ETV Bharat / bharat

కర్ణాటకీయం: సుప్రీంకు మరో ఐదుగురు రెబల్స్

కర్ణాటకలో అసమ్మతి ఎమ్మెల్యేల బుజ్జగింపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రాజీనామా ఉపసంహరణపై మంత్రి నాగ్​రాజ్​ సానుకూల సంకేతాలు ఇచ్చినా... మిగిలినవారు వెనక్కి తగ్గేది లేదని పరోక్షంగా తేల్చిచెప్పారు. రాజీనామాలు ఆమోదించేలా స్పీకర్​ను ఆదేశించాలని కోరుతూ ఐదుగురు రెబల్స్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

author img

By

Published : Jul 13, 2019, 2:46 PM IST

కర్ణాటకీయం: సుప్రీంకు మరో ఐదుగురు రెబల్స్

కర్ణాటక రాజకీయాలు అనూహ్య మలుపులతో రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా ఐదుగురు అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ వెంటనే తమ రాజీనామాలు ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారిలో ఆనంద్​ సింగ్​, రోషన్​ బేగ్​ ఉన్నారు.

ఇప్పటికే 10 మంది రెబల్స్​ సుప్రీంకోర్టులో ఇలాంటి వ్యాజ్యమే దాఖలు చేశారు. శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం... కీలక ఆదేశాలు జారీచేసింది. రాజీనామాలు సహా అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనలపై మంగళవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పీకర్​కు సూచించింది.

అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్​, జేడీఎస్​ విశ్వప్రయత్నాలు చేస్తున్న వేళ... ఐదుగురు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజీనామా ఉపసంహరణకు మంత్రి నాగ్​రాజ్​ సుముఖుత వ్యక్తంచేసినా... మిగిలిన రెబల్స్​ తిరిగి కూటమిలోకి రావడంపై అనుమానాలు పెరిగేందుకు కారణమైంది.

భాజపాకే మా మద్దతు

సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర సభ్యులు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశం కనిపించడంలేదు. శాసనసభలో విపక్ష స్థానాల వద్ద తమకు సీట్లు కేటాయించాలని ఎమ్మెల్యేలు ఆర్ శంకర్​, హెచ్​ నగేశ్​​ తాజాగా స్పీకర్​కు లేఖ రాశారు.

కుమారస్వామి ప్రభుత్వాన్ని వీడి, భాజపాకు మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్​కు ఈనెల 8న శంకర్​, నగేశ్​ లేఖ రాశారు.

ఇదీ చూడండి: 'ఊరూరా ఉద్యమస్థాయిలో స్వచ్ఛ భారత్'

కర్ణాటక రాజకీయాలు అనూహ్య మలుపులతో రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా ఐదుగురు అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ వెంటనే తమ రాజీనామాలు ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారిలో ఆనంద్​ సింగ్​, రోషన్​ బేగ్​ ఉన్నారు.

ఇప్పటికే 10 మంది రెబల్స్​ సుప్రీంకోర్టులో ఇలాంటి వ్యాజ్యమే దాఖలు చేశారు. శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం... కీలక ఆదేశాలు జారీచేసింది. రాజీనామాలు సహా అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనలపై మంగళవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పీకర్​కు సూచించింది.

అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్​, జేడీఎస్​ విశ్వప్రయత్నాలు చేస్తున్న వేళ... ఐదుగురు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజీనామా ఉపసంహరణకు మంత్రి నాగ్​రాజ్​ సుముఖుత వ్యక్తంచేసినా... మిగిలిన రెబల్స్​ తిరిగి కూటమిలోకి రావడంపై అనుమానాలు పెరిగేందుకు కారణమైంది.

భాజపాకే మా మద్దతు

సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర సభ్యులు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశం కనిపించడంలేదు. శాసనసభలో విపక్ష స్థానాల వద్ద తమకు సీట్లు కేటాయించాలని ఎమ్మెల్యేలు ఆర్ శంకర్​, హెచ్​ నగేశ్​​ తాజాగా స్పీకర్​కు లేఖ రాశారు.

కుమారస్వామి ప్రభుత్వాన్ని వీడి, భాజపాకు మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్​కు ఈనెల 8న శంకర్​, నగేశ్​ లేఖ రాశారు.

ఇదీ చూడండి: 'ఊరూరా ఉద్యమస్థాయిలో స్వచ్ఛ భారత్'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 12 July 2019
1. Wide of street in Manhattan
2. Zoom-out of onlookers
3. Various of sun setting between east-west streets of main street grid of Manhattan
4. Various of onlookers filming sunset on phones
5. Various of sun setting between east-west streets of main street grid of Manhattan
STORYLINE:
New Yorkers gathered on Friday to watch the sun set and align with the east-west streets of the main street grid of Manhattan.
The event has come to be known as Manhattanhenge, in homage to Stonehenge, the monument in England believed to have been constructed by prehistoric people and used in rituals related to the sun.
With clear skies in the city being forecast for Saturday, those living in New York will have a chance to witness the sun set again.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.