భారత్లో కొవిడ్-19 మహమ్మారి మరింత విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6,387 మంది వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కొవిడ్-19 బాధితుల సంఖ్య లక్షా 50వేలు దాటింది.

దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1792 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 54,758కి చేరింది. గుజరాత్లో 915, మధ్యప్రదేశ్లో 305 మంది కొవిడ్-19 ధాటికి ప్రాణాలు కోల్పోయారు.