ETV Bharat / bharat

'పీఎం ఈ-విద్య'తో ఇక డిజిటల్ చదువులు

విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు కేంద్రం సిద్ధమైంది. పీఎం ​ఈ-విద్య పేరుతో డిజిటల్​, ఆన్​లైన్​ కోర్సులను అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. అన్ని తరగతుల వారిలో నైపుణ్యాలు పెంపొందించే విధంగా ఈ కోర్సులు ఉండనున్నాయి.

author img

By

Published : May 17, 2020, 12:35 PM IST

India is changing and so is our way of education
విద్యా రంగంలో కేంద్రం భారీ సంస్కరణలు

కరోనా వైరస్​ వల్ల అన్ని వ్యవస్థల రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా రంగంలోనూ భారీ సంస్కరణలు చేపట్టడానికి ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. "పీఎం ఈ-విద్య" పేరుతో డిజిటల్​, ఆన్​లైన్​ కోర్సులను అతి త్వరలోనే దేశవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. దేశంలోని టాప్​-100 విశ్వవిద్యాలయాలు.. ఈ నెల 30లోగా ఈ ఆన్​లైన్​ కోర్సులను ప్రారంభించడానికి అనుమతినిచ్చింది కేంద్రం.

ఆత్మ నిర్భర భారత్​ పథకంలో భాగంగా విద్యా రంగంలో చేపట్టనున్న సంస్కరణల వివరాల్ని ఈమేరకు వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

పీఎం ​ఈ-విద్య ఫీచర్స్​...

  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల కోసం "దీక్ష". ఇందులో క్యూఆర్​ కోడ్​ ఆధారంగా అన్ని తరగతుల వారికి పాఠ్య పుస్తకాలుంటాయి.
  • 1 నుంచి 12 తరగతుల వారి కోసం ఓ ప్రత్యేక టీవీ ఛానల్​
  • విద్యా బోధన కోసం రేడియో, పాడ్​క్యాస్ట్​ల సేవలను విస్త్రత వినియోగం.
  • దివ్యాంగుల, చూపు లేనివారు, వినలేని వారి కోసం ప్రత్యేక కోర్సులు.
  • విద్యార్థుల, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మద్దతివ్వడానికి "మనోదర్పణ్​".
  • ఈ దశాబ్దపు నైపుణ్య అవసరాలతో కూడిన నూతన జాతీయ పాఠ్యాంశాలు.
  • 2025లోపు ఐదవ తరగతిలోగా చదువులో బాగా రాణించడానికి నేషనల్​ ఫౌండేషనల్​ లిటరసీ అండ్​ న్యూమరసీ మిషన్​. ఇది ఈ ఏడాది డిసెంబర్​లో ప్రారభం.

ఇప్పటివరకు...

కోరనా సంక్షోభం ఉన్నా విద్యా బోధనకు ఆటంకం కలగకుండా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపింది కేంద్రం. ఇంటర్నెట్​ లేని ప్రాంతాల్లోనూ "స్వయం ప్రభ డీటీహెచ్"​ ఛానెల్​ నడుపుతున్నట్లు గుర్తు చేసింది. "దీక్ష"ను మార్చి 24 నుంచి 61 కోట్ల మంది వీక్షించారని వెల్లడించింది.

కరోనా వైరస్​ వల్ల అన్ని వ్యవస్థల రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా రంగంలోనూ భారీ సంస్కరణలు చేపట్టడానికి ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. "పీఎం ఈ-విద్య" పేరుతో డిజిటల్​, ఆన్​లైన్​ కోర్సులను అతి త్వరలోనే దేశవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. దేశంలోని టాప్​-100 విశ్వవిద్యాలయాలు.. ఈ నెల 30లోగా ఈ ఆన్​లైన్​ కోర్సులను ప్రారంభించడానికి అనుమతినిచ్చింది కేంద్రం.

ఆత్మ నిర్భర భారత్​ పథకంలో భాగంగా విద్యా రంగంలో చేపట్టనున్న సంస్కరణల వివరాల్ని ఈమేరకు వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

పీఎం ​ఈ-విద్య ఫీచర్స్​...

  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల కోసం "దీక్ష". ఇందులో క్యూఆర్​ కోడ్​ ఆధారంగా అన్ని తరగతుల వారికి పాఠ్య పుస్తకాలుంటాయి.
  • 1 నుంచి 12 తరగతుల వారి కోసం ఓ ప్రత్యేక టీవీ ఛానల్​
  • విద్యా బోధన కోసం రేడియో, పాడ్​క్యాస్ట్​ల సేవలను విస్త్రత వినియోగం.
  • దివ్యాంగుల, చూపు లేనివారు, వినలేని వారి కోసం ప్రత్యేక కోర్సులు.
  • విద్యార్థుల, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మద్దతివ్వడానికి "మనోదర్పణ్​".
  • ఈ దశాబ్దపు నైపుణ్య అవసరాలతో కూడిన నూతన జాతీయ పాఠ్యాంశాలు.
  • 2025లోపు ఐదవ తరగతిలోగా చదువులో బాగా రాణించడానికి నేషనల్​ ఫౌండేషనల్​ లిటరసీ అండ్​ న్యూమరసీ మిషన్​. ఇది ఈ ఏడాది డిసెంబర్​లో ప్రారభం.

ఇప్పటివరకు...

కోరనా సంక్షోభం ఉన్నా విద్యా బోధనకు ఆటంకం కలగకుండా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపింది కేంద్రం. ఇంటర్నెట్​ లేని ప్రాంతాల్లోనూ "స్వయం ప్రభ డీటీహెచ్"​ ఛానెల్​ నడుపుతున్నట్లు గుర్తు చేసింది. "దీక్ష"ను మార్చి 24 నుంచి 61 కోట్ల మంది వీక్షించారని వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.