ETV Bharat / bharat

రామమందిర పునాది తుది నమూనా సిద్ధం

author img

By

Published : Dec 15, 2020, 5:32 AM IST

అయోధ్య రామయ్య ఆలయ నిర్మాణ పనులు చకచక జరిగిపోతున్నాయి. ఇందుకు సంబంధించి ఆదివారం నిర్మాణ రంగ నిపుణల కమిటీ ఏర్పాటు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. మందిర పునాదికి సంబంధించిన నమూనాలను అధికారులు నేడు ప్రధాని మాజీ ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు.​

Final report of Ram Mandir foundation design to be submitted on December 15
నేడే రామమందిర పునాది నమూనా కేంద్రం కు అందజేత

ఉత్తర్​ప్రదేశ్‌ అయోధ్యలోని రామ ​మందిరం పునాది నమూనాను ఆలయ నిర్మాణ నిపుణుల కమిటీ సిద్ధం చేసింది. ఈ నమూనా వివరాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రాకు నేడు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

నిర్మాణరంగంలో ఖ్యాతిగడించిన నిపుణులు, ఇంజనీర్లతో కలిసిన ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్​ను ట్రస్ట్ ఏర్పాటు చేసింది. వీరు ఆలయానికి సంబంధించిన పునాది, ఇతర నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. ఈ ప్యానెల్‌కు దిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్ వీ.ఎస్ రాజు నేతృత్వం వహించనున్నారు.

ఈ ప్యానెల్ ముఖ్య ఉద్దేశ్యం రామ మందిర పునాది పనులను పర్యవేక్షించడం. అంతేగాక ఆలయానికి సంబంధించిన లేఅవుట్ల ప్రణాళికల గురించి లార్సెన్ అండ్​ టర్బో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్లతో కలిసి చర్చిస్తారని అధికారి తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం 200 అడుగుల లోతులో ఉన్న ఇసుకను వెలికితీయడంపై సవాలుగా మారింది. అయితే ఇందుకు సంబంధించిన నివేదికను ఐఐటీ చెన్నై పరిశోధకుల బృందం... టాటా ఇంజనీర్లకు ఇది వరకే సమర్పించారు.

ఇదీ చూడండి: రామాలయ నిర్మాణానికి నిపుణుల కమిటీ

ఉత్తర్​ప్రదేశ్‌ అయోధ్యలోని రామ ​మందిరం పునాది నమూనాను ఆలయ నిర్మాణ నిపుణుల కమిటీ సిద్ధం చేసింది. ఈ నమూనా వివరాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రాకు నేడు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

నిర్మాణరంగంలో ఖ్యాతిగడించిన నిపుణులు, ఇంజనీర్లతో కలిసిన ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్​ను ట్రస్ట్ ఏర్పాటు చేసింది. వీరు ఆలయానికి సంబంధించిన పునాది, ఇతర నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. ఈ ప్యానెల్‌కు దిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్ వీ.ఎస్ రాజు నేతృత్వం వహించనున్నారు.

ఈ ప్యానెల్ ముఖ్య ఉద్దేశ్యం రామ మందిర పునాది పనులను పర్యవేక్షించడం. అంతేగాక ఆలయానికి సంబంధించిన లేఅవుట్ల ప్రణాళికల గురించి లార్సెన్ అండ్​ టర్బో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్లతో కలిసి చర్చిస్తారని అధికారి తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం 200 అడుగుల లోతులో ఉన్న ఇసుకను వెలికితీయడంపై సవాలుగా మారింది. అయితే ఇందుకు సంబంధించిన నివేదికను ఐఐటీ చెన్నై పరిశోధకుల బృందం... టాటా ఇంజనీర్లకు ఇది వరకే సమర్పించారు.

ఇదీ చూడండి: రామాలయ నిర్మాణానికి నిపుణుల కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.