ETV Bharat / bharat

కరోనాపై యుద్ధంలో 'మోదీ టీమ్​' పని చేస్తుందిలా...

కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీ అంతా తానై వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రధాన బృందగణంతో పాటు 11 సాధికారిక బృందాలను నియమించారు మోదీ. వీరంతా దేశంలోని పరిస్థితిని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు.

author img

By

Published : Apr 2, 2020, 9:10 AM IST

modi
మోదీ

దేశంలో కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహం ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. జీ-7 దేశాల్లోని పరిస్థితులతో పోలిస్తే ఈ తేడా మనకు అర్థమవుతుంది. భారత్​లో కేసులు పెరుగుతున్నప్పటికీ ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు దాని రేటు తక్కువగానే ఉంది.

మార్చిలో జరిగిన దిల్లీలోని తబ్లిగ్ ఎ జమాత్ మత కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని సామాజిక సంక్రమణను నివారించటం మన ముందున్న సవాలు. వారందరినీ గుర్తించి.. వారి నుంచి ఎవరికి సంక్రమించిందో పూర్తి స్థాయిలో మదింపు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ప్రభావాన్ని అంచనా వేస్తూ దానికి తగిన వ్యూహాలను అనుసరించాలి.

మోదీ ఆధ్వర్యంలో..

కరోనాపై పోరులో కార్యాచరణ ప్రణాళిక, అమలును ప్రధాని నరేంద్రమోదీ మొదటి నుంచి పర్యవేక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆరోగ్య శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ప్రపంచంతోపాటు దేశ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

ఫిబ్రవరి ప్రారంభం నుంచి అంతా ప్రధాని మోదీ తన చేతుల్లోకి తీసుకున్నారు. వుహాన్, ఇరాన్, ఇటలీలోని భారతీయులను దేశానికి తీసుకువచ్చారు. భారత్​లో కరోనా ముప్పును తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. సామాజిక వ్యాప్తిని నియంత్రించేందుకు క్రమంగా వైమానిక, రైలు మార్గాలను మూసివేశారు. చివరకు లాక్ డౌన్ అమలు చేశారు.

అంతర్జాతీయంగానూ..

చైనాలో మొదలైన ఈ సంక్షోభం ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దీర్ఘకాల దృష్టితో దేశానికి ఉపశమన చర్యలకు వ్యూహాత్మకంగా ఉపక్రమించారు. సార్క్ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్​కు నేతృత్వం వహించారు. జీ-20 దేశాల వీసీలోనూ పాల్గొన్నారు.

బృందాల నియామకం..

దేశ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా మార్చి 22న జనతా కర్ఫ్యూను ప్రకటించారు మోదీ. ఆ రోజు పరిస్థితులను పరిశీలించి పూర్తి లాక్ డౌన్ కు నిర్ణయించారు.

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు 11 సాధికార బృందాలను నియమించారు మోదీ. అన్ని సందర్భాల్లో తన ప్రధాన బృందగణానికి రెండు విషయాలపై దృష్టి సారించాలని సూచించారు. అందులో మొదటి... భారత్​లో ఉన్న అధిక జనాభా. రెండోది చైనాకు అతి సమీపంలో ఉండటం.

మిశ్రా నేతృత్వంలో..

మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా నేతృత్వంలోని బృందం.. ఆయనకు నేరుగా పరిస్థితిని నివేదిస్తుంది. ఇందులో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ, ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్, ప్రొఫెసర్ కె.విజయ్ రాఘవన్ ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవటంలో ఈ ప్రధాన బృందంతోపాటు 11 బృందాలు మోదీకి సలహాలు ఇస్తున్నాయి.

వైద్య సలహాలు..

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ ఈసీడీ హెడ్ డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ నేతృత్వంలోని ప్యానెల్.. ప్రధాన బృందానికి సలహాలు ఇస్తుంటుంది. దేశంలో కరోనా వైరస్​కు సంబంధించి స్థూల, సూక్ష్మ అంశాలను వివరిస్తుంది.

ప్రధానికి సహకారం..

ఈ సాధికారక బృందాలన్నింటినీ విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద నియమించారు. అన్ని స్థాయిల్లో ప్రధాన సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వ పాలనను ఇవి సులభతరం చేస్తాయి.

ప్రతి నిమిషం సాంకేతిక సమాచారాన్ని పరిశీలిస్తూ గణాంకాల ఆధారంగా వైరస్​పై పోరాడుతోంది కేంద్రం. ఇందుకు సంబంధించి ఎలాంటి వార్ రూమ్ ఏర్పాటు చేయకపోయినా.. ప్రధానికి కీలక అధికారులు సహకరిస్తున్నారు.

వీరిదే తుది నిర్ణయం..

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఐసీఎంఆర్ సూచనలకు అనుగుణంగానే దేశంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీవనోపాధి, సరఫరా, పరీక్ష కిట్లు, క్వారంటైన్ సంబంధిత విషయాలను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఈ అంశాలపై ప్రధాన బృందగణంతో పాటు 11 బృందాలకు నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చారు. వీటికి దేశంలో రాష్ట్రాల్లోనూ, రాజకీయంగానూ ఆమోదం లభిస్తోంది. వైద్య అత్యవసర నిర్వహణ ప్రణాళిక, ఆసుపత్రుల అందుబాటు, ఐసోలేషన్, క్వారంటైన్ సదుపాయాలు, వైద్య పరికరాల లభ్యతకు సంబంధించి ఈ బృందాలే నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

ఇదీ చూడండి: ఆపరేషన్​ మర్కజ్​​: ప్రతి రాష్ట్రంలోనూ వారి కోసం వేట

దేశంలో కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహం ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. జీ-7 దేశాల్లోని పరిస్థితులతో పోలిస్తే ఈ తేడా మనకు అర్థమవుతుంది. భారత్​లో కేసులు పెరుగుతున్నప్పటికీ ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు దాని రేటు తక్కువగానే ఉంది.

మార్చిలో జరిగిన దిల్లీలోని తబ్లిగ్ ఎ జమాత్ మత కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని సామాజిక సంక్రమణను నివారించటం మన ముందున్న సవాలు. వారందరినీ గుర్తించి.. వారి నుంచి ఎవరికి సంక్రమించిందో పూర్తి స్థాయిలో మదింపు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ప్రభావాన్ని అంచనా వేస్తూ దానికి తగిన వ్యూహాలను అనుసరించాలి.

మోదీ ఆధ్వర్యంలో..

కరోనాపై పోరులో కార్యాచరణ ప్రణాళిక, అమలును ప్రధాని నరేంద్రమోదీ మొదటి నుంచి పర్యవేక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆరోగ్య శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ప్రపంచంతోపాటు దేశ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

ఫిబ్రవరి ప్రారంభం నుంచి అంతా ప్రధాని మోదీ తన చేతుల్లోకి తీసుకున్నారు. వుహాన్, ఇరాన్, ఇటలీలోని భారతీయులను దేశానికి తీసుకువచ్చారు. భారత్​లో కరోనా ముప్పును తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. సామాజిక వ్యాప్తిని నియంత్రించేందుకు క్రమంగా వైమానిక, రైలు మార్గాలను మూసివేశారు. చివరకు లాక్ డౌన్ అమలు చేశారు.

అంతర్జాతీయంగానూ..

చైనాలో మొదలైన ఈ సంక్షోభం ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దీర్ఘకాల దృష్టితో దేశానికి ఉపశమన చర్యలకు వ్యూహాత్మకంగా ఉపక్రమించారు. సార్క్ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్​కు నేతృత్వం వహించారు. జీ-20 దేశాల వీసీలోనూ పాల్గొన్నారు.

బృందాల నియామకం..

దేశ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా మార్చి 22న జనతా కర్ఫ్యూను ప్రకటించారు మోదీ. ఆ రోజు పరిస్థితులను పరిశీలించి పూర్తి లాక్ డౌన్ కు నిర్ణయించారు.

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు 11 సాధికార బృందాలను నియమించారు మోదీ. అన్ని సందర్భాల్లో తన ప్రధాన బృందగణానికి రెండు విషయాలపై దృష్టి సారించాలని సూచించారు. అందులో మొదటి... భారత్​లో ఉన్న అధిక జనాభా. రెండోది చైనాకు అతి సమీపంలో ఉండటం.

మిశ్రా నేతృత్వంలో..

మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా నేతృత్వంలోని బృందం.. ఆయనకు నేరుగా పరిస్థితిని నివేదిస్తుంది. ఇందులో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ, ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్, ప్రొఫెసర్ కె.విజయ్ రాఘవన్ ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవటంలో ఈ ప్రధాన బృందంతోపాటు 11 బృందాలు మోదీకి సలహాలు ఇస్తున్నాయి.

వైద్య సలహాలు..

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ ఈసీడీ హెడ్ డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ నేతృత్వంలోని ప్యానెల్.. ప్రధాన బృందానికి సలహాలు ఇస్తుంటుంది. దేశంలో కరోనా వైరస్​కు సంబంధించి స్థూల, సూక్ష్మ అంశాలను వివరిస్తుంది.

ప్రధానికి సహకారం..

ఈ సాధికారక బృందాలన్నింటినీ విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద నియమించారు. అన్ని స్థాయిల్లో ప్రధాన సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వ పాలనను ఇవి సులభతరం చేస్తాయి.

ప్రతి నిమిషం సాంకేతిక సమాచారాన్ని పరిశీలిస్తూ గణాంకాల ఆధారంగా వైరస్​పై పోరాడుతోంది కేంద్రం. ఇందుకు సంబంధించి ఎలాంటి వార్ రూమ్ ఏర్పాటు చేయకపోయినా.. ప్రధానికి కీలక అధికారులు సహకరిస్తున్నారు.

వీరిదే తుది నిర్ణయం..

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఐసీఎంఆర్ సూచనలకు అనుగుణంగానే దేశంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీవనోపాధి, సరఫరా, పరీక్ష కిట్లు, క్వారంటైన్ సంబంధిత విషయాలను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఈ అంశాలపై ప్రధాన బృందగణంతో పాటు 11 బృందాలకు నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చారు. వీటికి దేశంలో రాష్ట్రాల్లోనూ, రాజకీయంగానూ ఆమోదం లభిస్తోంది. వైద్య అత్యవసర నిర్వహణ ప్రణాళిక, ఆసుపత్రుల అందుబాటు, ఐసోలేషన్, క్వారంటైన్ సదుపాయాలు, వైద్య పరికరాల లభ్యతకు సంబంధించి ఈ బృందాలే నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

ఇదీ చూడండి: ఆపరేషన్​ మర్కజ్​​: ప్రతి రాష్ట్రంలోనూ వారి కోసం వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.