ETV Bharat / bharat

'సిక్కు యాత్రికులకు వీసాలు మంజూరు చేయండి'​

సిక్కు యాత్రికులు 87 మందికి పొరుగుదేశం పాకిస్థాన్ వీసా మంజూరు చేయడానికి నిరాకరించడంపై భారత్​ నిరసన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ రైలును అనుమతించకుండా 200 మంది యాత్రికులను భారత్ అడ్డుకుందని పాక్ ప్రత్యారోపణ చేసింది.

author img

By

Published : Jun 15, 2019, 6:00 AM IST

Updated : Jun 15, 2019, 7:01 AM IST

'సిక్కు యాత్రికులకు వీసాలు మంజూరు చేయండి': భారత్​
'సిక్కు యాత్రికులకు వీసాలు మంజూరు చేయండి': భారత్​

భారత్​కు చెందిన 87 మంది సిక్కు యాత్రికులకు పాకిస్థాన్ వీసా ఇవ్వడానికి నిరాకరించడాన్ని భారత విదేశీ వ్యవహారాలశాఖ ఆక్షేపించింది. పాకిస్థాన్​లో నిర్వహిస్తోన్న ఐదో సిక్కు గురువు 'గురు అర్జున్​ దేవ్'​ వర్థంతికి హాజరవ్వాలని కోరుకుంటున్న భక్తులకు తక్షణమే వీసాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.

సిక్కుమతం ప్రకారం, గురు అర్జున్ దేవ్​ వర్థంతిని 'షాహదీ జోర్​ మేళా' లేదా 'షాహిదీ పురబ్' అంటారు.​ ఇలాంటి మతపరమైన పుణ్యక్షేత్రాల సందర్శనకు 1974 ద్వైపాక్షిక ప్రోటోకాల్​ ప్రకారం పర్యటక వీసా మంజూరు చేయాలి. భక్తుల మనోభావాలను అనుసరించి వారికి పాకిస్థాన్​ బేషరతుగా వీసా మంజూరు చేయాలని భారత్​ కోరింది.

మీరే అడ్డుకున్నారు..

తమ రైలుకు భారత్​ అనుమతి ఇవ్వకుండా అడ్డుకుందని ఆరోపించింది పాకిస్థాన్. ఫలితంగా 200 మంది సిక్కు యాత్రికులను లాహోర్​కు తీసుకువెళ్లడానికి వీలుపడడంలేదని సమాధానమిచ్చింది.

"జోర్​ మేళాకు హాజరవ్వడానికి 200 మంది భారత సిక్కులకు పాకిస్థాన్ వీసా మంజూరు చేసింది. వారు శుక్రవారం పాకిస్థాన్ రైల్లో లాహోర్​కు చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ రైలును తమ భూభాగంలోకి ప్రవేశించకుండా భారత్ అడ్డుకుంది. ఫలితంగా ఈ 200 మంది యాత్రికులను లాహోర్​కు తీసుకురావడానికి వీలు పడలేదు."- అమీర్ హష్మి, ఇవాక్యూ ట్రస్ట్​ ప్రోపర్టీ బోర్డ్​ ప్రతినిధి

పాకిస్థాన్ రైలుకు అనుమతించకపోవడానికి కారణాలనూ భారత్​ వెల్లడించలేదని పాక్​ ఆరోపించింది.

ఇదీ చూడండి: తమిళనాట దాహం కేకలు- వరుణుడిపైనే ఆశలు

'సిక్కు యాత్రికులకు వీసాలు మంజూరు చేయండి': భారత్​

భారత్​కు చెందిన 87 మంది సిక్కు యాత్రికులకు పాకిస్థాన్ వీసా ఇవ్వడానికి నిరాకరించడాన్ని భారత విదేశీ వ్యవహారాలశాఖ ఆక్షేపించింది. పాకిస్థాన్​లో నిర్వహిస్తోన్న ఐదో సిక్కు గురువు 'గురు అర్జున్​ దేవ్'​ వర్థంతికి హాజరవ్వాలని కోరుకుంటున్న భక్తులకు తక్షణమే వీసాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.

సిక్కుమతం ప్రకారం, గురు అర్జున్ దేవ్​ వర్థంతిని 'షాహదీ జోర్​ మేళా' లేదా 'షాహిదీ పురబ్' అంటారు.​ ఇలాంటి మతపరమైన పుణ్యక్షేత్రాల సందర్శనకు 1974 ద్వైపాక్షిక ప్రోటోకాల్​ ప్రకారం పర్యటక వీసా మంజూరు చేయాలి. భక్తుల మనోభావాలను అనుసరించి వారికి పాకిస్థాన్​ బేషరతుగా వీసా మంజూరు చేయాలని భారత్​ కోరింది.

మీరే అడ్డుకున్నారు..

తమ రైలుకు భారత్​ అనుమతి ఇవ్వకుండా అడ్డుకుందని ఆరోపించింది పాకిస్థాన్. ఫలితంగా 200 మంది సిక్కు యాత్రికులను లాహోర్​కు తీసుకువెళ్లడానికి వీలుపడడంలేదని సమాధానమిచ్చింది.

"జోర్​ మేళాకు హాజరవ్వడానికి 200 మంది భారత సిక్కులకు పాకిస్థాన్ వీసా మంజూరు చేసింది. వారు శుక్రవారం పాకిస్థాన్ రైల్లో లాహోర్​కు చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ రైలును తమ భూభాగంలోకి ప్రవేశించకుండా భారత్ అడ్డుకుంది. ఫలితంగా ఈ 200 మంది యాత్రికులను లాహోర్​కు తీసుకురావడానికి వీలు పడలేదు."- అమీర్ హష్మి, ఇవాక్యూ ట్రస్ట్​ ప్రోపర్టీ బోర్డ్​ ప్రతినిధి

పాకిస్థాన్ రైలుకు అనుమతించకపోవడానికి కారణాలనూ భారత్​ వెల్లడించలేదని పాక్​ ఆరోపించింది.

ఇదీ చూడండి: తమిళనాట దాహం కేకలు- వరుణుడిపైనే ఆశలు

Bishkek (Kyrgyzstan), Jun 14 (ANI): Prime Minister Narendra Modi, who is in Kyrgyzstan for the ongoing Shanghai Cooperation Organisation (SCO) summit, held delegation-level talks with Kyrgyzstan President Sooronbay Jeenbekov in Bishkek. Bishkek is hosting the ongoing SCO summit, where PM Modi stressed on the need to come together to tackle the issue of terrorism and proposed an international-level conference to eliminate the global menace.
Last Updated : Jun 15, 2019, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.