కరోనా కట్టడి కోసం పొరుగుదేశాలకు భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. విదేశాలకు టీకా డోసులను ఉచితంగా పంపిస్తోంది. తాజాగా ద్వీపదేశం శ్రీలంకకు 5 లక్షలు, బహ్రెయిన్కు లక్ష డోసులను బహుమతి రూపంలో సరఫరా చేసింది. వీటితో కలిపి జనవరి 20 నుంచి ఇప్పటివరకు విదేశాలకు పంపిన డోసుల సంఖ్య 55 లక్షలకు చేరిందని విదేశాంగ శాఖ తెలిపింది.
వివిధ దేశాలకు అందించిన డోసుల వివరాలు
దేశం | టీకా డోసులు(లక్షల్లో) |
బంగ్లాదేశ్ | 20 |
మయన్మార్ | 15 |
నేపాల్ | 10 |
శ్రీలంక | 5 |
భూటాన్ | 1.5 |
మారిషస్ | 1 |
మాల్దీవులు | 1 |
బహ్రెయిన్ | 1 |
సీషెల్స్ | 0.50(యాభై వేలు) |
ఇదీ చూడండి: 'సివిల్' పరీక్షలు: కేంద్రం తీరుపై సుప్రీం అసహనం