ETV Bharat / bharat

చోక్సీ పారిపోయిన ఆర్థిక నేరగాడే: ఈడీ

మెహుల్ చోక్సీ పరారీలో ఉన్న నిందితుడని పేర్కొంటూ బాంబే హైకోర్టులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ దాఖలు చేసింది. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడుగా ప్రకటించాలని ఈడీ వేసిన పిటిషన్​కు వ్యతిరేకంగా కోర్టులో వేసిన పిటిషన్​లను కొట్టివేయాలని కోరింది.

author img

By

Published : Jun 3, 2019, 6:24 PM IST

చోక్సీ పారిపోయిన ఆర్థిక నేరగాడే: ఈడీ

పంజాబ్​ నేషనల్ బ్యాంక్ కుంభకోణం సహనిందితుడు మెహుల్ చోక్సీ ముమ్మాటికీ పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడేనని బాంబే హైకోర్టుకు తెలిపింది ఈడీ. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడుగా ప్రకటించాలన్న ఈడీ పిటిషన్​ను తొలగించాలని ఛోక్సీ కోర్టుకు విన్నవించారు. దీన్ని కొట్టేయాలని తాజాగా బాంబే హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో పేర్కొంది ఈడీ.

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడుగా తనపై ఈడీ చేసిన ఆరోపణలు కొట్టేయాలని, తనకు వ్యతిరేకంగా అభియోగాలు చేసిన అధికారులను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని రెండు పిటిషన్లను కోర్టుకు సమర్పించారు మెహుల్ చోక్సీ.

కోట్ల రూపాయలు మళ్లించారు: ఈడీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో రూ. 6097 కోట్లను హవాలా మార్గంలో దారి మళ్లించారని ఈడీ అఫిడవిట్​లో పేర్కొంది. ఈడీ ముందు హాజరు కావాలన్న సమన్లకు సమాధానంగా తాను విచారణకు సహకరించాల్సిన అవసరం తనకు లేదని చోక్సీ వెల్లడించారని పేర్కొంది.

"మెహుల్ చోక్సీ పరారీలో ఉన్న నిందితుడు. ప్రత్యేక కోర్టు అతడిపై నాన్​ బెయిలబుల్ కేసు నమోదు చేసినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఈడీ విచారణకు హాజరు కావడం లేదు. అతడికి చట్టంపై గౌరవం లేదని ఆయన చర్యలు నిరూపిస్తున్నాయి. విచారణను తప్పించుకునేందుకే ఆయన విదేశాలకు వెళ్లిపోయాడు. భారత్​కు వచ్చేందుకు సుముఖంగా లేడు."
-కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్​లో ఈడీ

అనారోగ్యం వల్లే కోర్టుకు గైర్హాజరు: చోక్సీ

మెహుల్ చోక్సీ ఇప్పటికే ఆంటిగ్వా పౌరసత్వాన్ని తీసుకున్నాడని తన అఫిడవిట్​లో ఈడీ పేర్కొంది. అయితే అనారోగ్య కారణాల వల్లే కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నాడు చోక్సీ.

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడన్న తీర్మానాన్ని కోర్టుకు హాజరైన తర్వాత కొట్టేసేందుకు నిబంధన ఉంది. కానీ ఆరోపణలెదుర్కొంటున్న వ్యక్తి హాజరు కాలేకపోతే ఈడీ తన తీర్మానాన్ని కొనసాగించి ఆస్తులను జప్తు చేయవచ్చు.

ఈడీ పిటిషన్​ను మంగళవారం కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.

రూ. 13,400 కోట్ల పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో వజ్రాత వ్యాపారి నీరవ్ మోదీ సహా మెహుల్ చోక్సీ నిందితుడు.

పంజాబ్​ నేషనల్ బ్యాంక్ కుంభకోణం సహనిందితుడు మెహుల్ చోక్సీ ముమ్మాటికీ పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడేనని బాంబే హైకోర్టుకు తెలిపింది ఈడీ. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడుగా ప్రకటించాలన్న ఈడీ పిటిషన్​ను తొలగించాలని ఛోక్సీ కోర్టుకు విన్నవించారు. దీన్ని కొట్టేయాలని తాజాగా బాంబే హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో పేర్కొంది ఈడీ.

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడుగా తనపై ఈడీ చేసిన ఆరోపణలు కొట్టేయాలని, తనకు వ్యతిరేకంగా అభియోగాలు చేసిన అధికారులను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని రెండు పిటిషన్లను కోర్టుకు సమర్పించారు మెహుల్ చోక్సీ.

కోట్ల రూపాయలు మళ్లించారు: ఈడీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో రూ. 6097 కోట్లను హవాలా మార్గంలో దారి మళ్లించారని ఈడీ అఫిడవిట్​లో పేర్కొంది. ఈడీ ముందు హాజరు కావాలన్న సమన్లకు సమాధానంగా తాను విచారణకు సహకరించాల్సిన అవసరం తనకు లేదని చోక్సీ వెల్లడించారని పేర్కొంది.

"మెహుల్ చోక్సీ పరారీలో ఉన్న నిందితుడు. ప్రత్యేక కోర్టు అతడిపై నాన్​ బెయిలబుల్ కేసు నమోదు చేసినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఈడీ విచారణకు హాజరు కావడం లేదు. అతడికి చట్టంపై గౌరవం లేదని ఆయన చర్యలు నిరూపిస్తున్నాయి. విచారణను తప్పించుకునేందుకే ఆయన విదేశాలకు వెళ్లిపోయాడు. భారత్​కు వచ్చేందుకు సుముఖంగా లేడు."
-కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్​లో ఈడీ

అనారోగ్యం వల్లే కోర్టుకు గైర్హాజరు: చోక్సీ

మెహుల్ చోక్సీ ఇప్పటికే ఆంటిగ్వా పౌరసత్వాన్ని తీసుకున్నాడని తన అఫిడవిట్​లో ఈడీ పేర్కొంది. అయితే అనారోగ్య కారణాల వల్లే కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నాడు చోక్సీ.

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడన్న తీర్మానాన్ని కోర్టుకు హాజరైన తర్వాత కొట్టేసేందుకు నిబంధన ఉంది. కానీ ఆరోపణలెదుర్కొంటున్న వ్యక్తి హాజరు కాలేకపోతే ఈడీ తన తీర్మానాన్ని కొనసాగించి ఆస్తులను జప్తు చేయవచ్చు.

ఈడీ పిటిషన్​ను మంగళవారం కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.

రూ. 13,400 కోట్ల పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో వజ్రాత వ్యాపారి నీరవ్ మోదీ సహా మెహుల్ చోక్సీ నిందితుడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Clairefontaine-en-Yvelines, France. 3rd June, 2019.
1. 00:00 Various of fans greeting the France team.
2. 00:22 France head coach Corrine Diacre.
3. 00:34 France training.
4. 00:44 France captain Amandine Henry (left) and Griedge Mbock Bathy (right) walking onto the training pitch.
5. 00:54 Henry and Bathy training separately from the rest of the squad.
6. 01:06 Various of France training.
7. 01:42 Various of France goalkeeper Sarah Bouhaddi.
8. 02:01 Various of France training.
9. 02:19 Diacre watching training.
10. 02:30 France midfielder Gaetane Thiney training.
11. 02:39 Amandine Henry signing autographs.
12. 02:50 France players signing autographs.
13. 02:59 Gaetane Thiney signing autographs.
SOURCE: SNTV
DURATION: 03:09
STORYLINE:
2019 Women's World Cup hosts France trained in front of a group of fans just days before they open the tournament against Korea Republic.
Of concern for head coach Corrine Diacre was captain Amandine Henry and defender Griedge Mbock Bathy training away from the main group due to injuries.
Henry is dealing with a back problem while Mbock Bathy has a sprained left knee.
France play in the World Cup opener on Friday at the Parc des Princes in Paris.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.