ETV Bharat / bharat

కశ్మీర్​లో మరో నలుగురు ముష్కరులు హతం

author img

By

Published : Apr 1, 2019, 7:44 AM IST

Updated : Apr 1, 2019, 12:27 PM IST

జమ్ముకశ్మీర్​లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. ఉగ్రవాదులంతా లష్కరే తొయిబా సభ్యులని సమాచారం.

నలుగురు ముష్కరులు హతం
నలుగురు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్​లో తాజాగా పుల్వామా జిల్లాలోని లస్సీపొరా ప్రాంతంలో భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన వారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

పక్కా సమాచారంతో...

ఉగ్రవాదుల సంచారంపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు లస్సీపొరా ప్రాంతంలో ఉదయం నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ముష్కరులు దాడి చేయగా... సిబ్బంది ప్రతిఘటించారు. ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నలుగురి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.

భద్రతా దళాలు ఘటనాస్థలిలో రెండు ఏకే రైఫిళ్లు, ఒక ఎస్​ఎల్​ఆర్, ఒక పిస్తోల్​స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్​కౌంటర్​లో ముగ్గురు జవాన్లు, ఒక పోలీసు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది.

నలుగురు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్​లో తాజాగా పుల్వామా జిల్లాలోని లస్సీపొరా ప్రాంతంలో భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన వారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

పక్కా సమాచారంతో...

ఉగ్రవాదుల సంచారంపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు లస్సీపొరా ప్రాంతంలో ఉదయం నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ముష్కరులు దాడి చేయగా... సిబ్బంది ప్రతిఘటించారు. ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నలుగురి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.

భద్రతా దళాలు ఘటనాస్థలిలో రెండు ఏకే రైఫిళ్లు, ఒక ఎస్​ఎల్​ఆర్, ఒక పిస్తోల్​స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్​కౌంటర్​లో ముగ్గురు జవాన్లు, ఒక పోలీసు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది.

Intro:Body:Conclusion:
Last Updated : Apr 1, 2019, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.