ETV Bharat / bharat

'మలేరియా మందుతో కరోనా నుంచి రక్ష- ప్రూఫ్​ ఇదే'

author img

By

Published : Jun 1, 2020, 2:23 PM IST

పీపీఈ కిట్లతో పాటు మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకోవడం వల్ల కరోనా వైరస్‌ సోకే ముప్పు తగ్గుతుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పునరుద్ఘాటించింది. హెచ్‌సీక్యూ వాడకం వల్ల కరోనాపై పోరులో దేశాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది వైరస్ బారిన పడటం గణనీయంగా తగ్గిందని తేల్చింది.

HCQ-ICMR
మలేరియా మందు

మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్​ ప్రమాదకరమని చాలా అధ్యయనాలు చెబుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) కీలక విషయం వెల్లడించింది. 4 లేదా అంతకన్నా ఎక్కువ డోసులు తీసుకోవటం వల్ల ఆరోగ్య కార్యకర్తలకు కరోనా సోకే ముప్పు తగ్గినట్లు గుర్తించామని తెలిపింది.

కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్య, ఆరోగ్య సిబ్బందికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం అధికంగా ఉంటుంది. వీరిపై ఐసీఎంఆర్​ చేసిన అధ్యయనంలో వైరస్ సంక్రమణ అవకాశం గణనీయంగా 80 శాతం తగ్గిందని వెల్లడైంది. వీరంతా 6, ఆపైన హైడ్రాక్సీ క్లోరోక్విన్​ ప్రొఫిలాక్సిస్​ డోసులు వేసుకున్నట్లు తెలిపారు పరిశోధకులు.

అందుకోసమే ఈ పరిశోధన..

దేశంలోని ఆరోగ్య కార్యకర్తల్లో వైరస్ సంక్రమణ, రక్షణ విధానాలను పోల్చి ఐసీఎంఆర్ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్​లో ప్రచురించారు.

ఈ అధ్యయనంలో మొత్తం 1173 మందిని పరీక్షించారు. వీరిలో 624 మంది వైరస్‌ సోకినవారు కాగా, 549 మంది ముందస్తుగా ఔషధాన్ని తీసుకున్నవారు. దేశవ్యాప్తంగా ర్యాండమ్​గా ఎంపిక చేసిన సిబ్బందిని పాజిటివ్​, నెగటివ్​ విభాగాలుగా విభజించారు. పీపీఈ, కార్యాస్థలం, జాగ్రత్తలు విషయానికి సంబంధించి 20 అంశాలతో సంక్షిప్త ప్రశ్నావళిని రూపొందించి వాటికి సమాధానాలు సేకరించారు.

ఈసారి హెచ్‌సీక్యూ సామర్థ్యంపై కాకుండా హెల్త్‌కేర్‌ వర్కర్లకు వైరస్‌ సోకే ముప్పునకు గల కారణాల కోసమే అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో హెచ్‌సీక్యూ ఎంత మోతాదులో తీసుకుంటే వైరస్ సంక్రమించే అవకాశం తగ్గుతుందో కూడా గమనించామని వెల్లడించారు.

పీపీఈలతో పాటు..

వీటి ఆధారంగా వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) వాడకంతో పాటు హెచ్‌సీక్యూను నిరంతరం తీసుకోవడం వల్ల కరోనా వైరస్‌ సోకే ముప్పు తగ్గుతుందని పునరుద్ఘాటించింది ఐసీఎంఆర్.

అయితే, ఈ ఔషధం ఒక్కటి తీసుకుంటే సరిపోదని.. పీపీఈ కిట్లను వాడాల్సిందేనని స్పష్టం చేశారు. కొవిడ్‌-19 తీవ్ర స్థాయిలో ఉన్నవారిలో మాత్రం ఇది ఎలాంటి ప్రయోజనాలను అందించలేదని తమ విశ్లేషణలో తేలిందన్నారు. మృత్యు ముప్పును పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వైరస్‌ బారిన పడకుండా మాత్రమే హెచ్‌సీక్యూ ఆపగలదని తెలిపారు. కానీ, వైరస్‌ ముందే శరీరంలోకి వెళ్లి పరిస్థితి తీవ్ర స్థాయిలో ఉన్నవారిపై ఈ ఔషధం పెద్దగా ప్రభావం చూపదని స్పష్టం చేశారు.

కొందరిలో దుష్ప్రభావాలు..

ఇక అధ్యయనం జరిపిన వారిలో చాలా తక్కువ మందిలో దుష్ప్రభావాలు గమనించినట్లు పరిశోధకులు తెలిపారు. 8 శాతం మందిలో వికారం, ఐదు శాతం మందిలో తలనొప్పి, 4 శాతం మందిలో విరేచనాలు గమనించినట్లు పేర్కొన్నారు. గుండె సంబంధిత సమస్యలు మాత్రం ఎవరిలోనూ తలెత్తలేదని స్పష్టం చేశారు.

హెచ్‌సీక్యూ కారణంగా కొవిడ్‌ బాధితుల్లో మృత్యు ముప్పు పెరుగుతుందని పలు విదేశీ అధ్యయనాలు వెల్లడించాయి. ఫలితంగా సంబంధిత క్లినికల్‌ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాజా ఐసీఎంఆర్‌ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది.

మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్​ ప్రమాదకరమని చాలా అధ్యయనాలు చెబుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) కీలక విషయం వెల్లడించింది. 4 లేదా అంతకన్నా ఎక్కువ డోసులు తీసుకోవటం వల్ల ఆరోగ్య కార్యకర్తలకు కరోనా సోకే ముప్పు తగ్గినట్లు గుర్తించామని తెలిపింది.

కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్య, ఆరోగ్య సిబ్బందికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం అధికంగా ఉంటుంది. వీరిపై ఐసీఎంఆర్​ చేసిన అధ్యయనంలో వైరస్ సంక్రమణ అవకాశం గణనీయంగా 80 శాతం తగ్గిందని వెల్లడైంది. వీరంతా 6, ఆపైన హైడ్రాక్సీ క్లోరోక్విన్​ ప్రొఫిలాక్సిస్​ డోసులు వేసుకున్నట్లు తెలిపారు పరిశోధకులు.

అందుకోసమే ఈ పరిశోధన..

దేశంలోని ఆరోగ్య కార్యకర్తల్లో వైరస్ సంక్రమణ, రక్షణ విధానాలను పోల్చి ఐసీఎంఆర్ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్​లో ప్రచురించారు.

ఈ అధ్యయనంలో మొత్తం 1173 మందిని పరీక్షించారు. వీరిలో 624 మంది వైరస్‌ సోకినవారు కాగా, 549 మంది ముందస్తుగా ఔషధాన్ని తీసుకున్నవారు. దేశవ్యాప్తంగా ర్యాండమ్​గా ఎంపిక చేసిన సిబ్బందిని పాజిటివ్​, నెగటివ్​ విభాగాలుగా విభజించారు. పీపీఈ, కార్యాస్థలం, జాగ్రత్తలు విషయానికి సంబంధించి 20 అంశాలతో సంక్షిప్త ప్రశ్నావళిని రూపొందించి వాటికి సమాధానాలు సేకరించారు.

ఈసారి హెచ్‌సీక్యూ సామర్థ్యంపై కాకుండా హెల్త్‌కేర్‌ వర్కర్లకు వైరస్‌ సోకే ముప్పునకు గల కారణాల కోసమే అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో హెచ్‌సీక్యూ ఎంత మోతాదులో తీసుకుంటే వైరస్ సంక్రమించే అవకాశం తగ్గుతుందో కూడా గమనించామని వెల్లడించారు.

పీపీఈలతో పాటు..

వీటి ఆధారంగా వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) వాడకంతో పాటు హెచ్‌సీక్యూను నిరంతరం తీసుకోవడం వల్ల కరోనా వైరస్‌ సోకే ముప్పు తగ్గుతుందని పునరుద్ఘాటించింది ఐసీఎంఆర్.

అయితే, ఈ ఔషధం ఒక్కటి తీసుకుంటే సరిపోదని.. పీపీఈ కిట్లను వాడాల్సిందేనని స్పష్టం చేశారు. కొవిడ్‌-19 తీవ్ర స్థాయిలో ఉన్నవారిలో మాత్రం ఇది ఎలాంటి ప్రయోజనాలను అందించలేదని తమ విశ్లేషణలో తేలిందన్నారు. మృత్యు ముప్పును పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వైరస్‌ బారిన పడకుండా మాత్రమే హెచ్‌సీక్యూ ఆపగలదని తెలిపారు. కానీ, వైరస్‌ ముందే శరీరంలోకి వెళ్లి పరిస్థితి తీవ్ర స్థాయిలో ఉన్నవారిపై ఈ ఔషధం పెద్దగా ప్రభావం చూపదని స్పష్టం చేశారు.

కొందరిలో దుష్ప్రభావాలు..

ఇక అధ్యయనం జరిపిన వారిలో చాలా తక్కువ మందిలో దుష్ప్రభావాలు గమనించినట్లు పరిశోధకులు తెలిపారు. 8 శాతం మందిలో వికారం, ఐదు శాతం మందిలో తలనొప్పి, 4 శాతం మందిలో విరేచనాలు గమనించినట్లు పేర్కొన్నారు. గుండె సంబంధిత సమస్యలు మాత్రం ఎవరిలోనూ తలెత్తలేదని స్పష్టం చేశారు.

హెచ్‌సీక్యూ కారణంగా కొవిడ్‌ బాధితుల్లో మృత్యు ముప్పు పెరుగుతుందని పలు విదేశీ అధ్యయనాలు వెల్లడించాయి. ఫలితంగా సంబంధిత క్లినికల్‌ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాజా ఐసీఎంఆర్‌ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.