ETV Bharat / bharat

రైతులు, ఎంఎస్​ఎంఈలపై కేంద్రం కీలక నిర్ణయాలు

author img

By

Published : Jun 1, 2020, 5:31 PM IST

మోదీ 2.0 సర్కారు అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది జరిగిన తొలి కేబినెట్​ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు మేలు చేసేలా వచ్చే ఖరీఫ్​ సీజన్​ నుంచి 14 రకాల పంటలకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధరను ప్రకటించింది. అలాగే దేశంలోని ఎంఎస్​ఎంఈలకు రూ. 50వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.

Union Cabinet decisions
రైతులకు మద్దతు ధర

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్​ఎంఈ)లకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. కరోనా మహమ్మారి కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ఇప్పటికే 20 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. పేదల అభ్యున్నతికే కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.

మద్దతు ధర

రైతులకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వచ్చే ఖరీఫ్​ సీజన్​ నుంచి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ ప్రకటించారు. రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే కిసాన్​ క్రెడిట్​ కార్డు పథకం, పెట్టుబడి సాయం వంటి అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

  • వచ్చే ఖరీస్​ సీజన్​ నుంచి 14 రకాల పంటలకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర
  • కనీస మద్దతు ధర 50-83 శాతం పెంపు
  • రైతులు రుణాలు తిరిగి చెల్లించేందుకు ఆగస్టు వరకు గడువు
  • వరికి 2020-21 పంటకాలానికి కనీస మద్దతు ధర రూ. 53 పెంపు. క్వింటా ధాన్యం రూ.1,868కి చేరిక.
  • పత్తి క్వింటాకు రూ. 260 కనీస మద్దతు ధర పెంపు. రూ. 5,515కు చేరిన క్వింటా ధర.
  • రాగులు, వేరుశెనగ, సోయా, పత్తి, పెసర పంటలకు మద్దతు ధర 50 శాతం పెంపు.
  • క్వింటా రాగులు రూ. 2620కి చేరిక

ఈక్విటీ పెట్టుబడులు

కేబినెట్​ భేటీలో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఎంఎస్​ఎంఈలది కీలక పాత్రగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 6 వేలకుపైగా ఎంఎస్​ఎంఈలకు రూ. 50వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు రూ. 20వేల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్య తరహా పరిశ్రమల టర్నోవర్​ పరిమితి రూ. 250 కోట్లకు, పెట్టుబడుల పరిమితి రూ. 50కోట్లకు పెంచినట్లు చెప్పారు.

వీధి వ్యాపారులకు రుణ పథకం..

వీధి వ్యాపారుల కోసం రుణ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. రుణ పథకం ద్వారా 50 లక్షల మంది వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్​ఎంఈ)లకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. కరోనా మహమ్మారి కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ఇప్పటికే 20 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. పేదల అభ్యున్నతికే కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.

మద్దతు ధర

రైతులకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వచ్చే ఖరీఫ్​ సీజన్​ నుంచి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ ప్రకటించారు. రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే కిసాన్​ క్రెడిట్​ కార్డు పథకం, పెట్టుబడి సాయం వంటి అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

  • వచ్చే ఖరీస్​ సీజన్​ నుంచి 14 రకాల పంటలకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర
  • కనీస మద్దతు ధర 50-83 శాతం పెంపు
  • రైతులు రుణాలు తిరిగి చెల్లించేందుకు ఆగస్టు వరకు గడువు
  • వరికి 2020-21 పంటకాలానికి కనీస మద్దతు ధర రూ. 53 పెంపు. క్వింటా ధాన్యం రూ.1,868కి చేరిక.
  • పత్తి క్వింటాకు రూ. 260 కనీస మద్దతు ధర పెంపు. రూ. 5,515కు చేరిన క్వింటా ధర.
  • రాగులు, వేరుశెనగ, సోయా, పత్తి, పెసర పంటలకు మద్దతు ధర 50 శాతం పెంపు.
  • క్వింటా రాగులు రూ. 2620కి చేరిక

ఈక్విటీ పెట్టుబడులు

కేబినెట్​ భేటీలో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఎంఎస్​ఎంఈలది కీలక పాత్రగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 6 వేలకుపైగా ఎంఎస్​ఎంఈలకు రూ. 50వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు రూ. 20వేల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్య తరహా పరిశ్రమల టర్నోవర్​ పరిమితి రూ. 250 కోట్లకు, పెట్టుబడుల పరిమితి రూ. 50కోట్లకు పెంచినట్లు చెప్పారు.

వీధి వ్యాపారులకు రుణ పథకం..

వీధి వ్యాపారుల కోసం రుణ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. రుణ పథకం ద్వారా 50 లక్షల మంది వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.