ETV Bharat / bharat

15 నుంచి 'వందే భారత్ మిషన్'​ రెండో దశ

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే వందేభారత్​ మిషన్​ రెండో దశను ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండో దశలో.. మద్య ఆసియా సహా ఐరోపా దేశాలైన రష్యా, జర్మనీ, స్పెయిన్​, థాయిలాండ్​ వంటి మరిన్ని దేశాలకు ఈ మిషన్​ను విస్తరించనున్నారు.

author img

By

Published : May 8, 2020, 8:33 PM IST

Updated : May 8, 2020, 9:14 PM IST

Vande Bharat Mission
ఈనెల 15 నుంచి రెండో దశ 'వందే భారత్'​

కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందేభారత్​ మిషన్​ను మరిన్ని దేశాలకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందులో కజకిస్థాన్​​, ఉజ్బెకిస్థాన్​, రష్యా, జర్మనీ, స్పెయిన్​, థాయిలాండ్​ వంటి దేశాలు ఉన్నట్లు చెప్పారు.

మధ్య ఆసియా సహా ఐరోపా దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు రెండో దశ వందే భారత్​ మిషన్​ను ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

తొలి దశలో 12 దేశాలు..

తొలి దశ వందే భారత్​ మిషన్​లో భాగంగా 12 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తోంది కేంద్రం. ఈనెల 15 వరకు 64 విమానాల్లో సుమారు 15వేల మందిని దేశవ్యాప్తంగా ఉన్న 14 విమానాశ్రయాలకు చేర్చనుంది.

కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందేభారత్​ మిషన్​ను మరిన్ని దేశాలకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందులో కజకిస్థాన్​​, ఉజ్బెకిస్థాన్​, రష్యా, జర్మనీ, స్పెయిన్​, థాయిలాండ్​ వంటి దేశాలు ఉన్నట్లు చెప్పారు.

మధ్య ఆసియా సహా ఐరోపా దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు రెండో దశ వందే భారత్​ మిషన్​ను ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

తొలి దశలో 12 దేశాలు..

తొలి దశ వందే భారత్​ మిషన్​లో భాగంగా 12 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తోంది కేంద్రం. ఈనెల 15 వరకు 64 విమానాల్లో సుమారు 15వేల మందిని దేశవ్యాప్తంగా ఉన్న 14 విమానాశ్రయాలకు చేర్చనుంది.

Last Updated : May 8, 2020, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.