ETV Bharat / bharat

శైలి విభిన్నం.. సామాన్యునికి ప్రతిరూపం

author img

By

Published : Feb 11, 2020, 4:55 PM IST

Updated : Mar 1, 2020, 12:13 AM IST

ఆయన చదివింది మెకానికల్​ ఇంజినీరింగ్​. ఎంచుకున్న రంగం.. సివిల్​ సర్వీస్​. చేసిన ఉద్యోగం ఆదాయపు పన్ను శాఖలో సంయుక్త కమిషనర్​గా. ఒకానొక తరుణంలో వాటన్నిటినీ వదిలిపెట్టి రాజకీయ రంగంలో దూకారు. ఆమ్​ ఆద్మీకి(సామాన్య ప్రజలకు) చేరువ కావడం కోసం ఆ పేరుతోనే పార్టీని నెలకొల్పారు. సమాజాన్ని ప్రక్షాళన చేయడానికంటూ.. చీపురు గుర్తును పార్టీ చిహ్నంగా ఎంచుకున్నారు. 2013లో తొలిసారి దిల్లీలో అధికారం చేపట్టారు. 2015 ఎన్నికల్లో ఏకంగా 70కి 67 స్థానాలను తన పార్టీకి సాధించిపెట్టిన ఆయనకు ఈసారీ ఎదురేలేకుండా పోయింది. భాజపాను మరోసారి కంగుతినిపించారు. ఆయనే అరవింద్​ కేజ్రీవాల్​. సన్నిహితులు ముద్దుగా ఏకే అని పిలుచుకుంటారు.

from-irs-officer-to-delhi-cm-dot-dot-dot-the-profile-of-delhi-cm-aravind-kejriwal
శైలి విభిన్నం.. సామాన్యునికి ప్రతిరూపం

అరవింద్​ కేజ్రీవాల్​... దేశ రాజకీయాల్లో అందరికీ సుపరిచితమైన పేరు. అతి సాధారణంగా రాజకీయ ప్రవేశం చేసి.. అనూహ్యంగా దిల్లీ పీఠాన్నే దక్కించుకున్నారు. తొలిసారి 2013లో కాంగ్రెస్​ మద్దతుతో ఆప్​ సర్కార్​ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత.. 2015లో ఏకంగా 70 స్థానాలకు గానూ 67 చోట్ల ఆప్​ నెగ్గడం వెనుక కేజ్రీవాల్​ పోరాటం ఎంతో ఉంది. ఈసారీ ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని.. మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. దిల్లీలో హ్యాట్రిక్​ విజయాలతో మరోసారి కేజ్రీవాల్​ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ అరంగేట్రం, ఇతర విశేషాలపై ఓ లుక్కేద్దాం...

ఉద్యమం నుంచి రాజకీయంవైపు...

ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారి అరవింద్ కేజ్రీవాల్. తమ శాఖలో ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఎవరైనా అడిగితే తనకు చెప్పాలంటూ అప్పట్లో ప్రజలకు ఫోన్​ నెంబరు ఇచ్చారు ఆయన. ఫలితంగా 18 నెలల్లో 800 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వృత్తిపరంగా అనేక కీలక పరిణామాలు. చివరకు 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని విస్తృతం చేశారు కేజ్రీవాల్.

2011లో ఉద్యమకర్త అన్నా హజారేతో కలిసి జన లోక్​పాల్​ బిల్లు కోసం పోరాడినప్పుడు తొలిసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు అరవింద్. అప్పట్లో హజారేతో పాటు తొలి మహిళా ఐపీఎస్​ అధికారి కిరణ్​ బేడీ, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​లతో ఆయన ఉద్యమించారు. జనలోక్​పాల్​ బిల్లు ముసాయిదా రూపకల్పనలో పౌరసమాజం ప్రతినిధిగా వ్యవహరించారు. వారు ఇచ్చిన ముసాయిదాను ప్రభుత్వం తిరస్కరించింది. దమ్ముంటే రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించి అవినీతి నిర్మూలనకు పార్లమెంటులో అడుగుపెట్టాలని కాంగ్రెస్​, ఇతర పార్టీలు విసిరిన సవాల్​ను ఆయన స్వీకరించారు. దాని ఫలితంగానే 2012 నవంబర్​ 26న పురుడు పోసుకుంది ఆమ్​ ఆద్మీ పార్టీ.

కొడితే కుంభస్థలం...

కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్లు దిల్లీలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్​ను తొలుత 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 'ఏకే' మట్టి కరిపించారు. అనూహ్యంగా ఆ ముచ్చట 49 రోజుల్లోనే ముగిసిపోయినా ఏమాత్రం వెరవలేదు. అధికారంలో ఉన్నది కొద్ది రోజులే అయినా తనదైన ముద్ర చూపించాలని ఆరాటపడ్డారు. పద్ధతీపాడూలేని విద్యుత్తు బిల్లులను చించివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు సరఫరా సంస్థల ఒప్పందాలు, తాగునీటి సరఫరా తీరుపైనా కొరడా ఝుళిపించారు. అంతకు ముందు ఓ సందర్భంలో దిల్లీ సీఎంగా ఉన్న షీలా దీక్షిత్​ ఇంటి ముందు ఆయన ఆందోళన చేపట్టినప్పుడు పోలీసులు ఈడ్చిపడేసినా వెనక్కితగ్గలేదు. సీఎంగా అర్థంతరంగా గద్దె దిగిపోయినందుకు ఎన్ని విమర్శలు వచ్చినా కుంగిపోలేదు.

మోదీతోనే సై...

సంప్రదాయ విధానాలకు విభిన్నంగా వెళ్తూ కేజ్రీవాల్​ హస్తినవాసుల మనసు దోచుకున్నారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో వారణాసి నుంచి నరేంద్ర మోదీపై పోటీ చేసినా కేజ్రీవాల్​ విజయం సాధించలేకపోయారు. పరాజయం నుంచి తేరుకొని ఆయన కుదురుకున్నారు.

2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు క్లీన్​స్వీప్​ చేశారు. భాజపాకు 3 సీట్లు మిగిల్చి.. ఏకంగా 67 చోట్ల జయభేరి మోగించింది ఆప్​. ఈసారి సీట్ల సంఖ్య కాస్త తగ్గినా.. మళ్లీ విజయం సాధించారు కేజ్రీవాల్.

ఇదీ వ్యక్తిగతం..

పుట్టిన తేదీ : 16-08-1968
స్వస్థలం : హరియాణాలోని భివానీ జిల్లా శివాని
తల్లిదండ్రులు : గోవిందరామ్​, గీతాదేవి
భార్య : సునీత, మాజీ ఐఆర్ఎస్​ అధికారి
పిల్లలు : హర్షిత, పుల్​కిత్​
విద్యార్హత : మెకానికల్​ ఇంజినీరింగ్​, ఐఆర్​ఎస్​

మృదు స్వభావం.. దృఢ చిత్తం..

ఖరగ్​ఫూర్​ ఐఐటీ నుంచి మెకానికల్​ ఇంజినీరింగ్​ పూర్తి చేసిన కేజ్రీవాల్​ మృదువుగా మాట్లాడతారు. అయితే దృఢ చిత్తంతో వ్యవహరిస్తారు. ఇంజినీరింగ్​ పూర్తి చేశాక మూడేళ్ల పాటు టాటాస్టీల్​లో పనిచేశారు. 1992లో యూపీఎస్సీ పరీక్ష రాయడం కోసం ఆ ఉద్యోగం వదిలేశారు. తొలి ప్రయత్నంలోనే ఆ పరీక్షల్లో విజయం సాధించి భారత రెవెన్యూ సర్వీస్​(ఐఆర్​ఎస్​) అధికారి అయ్యారు. ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తూ సామాజిక అంశాలపైనా, సహ చట్టం విస్తృతి కోసం పాటుపడ్డారు. దానికిగానూ ఆయన ప్రతిష్టాత్మక రామ్​ మెగసెసె పురస్కారానికి ఎంపికయ్యారు. మెగసెసె పురస్కారానికి వచ్చిన రూ. 30 లక్షలే మూలనిధిగా ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు.

సునీతతో ప్రేమ.. పెళ్లి

ఐఆర్​ఎస్​లో తన సహాధ్యాయి సునీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సాదాసీదాగా జీవించడానికి ఇష్టపడే కేజ్రీవాల్​ ఆహార్యాన్ని చూస్తే ఓ సగటు ప్రభుత్వోద్యోగి స్ఫురణకు వస్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం రెండేళ్లు సెలవు తీసుకుని తిరిగి 2002లో ఆయన ఆదాయపు పన్ను శాఖలో చేరినా ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. 18 నెలల పాటు ఖాళీగా జీతం తీసుకోవాల్సి వచ్చినా పరిస్థితిలో మార్పు రాకపోగా... 2006లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. దానికి సంబంధించిన వివాదంలో రూ. 9.27 లక్షలను ప్రభుత్వానికి చెల్లించడానికి ఆయనకు స్నేహితులే అప్పు ఇచ్చారు.

అరవింద్​ కేజ్రీవాల్​... దేశ రాజకీయాల్లో అందరికీ సుపరిచితమైన పేరు. అతి సాధారణంగా రాజకీయ ప్రవేశం చేసి.. అనూహ్యంగా దిల్లీ పీఠాన్నే దక్కించుకున్నారు. తొలిసారి 2013లో కాంగ్రెస్​ మద్దతుతో ఆప్​ సర్కార్​ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత.. 2015లో ఏకంగా 70 స్థానాలకు గానూ 67 చోట్ల ఆప్​ నెగ్గడం వెనుక కేజ్రీవాల్​ పోరాటం ఎంతో ఉంది. ఈసారీ ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని.. మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. దిల్లీలో హ్యాట్రిక్​ విజయాలతో మరోసారి కేజ్రీవాల్​ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ అరంగేట్రం, ఇతర విశేషాలపై ఓ లుక్కేద్దాం...

ఉద్యమం నుంచి రాజకీయంవైపు...

ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారి అరవింద్ కేజ్రీవాల్. తమ శాఖలో ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఎవరైనా అడిగితే తనకు చెప్పాలంటూ అప్పట్లో ప్రజలకు ఫోన్​ నెంబరు ఇచ్చారు ఆయన. ఫలితంగా 18 నెలల్లో 800 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వృత్తిపరంగా అనేక కీలక పరిణామాలు. చివరకు 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని విస్తృతం చేశారు కేజ్రీవాల్.

2011లో ఉద్యమకర్త అన్నా హజారేతో కలిసి జన లోక్​పాల్​ బిల్లు కోసం పోరాడినప్పుడు తొలిసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు అరవింద్. అప్పట్లో హజారేతో పాటు తొలి మహిళా ఐపీఎస్​ అధికారి కిరణ్​ బేడీ, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​లతో ఆయన ఉద్యమించారు. జనలోక్​పాల్​ బిల్లు ముసాయిదా రూపకల్పనలో పౌరసమాజం ప్రతినిధిగా వ్యవహరించారు. వారు ఇచ్చిన ముసాయిదాను ప్రభుత్వం తిరస్కరించింది. దమ్ముంటే రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించి అవినీతి నిర్మూలనకు పార్లమెంటులో అడుగుపెట్టాలని కాంగ్రెస్​, ఇతర పార్టీలు విసిరిన సవాల్​ను ఆయన స్వీకరించారు. దాని ఫలితంగానే 2012 నవంబర్​ 26న పురుడు పోసుకుంది ఆమ్​ ఆద్మీ పార్టీ.

కొడితే కుంభస్థలం...

కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్లు దిల్లీలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్​ను తొలుత 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 'ఏకే' మట్టి కరిపించారు. అనూహ్యంగా ఆ ముచ్చట 49 రోజుల్లోనే ముగిసిపోయినా ఏమాత్రం వెరవలేదు. అధికారంలో ఉన్నది కొద్ది రోజులే అయినా తనదైన ముద్ర చూపించాలని ఆరాటపడ్డారు. పద్ధతీపాడూలేని విద్యుత్తు బిల్లులను చించివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు సరఫరా సంస్థల ఒప్పందాలు, తాగునీటి సరఫరా తీరుపైనా కొరడా ఝుళిపించారు. అంతకు ముందు ఓ సందర్భంలో దిల్లీ సీఎంగా ఉన్న షీలా దీక్షిత్​ ఇంటి ముందు ఆయన ఆందోళన చేపట్టినప్పుడు పోలీసులు ఈడ్చిపడేసినా వెనక్కితగ్గలేదు. సీఎంగా అర్థంతరంగా గద్దె దిగిపోయినందుకు ఎన్ని విమర్శలు వచ్చినా కుంగిపోలేదు.

మోదీతోనే సై...

సంప్రదాయ విధానాలకు విభిన్నంగా వెళ్తూ కేజ్రీవాల్​ హస్తినవాసుల మనసు దోచుకున్నారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో వారణాసి నుంచి నరేంద్ర మోదీపై పోటీ చేసినా కేజ్రీవాల్​ విజయం సాధించలేకపోయారు. పరాజయం నుంచి తేరుకొని ఆయన కుదురుకున్నారు.

2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు క్లీన్​స్వీప్​ చేశారు. భాజపాకు 3 సీట్లు మిగిల్చి.. ఏకంగా 67 చోట్ల జయభేరి మోగించింది ఆప్​. ఈసారి సీట్ల సంఖ్య కాస్త తగ్గినా.. మళ్లీ విజయం సాధించారు కేజ్రీవాల్.

ఇదీ వ్యక్తిగతం..

పుట్టిన తేదీ : 16-08-1968
స్వస్థలం : హరియాణాలోని భివానీ జిల్లా శివాని
తల్లిదండ్రులు : గోవిందరామ్​, గీతాదేవి
భార్య : సునీత, మాజీ ఐఆర్ఎస్​ అధికారి
పిల్లలు : హర్షిత, పుల్​కిత్​
విద్యార్హత : మెకానికల్​ ఇంజినీరింగ్​, ఐఆర్​ఎస్​

మృదు స్వభావం.. దృఢ చిత్తం..

ఖరగ్​ఫూర్​ ఐఐటీ నుంచి మెకానికల్​ ఇంజినీరింగ్​ పూర్తి చేసిన కేజ్రీవాల్​ మృదువుగా మాట్లాడతారు. అయితే దృఢ చిత్తంతో వ్యవహరిస్తారు. ఇంజినీరింగ్​ పూర్తి చేశాక మూడేళ్ల పాటు టాటాస్టీల్​లో పనిచేశారు. 1992లో యూపీఎస్సీ పరీక్ష రాయడం కోసం ఆ ఉద్యోగం వదిలేశారు. తొలి ప్రయత్నంలోనే ఆ పరీక్షల్లో విజయం సాధించి భారత రెవెన్యూ సర్వీస్​(ఐఆర్​ఎస్​) అధికారి అయ్యారు. ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తూ సామాజిక అంశాలపైనా, సహ చట్టం విస్తృతి కోసం పాటుపడ్డారు. దానికిగానూ ఆయన ప్రతిష్టాత్మక రామ్​ మెగసెసె పురస్కారానికి ఎంపికయ్యారు. మెగసెసె పురస్కారానికి వచ్చిన రూ. 30 లక్షలే మూలనిధిగా ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు.

సునీతతో ప్రేమ.. పెళ్లి

ఐఆర్​ఎస్​లో తన సహాధ్యాయి సునీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సాదాసీదాగా జీవించడానికి ఇష్టపడే కేజ్రీవాల్​ ఆహార్యాన్ని చూస్తే ఓ సగటు ప్రభుత్వోద్యోగి స్ఫురణకు వస్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం రెండేళ్లు సెలవు తీసుకుని తిరిగి 2002లో ఆయన ఆదాయపు పన్ను శాఖలో చేరినా ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. 18 నెలల పాటు ఖాళీగా జీతం తీసుకోవాల్సి వచ్చినా పరిస్థితిలో మార్పు రాకపోగా... 2006లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. దానికి సంబంధించిన వివాదంలో రూ. 9.27 లక్షలను ప్రభుత్వానికి చెల్లించడానికి ఆయనకు స్నేహితులే అప్పు ఇచ్చారు.

Last Updated : Mar 1, 2020, 12:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.