ETV Bharat / bharat

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక- 5% డీఏ పెంపు

author img

By

Published : Oct 9, 2019, 3:30 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కరువు భత్యం, రైతులకు పెట్టుబడి సాయం కోసం ఆధార్​ అనుసంధానం, జమ్ముకశ్మీర్​లో ఆశ్రయం కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే విషయంపై పలు ప్రతిపాదనలు ఆమోదించింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక- 5% డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా వివిధ వర్గాలకు కేంద్ర సర్కార్‌ దీపావళి కానుక అందించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని 5శాతం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మూలవేతనంలో ప్రస్తుతం 12శాతం ఉన్న కరవు భత్యం... పెంపు తర్వాత 17శాతానికి పెరగనుంది. ఈ నిర్ణయం ద్వారా 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది.

" కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. ధరల పెరుగుదల భత్యంతో ముడిపడిన కరవు భత్యం 5శాతం పెరిగింది. గత అనేక సంవత్సరాల్లో కరవు భత్యం కేవలం 2 లేదా 3శాతం మాత్రమే పెరుగుతూ ఉండేది. పెరిగిన కరవు భత్యం కోసం 16వేల కోట్ల రూపాయలను అందజేస్తాం. పెంపు వల్ల 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65లక్షల మంది పింఛనుదారులకు మేలు జరుగుతుంది. ఇది చక్కని దీపావళి కానుక. ఈ పెంపును అంతా స్వాగతిస్తారని నమ్ముతున్నా."

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి.

నవంబర్​ 30 వరకు పొడగింపు..

రైతులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న 6వేల రూపాయల పెట్టుబడి సాయం పొందేందుకు.. బ్యాంకు ఖాతాలను ఆధార్​తో అనుసంధానించే గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో ఇప్పటికే 7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందినట్లు తెలిపారు జావడేకర్​.

ఆర్థిక సాయం..

జమ్ముకశ్మీర్​లో ఆశ్రయం కోల్పోయిన సుమారు 5,300 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5,50,00 పరిహారం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

ఆశావర్కర్ల వేతనాలను వెయ్యి రూపాయల నుంచి 2వేల రూపాయలకు పెంచింది.

ఇదీ చూడండి: 11న భారత్​కు జిన్​పింగ్​- డ్రాగన్​తో మైత్రి దృఢమయ్యేనా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా వివిధ వర్గాలకు కేంద్ర సర్కార్‌ దీపావళి కానుక అందించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని 5శాతం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మూలవేతనంలో ప్రస్తుతం 12శాతం ఉన్న కరవు భత్యం... పెంపు తర్వాత 17శాతానికి పెరగనుంది. ఈ నిర్ణయం ద్వారా 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది.

" కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. ధరల పెరుగుదల భత్యంతో ముడిపడిన కరవు భత్యం 5శాతం పెరిగింది. గత అనేక సంవత్సరాల్లో కరవు భత్యం కేవలం 2 లేదా 3శాతం మాత్రమే పెరుగుతూ ఉండేది. పెరిగిన కరవు భత్యం కోసం 16వేల కోట్ల రూపాయలను అందజేస్తాం. పెంపు వల్ల 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65లక్షల మంది పింఛనుదారులకు మేలు జరుగుతుంది. ఇది చక్కని దీపావళి కానుక. ఈ పెంపును అంతా స్వాగతిస్తారని నమ్ముతున్నా."

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి.

నవంబర్​ 30 వరకు పొడగింపు..

రైతులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న 6వేల రూపాయల పెట్టుబడి సాయం పొందేందుకు.. బ్యాంకు ఖాతాలను ఆధార్​తో అనుసంధానించే గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో ఇప్పటికే 7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందినట్లు తెలిపారు జావడేకర్​.

ఆర్థిక సాయం..

జమ్ముకశ్మీర్​లో ఆశ్రయం కోల్పోయిన సుమారు 5,300 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5,50,00 పరిహారం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

ఆశావర్కర్ల వేతనాలను వెయ్యి రూపాయల నుంచి 2వేల రూపాయలకు పెంచింది.

ఇదీ చూడండి: 11న భారత్​కు జిన్​పింగ్​- డ్రాగన్​తో మైత్రి దృఢమయ్యేనా?

Mumbai, Oct 09 (ANI): Bollywood Actor Aditya Roy Kapur was spotted near a movie theatre in Mumbai's Juhu. He was accompanied by Kunal Roy Kapur. Bollywood actress Shilpa Shetty along with her family was also seen near Juhu. Dressed in casual attire, they posed for shutterbugs. 'Luka Chuppi' actor, Kartik Aaryan was also spotted at same location in Mumbai.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.