ETV Bharat / bharat

వెంటిలేటర్​పైనే ప్రణబ్​కు చికిత్స: ఆర్మీ ఆసుపత్రి

author img

By

Published : Aug 28, 2020, 12:11 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇంకా వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ ఆస్పత్రి తెలిపింది. ఆరోగ్య సూచిలన్నీ నిలకడగానే ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది.

Former President Pranab Mukherjee (in file pic) is under intensive care and is being treated for lung infection
వెంటిలేటర్​ పైనే ప్రణబ్​కు చికిత్స.. ఆర్మీ ఆసుపత్రి ప్రకటన

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వెంటిలేటర్​ పైనే ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​కు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని శుక్రవారం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొన్నారు.

ముఖర్జీ ఆగస్టు 10న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. అదే రోజు ఆయనకు మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స నిర్వహించారు. అంతకుముందే ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వెంటిలేటర్​ పైనే ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​కు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని శుక్రవారం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొన్నారు.

ముఖర్జీ ఆగస్టు 10న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. అదే రోజు ఆయనకు మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స నిర్వహించారు. అంతకుముందే ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.