ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఆంక్షలు విధించిన కేంద్రం ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాల కోసం మంత్రుల బృందం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది.
ఈ బృందంలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సామాజిక న్యాయ మంత్రి ధావర్ చంద్ గహ్లూత్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ప్రధాని కార్యలయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బృందంలో సభ్యులుగా ఉండే అవకాశం ఉంది.
సామాజికంగా, ఆర్థికంగా జమ్ముకశ్మీర్ను అభివృద్ధి చేసేందుకు ఈ బృందం సలహాలు, సూచనలు చేయనుంది. అక్టోబర్ 31న జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: '370పై రాజ్యాంగ ధర్మాసనం.. అక్టోబర్లో విచారణ'