ETV Bharat / bharat

'భారత్​-బ్రెజిల్​ మధ్య ద్వైపాక్షిక బంధానికి కొత్త అధ్యాయం'

భారత్​-బ్రెజిల్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే దిశగా ఇరు దేశాల అధినేతలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.  ప్రధాని మోదీ-బ్రెజిల్​ అధ్యక్షుడు బోల్సొనారో మధ్య జరిగిన చర్చల్లో భాగంగా 15 ఒప్పందాలు కుదిరాయి. భౌగోళికంగా బ్రెజిల్​ దూరంగా ఉన్నప్పటికీ... భారత్​కు మాత్రం ఎంతో ముఖ్యమని మోదీ కొనియాడారు.

author img

By

Published : Jan 25, 2020, 2:58 PM IST

Updated : Feb 18, 2020, 9:02 AM IST

India and Brazil sign 15 agreements after talks between PM Modi and President Bolsonaro
15 ఒప్పందాలపై మోదీ-బోల్సొనారో సంతకాలు
'భారత్​-బ్రెజిల్​ మధ్య ద్వైపాక్షిక బంధానికి కొత్త అధ్యాయం'

దిల్లీ వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- బ్రెజిల్​ అధ్యక్షుడు జాయిర్‌ బోల్సొనారో మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, చమురు, సైబర్​ భద్రత, ఐటీ రంగాల్లో భారత్​- బ్రెజిల్ మైత్రి బలపడే దిశగా అగ్రనేతల మధ్య 15 ఒప్పందాలు జరిగాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని... ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత పెంపొందించేందుకు ఓ కార్యచరణ సిద్ధమైనట్టు వెల్లడించారు. బోల్సొనారో రాక.. భారత్​, బ్రెజిల్​ ద్వైపాక్షిక బంధానికి కొత్త అధ్యాయమని పేర్కొన్నారు.

"దృఢమైన మైత్రికి ప్రతీక భారత్​- బ్రెజిల్​. అందుకే భౌగోళికంగా ఎంతో దూరంగా ఉన్నప్పటికీ... ప్రపంచంలోని అనేక అంశాల్లో కలిసే ఉన్నాం. వికాశాన్ని పెంపొందించేందుకు బ్రెజిల్​ విలువైన భాగస్వామి. అందువల్లే ఇరు దేశాల మధ్య మైత్రిని అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసే విధంగా నేను- బోల్సొనారో చర్చలు జరిపాం. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఓ కార్యచరణను సిద్ధం చేశాం. 2023లో భారత్​-బ్రెజిల్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 70 సంవత్సరాలు నిండుతాయి. అప్పటివరకు ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రి, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య సహకారాలను ఈ కార్యచరణ మరింత బలపరుస్తుందని నేను విశ్వసిస్తున్నా."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

అంతకుముందు దిల్లీలోని రాజ్​భవన్​లో బోల్సొనారోకు అధికార లాంఛనాలతో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు.

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బోల్సొనారో శుక్రవారం దిల్లీ చేరుకున్నారు. కూతురు లారా బోల్సొనారో, కోడలు లెటీసియా ఫిర్మీతో పాటు ఎనిమిది మంది మంత్రుల బృందంతో భారత్​కు విచ్చేసిన జాయిర్‌ బోల్సొనారో.. రేపు నిర్వహించే 71వ గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.

'భారత్​-బ్రెజిల్​ మధ్య ద్వైపాక్షిక బంధానికి కొత్త అధ్యాయం'

దిల్లీ వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- బ్రెజిల్​ అధ్యక్షుడు జాయిర్‌ బోల్సొనారో మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, చమురు, సైబర్​ భద్రత, ఐటీ రంగాల్లో భారత్​- బ్రెజిల్ మైత్రి బలపడే దిశగా అగ్రనేతల మధ్య 15 ఒప్పందాలు జరిగాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని... ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత పెంపొందించేందుకు ఓ కార్యచరణ సిద్ధమైనట్టు వెల్లడించారు. బోల్సొనారో రాక.. భారత్​, బ్రెజిల్​ ద్వైపాక్షిక బంధానికి కొత్త అధ్యాయమని పేర్కొన్నారు.

"దృఢమైన మైత్రికి ప్రతీక భారత్​- బ్రెజిల్​. అందుకే భౌగోళికంగా ఎంతో దూరంగా ఉన్నప్పటికీ... ప్రపంచంలోని అనేక అంశాల్లో కలిసే ఉన్నాం. వికాశాన్ని పెంపొందించేందుకు బ్రెజిల్​ విలువైన భాగస్వామి. అందువల్లే ఇరు దేశాల మధ్య మైత్రిని అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసే విధంగా నేను- బోల్సొనారో చర్చలు జరిపాం. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఓ కార్యచరణను సిద్ధం చేశాం. 2023లో భారత్​-బ్రెజిల్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 70 సంవత్సరాలు నిండుతాయి. అప్పటివరకు ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రి, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య సహకారాలను ఈ కార్యచరణ మరింత బలపరుస్తుందని నేను విశ్వసిస్తున్నా."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

అంతకుముందు దిల్లీలోని రాజ్​భవన్​లో బోల్సొనారోకు అధికార లాంఛనాలతో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు.

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బోల్సొనారో శుక్రవారం దిల్లీ చేరుకున్నారు. కూతురు లారా బోల్సొనారో, కోడలు లెటీసియా ఫిర్మీతో పాటు ఎనిమిది మంది మంత్రుల బృందంతో భారత్​కు విచ్చేసిన జాయిర్‌ బోల్సొనారో.. రేపు నిర్వహించే 71వ గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 18, 2020, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.