కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఇటీవలె భారత ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ విధించింది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలివే..
డబ్బులు తీసుకునేందుకు క్యూ..
సామాజిక దూరం పాటించాలన్న దిల్లీ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారు అక్కడి ప్రజలు. తాజాగా దిల్లీలోని అంబేడ్కర్ నగర్ బ్యాంక్ ముందు డబ్బులు తీసుకునేందుకు క్యూలో నిలబడి కనిపించారు.
ఆహార సాయం...
కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో.. గుజరాత్లోని మోటేరాలో ఆహారం లేని పేదలకు స్థానికులు భోజనాలు అందజేశారు.
గువహటిలో రద్దీగా మార్కెట్లు..
అసోంలోని గువహటిలో లాక్డౌన్ ఉన్నా మార్కెట్లకు భారీగా ప్రజలు తరలివచ్చారు. జ్ఞానేశ్గురి మార్కెట్ జనంతో బాగా రద్దీగా కనిపించింది.
పోలీసుల సహకారంతో..
దిల్లీలోని సదర్ బజార్లో స్థానికులు, పోలీసులు కలిసి అన్నదానం చేశారు. పేద ప్రజలకు రోడ్లపైనే భోజనాలు అందజేశారు.
రోడ్లు కడిగేస్తున్నారు..
ముంబయిలోని మాన్కుర్ధ్లో అధికారులు శానిటైజేషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అగ్నిమాపక దళాల సహకారంతో రహదారులను శుభ్రం చేశారు.
మక్కా మూసుకుపోయింది...
హైదరాబాద్లోని మక్కా మసీదు జనాలు లేక వెలవెలబోయింది. నిత్యం జనంతో కనిపించే ప్రాంతం లాక్డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారింది.
గులాబీలతో ప్రశంసలు...
పుదుచ్చేరిలో వైద్యులు, మెడికల్ సిబ్బంది, అత్యవసర సేవలు అందిస్తున్న వారికి రోజా పువ్వులు ఇచ్చి అభినందించారు పోలీసులు.
సరుకులకైనా సామాజిక దూరమే...
మేఘాలయలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు దుకాణాల ముందు వరుసలోనే నిల్చుంటున్నారు.
తోచిన సాయం...
విధుల్లో ఉన్న పోలీసులకు టీ, అల్పాహారం అందిస్తోంది స్థానిక గురుద్వారా సద్ సంగత్. హరియాణాలోని సౌత్ సిటీలో ఈ దృశ్యం కనిపించింది.
ఖాళీగా జమ్ము రోడ్లు...
జమ్ముకశ్మీర్లో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దుకాణాలన్నీ మూసివేయడం వల్ల జనసంచారం కనిపించట్లేదు.
లాఠీతో దెబ్బలు...
కర్ణాకటలోని సర్వోదయ సర్కిల్ వద్ద కొంతమంది యువకులు రోడ్లపై ద్విచక్రవాహనాలతో తిరిగారు. గస్తీలో ఉన్న పోలీసులు వాళ్లను పట్టుకొని లాఠీ ఝుళిపించారు.