ETV Bharat / bharat

తూర్పు లద్దాఖ్‌లోని ఎల్​ఏసీ వద్ద కాల్పులు!

author img

By

Published : Sep 8, 2020, 3:01 AM IST

Updated : Sep 8, 2020, 7:06 AM IST

భారత్​-చైనా సరిహద్దుల్లో మరోసారి కాల్పులు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని ఎల్​ఏసీ వద్ద కాల్పుల ఘటన జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాంగాంగ్​ సరస్సు దక్షిణ ప్రాంతంలో భారత బలగాలు.. వాస్తవాధీన రేఖను దాటాయని చైనా ఆరోపిస్తోంది.

firing between India and China
భారత్ చైనా మధ్య కాల్పులు

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వద్ద కాల్పుల జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో భారత్​-చైనా దళాలు మూడు నెలలుగా స్టాండ్​-ఆఫ్​లో ఉన్నాయి.

పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన ఉన్న వ్యూహాత్మక ఎత్తును భారత్ ఇటీవల చేజిక్కించుకుంది. దీనితో పాంగాంగ్​ దక్షిణ తీరంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చైనా ఇటీవల చేసిన ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. ఈ ఘటన తర్వాత కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.

పాంగాంగ్​ సరస్సు దక్షిణ ప్రాంతంలో భారత బలగాలు.. వాస్తవాధీన రేఖను దాటాయని చైనా ఆరోపిస్తోంది. ఈ మేరకు చైనాకు చెందిన గ్లోబల్​ టైమ్స్​ నివేదించింది.

దిగజారిన పరిస్థితులు..

ఫింగర్ ప్రాంతాలు, గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్ సహా పలు ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరించడం వల్ల ఏప్రిల్-మే నుంచి ఇరు దేశాలు స్టాండ్​ ఆఫ్ పాటిస్తున్నాయి. గల్వాన్​ లోయలో జూన్​లో చైనా దళాలు చేసిన దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి.

ఈ ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య మూడు నెలల నుంచి చర్చలు జరుగుతున్నాయి. లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో కూడా ఐదు దశలాల్లో చర్చలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఫలితాలు ఇవ్వలేదు.

ఇదీ చూడండి:సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే..

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వద్ద కాల్పుల జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో భారత్​-చైనా దళాలు మూడు నెలలుగా స్టాండ్​-ఆఫ్​లో ఉన్నాయి.

పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన ఉన్న వ్యూహాత్మక ఎత్తును భారత్ ఇటీవల చేజిక్కించుకుంది. దీనితో పాంగాంగ్​ దక్షిణ తీరంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చైనా ఇటీవల చేసిన ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. ఈ ఘటన తర్వాత కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.

పాంగాంగ్​ సరస్సు దక్షిణ ప్రాంతంలో భారత బలగాలు.. వాస్తవాధీన రేఖను దాటాయని చైనా ఆరోపిస్తోంది. ఈ మేరకు చైనాకు చెందిన గ్లోబల్​ టైమ్స్​ నివేదించింది.

దిగజారిన పరిస్థితులు..

ఫింగర్ ప్రాంతాలు, గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్ సహా పలు ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరించడం వల్ల ఏప్రిల్-మే నుంచి ఇరు దేశాలు స్టాండ్​ ఆఫ్ పాటిస్తున్నాయి. గల్వాన్​ లోయలో జూన్​లో చైనా దళాలు చేసిన దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి.

ఈ ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య మూడు నెలల నుంచి చర్చలు జరుగుతున్నాయి. లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో కూడా ఐదు దశలాల్లో చర్చలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఫలితాలు ఇవ్వలేదు.

ఇదీ చూడండి:సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే..

Last Updated : Sep 8, 2020, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.