ETV Bharat / bharat

జూన్​ 6-15 వరకు 17వ లోక్​సభ తొలి సమావేశం!

17వ లోక్​సభ తొలి సమావేశాలు జూన్​ 6 నుంచి 15 వరకు జరిగే అవకాశం ఉంది. మే 30న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం 31న కొత్త మంత్రివర్గం​ భేటీ కానుంది. అదే రోజు పార్లమెంటు సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

author img

By

Published : May 27, 2019, 1:55 PM IST

జూన్​ 6-15 వరకు 17వ లోక్​సభ తొలి సమావేశం!

నూతనంగా ఏర్పాటుకానున్న 17వ లోక్​సభ తొలి విడత సమావేశాల తేదీలను మే 31న జరిగే కేబినెట్​ భేటీలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. జూన్​ 6 నుంచి 15 వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి తొలి రోజు ప్రసంగించనున్నారు. లోక్​సభ ప్రొటెమ్​ స్పీకర్​ను ఆ రోజే నియమించనున్నట్లు తెలుస్తోంది.

జూన్​ 10న లోక్​సభ స్పీకర్​ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అంతకుముందే కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెమ్​ స్పీకర్​ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. స్పీకర్​ ఎన్నిక ముగిశాక ధన్యవాద తీర్మానంలో ప్రధాన మంత్రి నరంద్రే మోదీ మాట్లాడతారు.

ఈ నెల 30న రాత్రి 7 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్​లో రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు.

ఐదేళ్ల పదవీకాలం తర్వాత వరుసగా మరోసారి ప్రధానిగా ఎన్నికైన తొలి భాజపా నేతగా మోదీ ఘనత సాధించారు. ఇప్పటివరకు మాజీ ప్రధానులు జవహర్​లాల్​ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్​ సింగ్​ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.

ఇదీ చూడండి: 17వ లోక్​సభలో 475 మంది కోటీశ్వరులు!

నూతనంగా ఏర్పాటుకానున్న 17వ లోక్​సభ తొలి విడత సమావేశాల తేదీలను మే 31న జరిగే కేబినెట్​ భేటీలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. జూన్​ 6 నుంచి 15 వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి తొలి రోజు ప్రసంగించనున్నారు. లోక్​సభ ప్రొటెమ్​ స్పీకర్​ను ఆ రోజే నియమించనున్నట్లు తెలుస్తోంది.

జూన్​ 10న లోక్​సభ స్పీకర్​ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అంతకుముందే కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెమ్​ స్పీకర్​ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. స్పీకర్​ ఎన్నిక ముగిశాక ధన్యవాద తీర్మానంలో ప్రధాన మంత్రి నరంద్రే మోదీ మాట్లాడతారు.

ఈ నెల 30న రాత్రి 7 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్​లో రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు.

ఐదేళ్ల పదవీకాలం తర్వాత వరుసగా మరోసారి ప్రధానిగా ఎన్నికైన తొలి భాజపా నేతగా మోదీ ఘనత సాధించారు. ఇప్పటివరకు మాజీ ప్రధానులు జవహర్​లాల్​ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్​ సింగ్​ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.

ఇదీ చూడండి: 17వ లోక్​సభలో 475 మంది కోటీశ్వరులు!


Bengaluru, May 27 (ANI): Five members of a family died earlier this morning after their vehicle met with an accident on Airport Road in Bengaluru. The incident happened when family was en route to drop a family member to the Airport. An ambulance was also badly damaged in the accident.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.