ETV Bharat / bharat

పైలట్​ వ్యాజ్యంపై విచారణ సోమవారానికి వాయిదా

author img

By

Published : Jul 17, 2020, 4:54 PM IST

Updated : Jul 17, 2020, 6:23 PM IST

Hearing in the case to continue on Monday, July 20.
పైలట్​ వ్యాజ్యం విచారణ సోమవారానికి వాయిదా

18:16 July 17

తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్​ పైలట్​ సహా 18 మంది కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలకు నాలుగు రోజుల ఉపశమనం లభించింది. పైలట్​ వర్గం దాఖలు చేసిన పిటిషన్​ విచారణను రాజస్థాన్ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో మరో నాలుగు రోజుల వరకు వారిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.

స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులను సవాలు చేస్తూ పైలట్​ సహా 18 ఎమ్మెల్యేలు హైకోర్టును గురువారం ఆశ్రయించారు. దీనిపై ఈరోజు వాదనలు విన్న హైకోర్టు సోమవారం ఉదయం 10 గంటలకు విచారణను వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5.30 వరకు నోటీసులకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోమని స్పీకర్ తరపు న్యాయవాది హైకోర్టుకు హామీ ఇచ్చారు. 

సమావేశాలు లేనప్పుడు 'విప్'​ ఎలా?

పార్టీ విప్​ ధిక్కరించినందుకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ తరపున చీఫ్ విప్​ మహేష్ జోషి స్పీకర్​కు ఫిర్యాదు చేశారు.

ఈ నోటీసులను సవాల్ చేస్తూ పైలట్ వర్గం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడే పార్టీ విప్​ పనిచేస్తుందని హైకోర్టులో వాదించింది. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతల వ్యాజ్యంపై స్పందించాలని.. కాంగ్రెస్ చీఫ్​ విప్​ మహేష్ జోషిని హైకోర్టు ఆదేశించింది.

'పార్టీ వీడతామని మేం చెప్పలేదే..!'

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పారా 2(1)(a) ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్​కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఈ నిబంధన ప్రకారం సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్​కు ఉంటుంది.

అయితే పార్టీని విడిచిపెట్టాలన్న ఉద్దేశాన్ని తాము ప్రకటించలేదని పైలట్ వర్గం చెబుతోంది.

16:50 July 17

సచిన్​ పైలట్​ వర్గం దాఖలు చేసిన పిటిషన్​ విచారణను సోమవారానికి వాయిదా వేసింది రాజస్థాన్​ హైకోర్టు. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పైలట్​ సహా 18 ఎమ్మెల్యేలు కోర్టును గురువారం ఆశ్రయించారు.  

ఈ నెల 21 వరకు ఎమ్మెల్యేలపై చర్యలు ఉండవని హైకోర్టుకు తెలిపారు స్పీకర్​. 

18:16 July 17

తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్​ పైలట్​ సహా 18 మంది కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలకు నాలుగు రోజుల ఉపశమనం లభించింది. పైలట్​ వర్గం దాఖలు చేసిన పిటిషన్​ విచారణను రాజస్థాన్ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో మరో నాలుగు రోజుల వరకు వారిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.

స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులను సవాలు చేస్తూ పైలట్​ సహా 18 ఎమ్మెల్యేలు హైకోర్టును గురువారం ఆశ్రయించారు. దీనిపై ఈరోజు వాదనలు విన్న హైకోర్టు సోమవారం ఉదయం 10 గంటలకు విచారణను వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5.30 వరకు నోటీసులకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోమని స్పీకర్ తరపు న్యాయవాది హైకోర్టుకు హామీ ఇచ్చారు. 

సమావేశాలు లేనప్పుడు 'విప్'​ ఎలా?

పార్టీ విప్​ ధిక్కరించినందుకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ తరపున చీఫ్ విప్​ మహేష్ జోషి స్పీకర్​కు ఫిర్యాదు చేశారు.

ఈ నోటీసులను సవాల్ చేస్తూ పైలట్ వర్గం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడే పార్టీ విప్​ పనిచేస్తుందని హైకోర్టులో వాదించింది. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతల వ్యాజ్యంపై స్పందించాలని.. కాంగ్రెస్ చీఫ్​ విప్​ మహేష్ జోషిని హైకోర్టు ఆదేశించింది.

'పార్టీ వీడతామని మేం చెప్పలేదే..!'

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పారా 2(1)(a) ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్​కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఈ నిబంధన ప్రకారం సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్​కు ఉంటుంది.

అయితే పార్టీని విడిచిపెట్టాలన్న ఉద్దేశాన్ని తాము ప్రకటించలేదని పైలట్ వర్గం చెబుతోంది.

16:50 July 17

సచిన్​ పైలట్​ వర్గం దాఖలు చేసిన పిటిషన్​ విచారణను సోమవారానికి వాయిదా వేసింది రాజస్థాన్​ హైకోర్టు. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పైలట్​ సహా 18 ఎమ్మెల్యేలు కోర్టును గురువారం ఆశ్రయించారు.  

ఈ నెల 21 వరకు ఎమ్మెల్యేలపై చర్యలు ఉండవని హైకోర్టుకు తెలిపారు స్పీకర్​. 

Last Updated : Jul 17, 2020, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.