ETV Bharat / bharat

ఎన్నికల విధుల నుంచి బీఎస్​ఎఫ్​ బలగాల ఉపసంహరణ!

పొరుగు దేశాలతో సమస్యలు ఉత్పన్నమవుతున్న క్రమంలో సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. అందుకు సరిహద్దు దళాలైన బీఎస్​ఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​పీలపై భారాన్ని తగ్గించేందుకు ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతల వంటి అంతర్గత విధుల నుంచి క్రమంగా ఉపసంహరించుకోనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆయా విధులను పూర్తిగా సీఆర్​పీఎఫ్​కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

author img

By

Published : Sep 24, 2020, 7:07 PM IST

border security force
ఎన్నికల విధుల నుంచి బీఎస్​ఎఫ్​ బలగాల ఉపసంహరణ!

చైనాతో పాటు పాకిస్థాన్​, నేపాల్​ వంటి పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. దేశ సరిహద్దుల్లో భద్రతను పటిష్ఠం చేసేందుకు అంతర్గత భద్రత విధుల్లో నుంచి బీఎస్​ఎఫ్​, ఐటీబీపీ, ఎస్ఎస్​బీ వంటి సరిహద్దు రక్షణ దళాలను క్రమంగా ఉపసంహరించుకోవాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. గతఏడాది సరిహద్దు దళాలతో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సమావేశమైన సందర్భంగా తొలిసారి ఈ అంశంపై చర్చించినట్లు చెప్పారు.

కేంద్ర హోంశాఖ నూతన విధానం రూపొందించే పనిలో నిమగ్నమైంది. దేశంలో ఎన్నికల నిర్వహణ సహా, అంతర్గత భద్రత విధులను సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్ ​(సీఆర్​పీఎఫ్​)కు అప్పగించనున్నారు. ఇప్పటికే 3.25 లక్షల మంది సీఆర్​పీఎఫ్​ బలగాలను ప్రధాన అంతర్గత భద్రతా దళాలుగా గుర్తించారు. రానున్న బిహార్​ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల ఉప ఎన్నికల్లో నూతన ప్రయోగాన్ని చేపట్టనున్నారు. 70:30 నిష్పత్తిలో సీఆర్​పీఎఫ్​, స్థానిక పోలీసులను మోహరిస్తారు. ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పూర్తిస్థాయి భద్రత ఇంఛార్జిగా సీఆర్​పీఎఫ్​ వ్యవహరిస్తుంది. ఈ విధుల నుంచి బీఎస్​ఎఫ్​, ఐటీబీపీ, ఎస్ఎస్​బీ వంటి సరిహద్దు రక్షణ దళాలను క్రమంగా ఉపసంహరిస్తారు. ఎన్నికలు, శాంతిభద్రతల వంటి సాధారణ అంతర్గత విధుల నుంచి ఈ బలగాలను రానున్న కొన్ని ఏళ్లలోనే పూర్తిస్థాయిలో ఉపసంహరించుకునేందుకు కేంద్ర హోంశాఖ సంకల్పించింది. సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేయాలని ఇప్పటికే సరిహద్దు దళాలను ఆదేశించింది కేంద్రం.

- సీనియర్​ అధికారి.

సున్నితమైన సరిహద్దులు పాకిస్థాన్​ (3,300 కిలోమీటర్లు), బంగ్లాదేశ్​ (4,096 కిలోమీటర్ల) ప్రాంతాల్లో బీఎస్​ఎఫ్​ కాపాలా కాస్తోంది. చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి 3,488 కిలోమీటర్ల మేర ఐటీబీపీ భద్రత నిర్వహిస్తోంది. నేపాల్ ​(1,752 కిలోమీటర్లు), భూటాన్​(699 కిలోమీటర్లు) సరిహద్దుల్లో ఎస్​ఎస్​బీ దళాలు కాపలా కాస్తున్నాయి. మయన్మార్​ సరిహద్దులో హోంశాఖ నియంత్రణలో అసోం రైఫిల్స్​ బలగాలను మోహరించారు.

ప్రత్యేక బృందానికి ప్రతిపాదన..

ఇప్పటికే తమ బలగాల్లోని యువ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని మూడు సరిహద్దు దళాలను ఆదేశించింది హోంశాఖ. వారు సరిహద్దుల్లో ప్రయాణించి.. అతి చిన్న సవాళ్లనైనా నమోదు చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పేర్కొంది. అలాగే.. పశువుల స్మగ్లింగ్​, నకిలీ కరెన్సీ తరలింపు వంటి సరిహద్దు నేరాలను అరికట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని హోంశాఖ ప్రతిపాదించింది.

ఇదీ చూడండి: 'రైతుల తర్వాత ఈసారి కార్మికులపై దోపిడి'

చైనాతో పాటు పాకిస్థాన్​, నేపాల్​ వంటి పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. దేశ సరిహద్దుల్లో భద్రతను పటిష్ఠం చేసేందుకు అంతర్గత భద్రత విధుల్లో నుంచి బీఎస్​ఎఫ్​, ఐటీబీపీ, ఎస్ఎస్​బీ వంటి సరిహద్దు రక్షణ దళాలను క్రమంగా ఉపసంహరించుకోవాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. గతఏడాది సరిహద్దు దళాలతో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సమావేశమైన సందర్భంగా తొలిసారి ఈ అంశంపై చర్చించినట్లు చెప్పారు.

కేంద్ర హోంశాఖ నూతన విధానం రూపొందించే పనిలో నిమగ్నమైంది. దేశంలో ఎన్నికల నిర్వహణ సహా, అంతర్గత భద్రత విధులను సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్ ​(సీఆర్​పీఎఫ్​)కు అప్పగించనున్నారు. ఇప్పటికే 3.25 లక్షల మంది సీఆర్​పీఎఫ్​ బలగాలను ప్రధాన అంతర్గత భద్రతా దళాలుగా గుర్తించారు. రానున్న బిహార్​ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల ఉప ఎన్నికల్లో నూతన ప్రయోగాన్ని చేపట్టనున్నారు. 70:30 నిష్పత్తిలో సీఆర్​పీఎఫ్​, స్థానిక పోలీసులను మోహరిస్తారు. ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పూర్తిస్థాయి భద్రత ఇంఛార్జిగా సీఆర్​పీఎఫ్​ వ్యవహరిస్తుంది. ఈ విధుల నుంచి బీఎస్​ఎఫ్​, ఐటీబీపీ, ఎస్ఎస్​బీ వంటి సరిహద్దు రక్షణ దళాలను క్రమంగా ఉపసంహరిస్తారు. ఎన్నికలు, శాంతిభద్రతల వంటి సాధారణ అంతర్గత విధుల నుంచి ఈ బలగాలను రానున్న కొన్ని ఏళ్లలోనే పూర్తిస్థాయిలో ఉపసంహరించుకునేందుకు కేంద్ర హోంశాఖ సంకల్పించింది. సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేయాలని ఇప్పటికే సరిహద్దు దళాలను ఆదేశించింది కేంద్రం.

- సీనియర్​ అధికారి.

సున్నితమైన సరిహద్దులు పాకిస్థాన్​ (3,300 కిలోమీటర్లు), బంగ్లాదేశ్​ (4,096 కిలోమీటర్ల) ప్రాంతాల్లో బీఎస్​ఎఫ్​ కాపాలా కాస్తోంది. చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి 3,488 కిలోమీటర్ల మేర ఐటీబీపీ భద్రత నిర్వహిస్తోంది. నేపాల్ ​(1,752 కిలోమీటర్లు), భూటాన్​(699 కిలోమీటర్లు) సరిహద్దుల్లో ఎస్​ఎస్​బీ దళాలు కాపలా కాస్తున్నాయి. మయన్మార్​ సరిహద్దులో హోంశాఖ నియంత్రణలో అసోం రైఫిల్స్​ బలగాలను మోహరించారు.

ప్రత్యేక బృందానికి ప్రతిపాదన..

ఇప్పటికే తమ బలగాల్లోని యువ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని మూడు సరిహద్దు దళాలను ఆదేశించింది హోంశాఖ. వారు సరిహద్దుల్లో ప్రయాణించి.. అతి చిన్న సవాళ్లనైనా నమోదు చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పేర్కొంది. అలాగే.. పశువుల స్మగ్లింగ్​, నకిలీ కరెన్సీ తరలింపు వంటి సరిహద్దు నేరాలను అరికట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని హోంశాఖ ప్రతిపాదించింది.

ఇదీ చూడండి: 'రైతుల తర్వాత ఈసారి కార్మికులపై దోపిడి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.