ETV Bharat / bharat

దళిత నేత హత్య కేసులో తేజస్వీ​పై ఎఫ్ఐఆర్​

author img

By

Published : Oct 5, 2020, 4:33 AM IST

బిహార్​లో దళిత నాయకుని హత్య కేసులో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్​ సహా ఆరుగురిపై ఎఫ్​ఐఆర్ నమోదైంది. పార్టీకి విరాళంగా రూ.50 లక్షలు ఇవ్వక పోతే తనను హతమారుస్తానని తేజస్వీ యాదవ్​ బెదిరించినట్లు హత్యకు గురైన ముందు రోజే దళిత నేత ఆరోపించారు. ఆ వీడియో వైరల్​గా మారింది.

FIR against RJD's Tejashwi Prasad, others in Dalit leader murder case
దళిత నేత హత్య కేసులో తేజస్వీ యాదవ్​పై ఎఫ్ఐఆర్​

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్​ యాదవ్​లపై బిహార్​ దళిత నాయకుని హత్య కేసులో ఎఫ్​ఐఆర్ నమోదైంది. వీరిద్దరితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

దళిత నాయకుడు శక్తి మాలిక్​ హత్య ఆదివారం ఉదయం జరిగింది. బైక్​పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనను సొంత నివాసంలోనే తుపాకీతో కాల్చి హత్యచేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే హత్య జరిగిన తర్వాాత ఓ వీడియో వైరల్​గా మారింది. రాణిగంజ్ ఎమ్మెల్యే టికెట్ దక్కాలంటే పార్టీకి రూ. 50లక్షలు విరాళంగా ఇవ్వాలని.. లేకపోతే తనను అంతమొందిస్తానని తేజస్వీ యాదవ్ బెదిరించినట్లు ఆ వీడియోలో చెప్పారు శక్తి మాలిక్​.

ఈ హత్య కేసుకు సంబంధించి తేజస్వీ, తేజ్ ప్రతాప్​లు సహా మొత్తం ఆరుగురిపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసినట్లు పూర్నియా జిల్లా ఎస్పీ విశాల్​ శర్మ తెలిపారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీపై ఈ కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్​ యాదవ్​లపై బిహార్​ దళిత నాయకుని హత్య కేసులో ఎఫ్​ఐఆర్ నమోదైంది. వీరిద్దరితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

దళిత నాయకుడు శక్తి మాలిక్​ హత్య ఆదివారం ఉదయం జరిగింది. బైక్​పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనను సొంత నివాసంలోనే తుపాకీతో కాల్చి హత్యచేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే హత్య జరిగిన తర్వాాత ఓ వీడియో వైరల్​గా మారింది. రాణిగంజ్ ఎమ్మెల్యే టికెట్ దక్కాలంటే పార్టీకి రూ. 50లక్షలు విరాళంగా ఇవ్వాలని.. లేకపోతే తనను అంతమొందిస్తానని తేజస్వీ యాదవ్ బెదిరించినట్లు ఆ వీడియోలో చెప్పారు శక్తి మాలిక్​.

ఈ హత్య కేసుకు సంబంధించి తేజస్వీ, తేజ్ ప్రతాప్​లు సహా మొత్తం ఆరుగురిపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసినట్లు పూర్నియా జిల్లా ఎస్పీ విశాల్​ శర్మ తెలిపారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీపై ఈ కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.