదీ నినాదం ఊపేస్తోంది. ఈ నెల 22న జరిగే ఈ కార్యక్రమంలో 50 వేలకుపైగా ప్రవాసభారతీయులు, చట్టసభ సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

చమురు కోసం..

భారత్​కు ప్రధాన చమురు ఎగుమతిదారు ఇరాన్​. ప్రస్తుతం ఇరాన్​పై అమెరికా పలు ఆంక్షలు అమలుచేస్తోంది. ఫలితంగా భారత్​కు ఇరాన్​ నుంచి చమురు దిగుమతులు ఆగిపోయాయి. భారత్​ మరో దేశంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అమెరికా వైపు చూస్తోంది. అమెరికా చమురు వ్యాపారులకూ భారత్​ అవకాశాల మార్కెట్​గా కనిపిస్తోంది. మరో వైపు వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను చైనా నిలిపివేసింది. ఫలితంగా భారత్​-అమెరికా ఇంధన భాగస్వామ ఒప్పందం కుదిరింది.

అందుకే ప్రపంచ చమురు రాజధానుల్లో ఒకటైన హ్యూస్టన్​లో దాదాపు 16 చమురు కంపెనీల సీఈఓలతో మోదీ రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించనున్నారు.

అంతకు మించి

హ్యూస్టన్​ నగరంతో భారత్​కు అవినాభావ సంబంధం ఉంది. భారత్​-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యంలో హ్యూస్టన్ నాలుగో అతిపెద్ద గేట్​వే. ఈ వ్యాపారం విలువ సుమారు 430 కోట్ల డాలర్లు.

హ్యూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సుమారు 28 కంపెనీలు భారత్​లో 69 అనుబంధ కంపెనీలను నిర్వహిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు భారత్​లో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడం మోదీ లక్ష్యం. అలాగే ప్రవాస భారతీయుల్ని.. మాతృదేశానికి సేవలందించేలా కార్యోన్ముఖులను చేయడమూ మోదీ ముందున్న కర్తవ్యం.

ట్రంప్​కు అది కావాలి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్నారు. కనుక హ్యూస్టన్​లోని ప్రవాస భారతీయుల మద్దతు అవసరం. డెమోక్రాట్లకు మద్దతు పలికే భారతీయుల్ని ఈ మారు ఎలాగైనా రిపబ్లికన్ పార్టీవైపు తిప్పుకోవడం ట్రంప్ ప్రధాన లక్ష్యం. అలాగే భారత్ వ్యవసాయం, పాడి పరిశ్రమల్లో అమెరికా బహుళజాతి కంపెనీలు పాలుపంచుకునేందుకు అవకాశం దొరకబుచ్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి: వేలాది 'నకిలీ వార్తల' ఖాతాలపై ట్విట్టర్​ వేటు

అమెరికా హ్యూస్టన్​ నగరాన్ని హౌదీ మోదీ నినాదం ఊపేస్తోంది. ఈ నెల 22న జరిగే ఈ కార్యక్రమంలో 50 వేలకుపైగా ప్రవాసభారతీయులు, చట్టసభ సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

చమురు కోసం..

భారత్​కు ప్రధాన చమురు ఎగుమతిదారు ఇరాన్​. ప్రస్తుతం ఇరాన్​పై అమెరికా పలు ఆంక్షలు అమలుచేస్తోంది. ఫలితంగా భారత్​కు ఇరాన్​ నుంచి చమురు దిగుమతులు ఆగిపోయాయి. భారత్​ మరో దేశంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అమెరికా వైపు చూస్తోంది. అమెరికా చమురు వ్యాపారులకూ భారత్​ అవకాశాల మార్కెట్​గా కనిపిస్తోంది. మరో వైపు వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను చైనా నిలిపివేసింది. ఫలితంగా భారత్​-అమెరికా ఇంధన భాగస్వామ ఒప్పందం కుదిరింది.

అందుకే ప్రపంచ చమురు రాజధానుల్లో ఒకటైన హ్యూస్టన్​లో దాదాపు 16 చమురు కంపెనీల సీఈఓలతో మోదీ రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించనున్నారు.

అంతకు మించి

హ్యూస్టన్​ నగరంతో భారత్​కు అవినాభావ సంబంధం ఉంది. భారత్​-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యంలో హ్యూస్టన్ నాలుగో అతిపెద్ద గేట్​వే. ఈ వ్యాపారం విలువ సుమారు 430 కోట్ల డాలర్లు.

హ్యూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సుమారు 28 కంపెనీలు భారత్​లో 69 అనుబంధ కంపెనీలను నిర్వహిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు భారత్​లో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడం మోదీ లక్ష్యం. అలాగే ప్రవాస భారతీయుల్ని.. మాతృదేశానికి సేవలందించేలా కార్యోన్ముఖులను చేయడమూ మోదీ ముందున్న కర్తవ్యం.

ట్రంప్​కు అది కావాలి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్నారు. కనుక హ్యూస్టన్​లోని ప్రవాస భారతీయుల మద్దతు అవసరం. డెమోక్రాట్లకు మద్దతు పలికే భారతీయుల్ని ఈ మారు ఎలాగైనా రిపబ్లికన్ పార్టీవైపు తిప్పుకోవడం ట్రంప్ ప్రధాన లక్ష్యం. అలాగే భారత్ వ్యవసాయం, పాడి పరిశ్రమల్లో అమెరికా బహుళజాతి కంపెనీలు పాలుపంచుకునేందుకు అవకాశం దొరకబుచ్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి: వేలాది 'నకిలీ వార్తల' ఖాతాలపై ట్విట్టర్​ వేటు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available Worldwide. Non-match footage contained within the News Service may be used. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: Metz Arena, Metz, France. 20th September 2019.
Jo-Wilfried Tsonga, France, def. Nikoloz Basilashvili (2), Georgia, 5-7, 6-3, 4-1, ret.
1. 00:00 Players at the net at coin toss
2. 00:04 Basilashvili wins first set
3. 00:22 Tsonga breaks to go 2-0 up in second set
4. 00:37 Tsonga breaks to go 4-1 up in final set
5. 00:48 Trainer called to the court  
6. 00:52 Trainer talks to Basilashvili
7. 00:56 Basilashvili retires
8. 01:00 Tsonga waves to the crowd
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:02
STORYLINE:
France's Jo-Wilfried Tsonga reached the semi-finals of the Moselle Open in Metz in France on Friday when his opponent, second seed Nikoloz Basilashvili of Georgia, retired due to an injured shoulder in the final set of their quarter-final with Tsonga leading 5-7, 6-3, 4-1.
Last Updated : Oct 1, 2019, 10:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.