ETV Bharat / bharat

'ఉగ్రవాదులపై ఇమ్రాన్​ ప్రకటన అద్భుతం'

author img

By

Published : Jul 25, 2019, 7:27 PM IST

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ తమ దేశంలోని ఉగ్రవాదుల ఉనికిని గురించి అద్భుతమైన ప్రకటన చేశారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్​కుమార్ అన్నారు. పాకిస్థాన్ నాయకత్వం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయమని అయన సూచించారు.

'ఉగ్రవాదులపై ఇమ్రాన్​ ప్రకటన అద్భుతం'

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ తమ దేశంలోని ఉగ్రవాదుల ఉనికిని గురించి తెలిపారని... ఇదో గొప్ప ప్రకటన అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్​కుమార్ పేర్కొన్నారు. పాకిస్థాన్ తన భూభాగంలోని ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్​ డిమాండ్​ చేసింది.

అమెరికా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్... తమ దేశంలో సుమారు నలభై వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని స్వయంగా పేర్కొన్నారు. తర్ఫీదు పొందిన ఈ ముష్కరులు అఫ్గానిస్థాన్​, కశ్మీర్​ల్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని అమెరికాకు తెలుపలేదని ఆయన వెల్లడించారు.

"పాకిస్థాన్​ నాయకత్వం... తమ భూభాగంలోని ఉగ్రమూకలను అంతం చేయడానికి ఇదే సరైన సమయం."
-రవీష్​కుమార్​, విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి

ఐసీజే ఆదేశాలు అమలుచేయండి

కులభూషణ్​ జాదవ్​కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించిన విధంగా కాన్సులర్​ సహాయం అందించడానికి పాక్​ అవకాశం కల్పించాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రవీష్​కుమార్​ తెలిపారు.

అమెరికా- భారత్ బంధం దృఢమైంది

ప్రధాని మోదీ... కశ్మీర్​ అంశంపై మధ్యవర్తిత్వం చేయాలని తనను కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అమెరికా- భారత్​ల ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని రవీష్​కుమార్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కర్ణాటక: మీడియాకు సిద్ధరామయ్య వార్నింగ్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ తమ దేశంలోని ఉగ్రవాదుల ఉనికిని గురించి తెలిపారని... ఇదో గొప్ప ప్రకటన అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్​కుమార్ పేర్కొన్నారు. పాకిస్థాన్ తన భూభాగంలోని ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్​ డిమాండ్​ చేసింది.

అమెరికా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్... తమ దేశంలో సుమారు నలభై వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని స్వయంగా పేర్కొన్నారు. తర్ఫీదు పొందిన ఈ ముష్కరులు అఫ్గానిస్థాన్​, కశ్మీర్​ల్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని అమెరికాకు తెలుపలేదని ఆయన వెల్లడించారు.

"పాకిస్థాన్​ నాయకత్వం... తమ భూభాగంలోని ఉగ్రమూకలను అంతం చేయడానికి ఇదే సరైన సమయం."
-రవీష్​కుమార్​, విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి

ఐసీజే ఆదేశాలు అమలుచేయండి

కులభూషణ్​ జాదవ్​కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించిన విధంగా కాన్సులర్​ సహాయం అందించడానికి పాక్​ అవకాశం కల్పించాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రవీష్​కుమార్​ తెలిపారు.

అమెరికా- భారత్ బంధం దృఢమైంది

ప్రధాని మోదీ... కశ్మీర్​ అంశంపై మధ్యవర్తిత్వం చేయాలని తనను కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అమెరికా- భారత్​ల ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని రవీష్​కుమార్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కర్ణాటక: మీడియాకు సిద్ధరామయ్య వార్నింగ్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.