ETV Bharat / bharat

మానవాళి హితం కోసమే ఆ రిస్కు

author img

By

Published : Jul 22, 2020, 10:38 AM IST

కరోనాపై టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇందులో బ్రిటన్​లోని ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం రూపొందించిన టీకా తొలిదశ మానవ ప్రయోగం ఇటీవల విజయవంతం అయ్యింది. ఈ టీకా పరీక్షల్లో పాల్గొన్న వాలంటీర్లలో భారత సంతతికి చెందిన దీపక్ పాలివాల్‌ కూడా ఒకరు. టీకా ప్రయోగం సహా అనేక విషయాలు దీపక్ 'ఈటీవీ భారత్​'తో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం.

OXFORD VACCINE
ఆక్స్​ఫర్డ్ టీకాకు భారత వాలంటీర్​

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కరోనా టీకాపై నిర్వహించిన తొలిదశ మానవ ప్రయోగాలు విజయవంతం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రిస్కుకు వెరవకుండా ఈ టీకా పరీక్షల్లో పాల్గొన్న వాలంటీర్లు ఇందులో ముఖ్య భూమిక వహించారు. అలాంటివారిలో భారత సంతతికి చెందిన దీపక్‌ పాలివాల్‌ కూడా ఉన్నారు. ఈ ప్రయోగం కోసం డబ్బు తీసుకోకుండా, ఉచితంగా సేవలు అందించి తన ఉదాత్తతను చాటుకున్నారు.

"నా ప్రమేయం వల్ల ఏదైనా మంచి జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది" అని ఆయన 'ఈటీవీ భారత్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ప్రయోగం వల్ల తన ప్రాణానికి ముప్పు కలగొచ్చని తనకు తెలుసని, అయితే మానవాళి సంక్షేమం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ యజ్ఞంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

అందుకే డబ్బు తీసుకోలేదు..

జైపుర్‌ మూలాలున్న దీపక్‌ ప్రస్తుతం లండన్‌లోని ఒక ఔషధ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. "కరోనా వైరస్‌ను నిరోధించే టీకాను మానవులపై ప్రయోగించే కసరత్తు ప్రారంభం కాబోతోందని ఓ స్నేహితుడి ద్వారా తెలుసుకున్నా. వాటిలో పాల్గొనాలని నిర్ణయించుకొని, ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకున్నా. ఈ విషయాన్ని జైపుర్‌లోని నా కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. వారికి తెలిస్తే నన్ను ఈ ప్రయోగానికి అనుమతించబోరన్న ఉద్దేశంతో విషయాన్ని వారి దృష్టికి తీసుకురాలేదు" అని ఆయన తెలిపారు. ఈ పరీక్షల్లో పాల్గొన్నందుకు డబ్బు తీసుకోకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. "వాలంటీరు అంటే స్వచ్ఛందమని అర్థం. డబ్బు తీసుకుంటే సామాజిక సేవ ఉద్దేశం దెబ్బతింటుంది" అని పేర్కొన్నారు.

త్వరలోనే వస్తుంది:

ఈ ప్రయోగం వల్ల తన శరీరంలో అసాధారణ అంశాలేవీ తలెత్తలేదని దీపక్‌ తెలిపారు. ఎలాంటి దుష్ప్రభావాలూ ఉత్పన్నం కాలేదన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ నిర్వహించిన మూడు దశల ప్రయోగాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయని, అందువల్ల ఈ టీకా త్వరలోనే మార్కెట్‌లోకి రావచ్చని చెప్పారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు.

ప్రయోగం రోజున..:

తనపై టీకా ప్రయోగం మే 11న జరిగిందని దీపక్‌ చెప్పారు. ‘‘ఓ వాలంటీరు చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం వల్ల.. ప్రయోగానికి ముందు రోజు నా మనసులో ఓ మూల భయం తలెత్తింది. ప్రయోగానికి ముందు వైద్యులు నాకు కొన్ని వీడియోలు చూపారు. వెనక్కి తగ్గాలనుకుంటే వెళ్లిపోవచ్చని చెప్పారు. పరీక్షలో పాల్గొనడం తప్పనిసరేమీ కాదన్నారు. అయినా వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నా. దీంతో వైద్యుడు నాకు టీకా ఇంజెక్షన్‌ వేశారు. 2 గంటల పాటు నన్ను పరిశీలనలో ఉంచారు. ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తాయా అన్నది గమనించారు. ఆ తర్వాత నిశితంగా పరీక్షలు చేసి, ఇంటికి పంపేశారు’’ అని తెలిపారు.

ఇదీ చూడండి:నవంబర్​ నాటికి ఆక్స్​ఫర్డ్​ టీకా.. ధరెంతంటే?

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కరోనా టీకాపై నిర్వహించిన తొలిదశ మానవ ప్రయోగాలు విజయవంతం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రిస్కుకు వెరవకుండా ఈ టీకా పరీక్షల్లో పాల్గొన్న వాలంటీర్లు ఇందులో ముఖ్య భూమిక వహించారు. అలాంటివారిలో భారత సంతతికి చెందిన దీపక్‌ పాలివాల్‌ కూడా ఉన్నారు. ఈ ప్రయోగం కోసం డబ్బు తీసుకోకుండా, ఉచితంగా సేవలు అందించి తన ఉదాత్తతను చాటుకున్నారు.

"నా ప్రమేయం వల్ల ఏదైనా మంచి జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది" అని ఆయన 'ఈటీవీ భారత్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ప్రయోగం వల్ల తన ప్రాణానికి ముప్పు కలగొచ్చని తనకు తెలుసని, అయితే మానవాళి సంక్షేమం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ యజ్ఞంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

అందుకే డబ్బు తీసుకోలేదు..

జైపుర్‌ మూలాలున్న దీపక్‌ ప్రస్తుతం లండన్‌లోని ఒక ఔషధ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. "కరోనా వైరస్‌ను నిరోధించే టీకాను మానవులపై ప్రయోగించే కసరత్తు ప్రారంభం కాబోతోందని ఓ స్నేహితుడి ద్వారా తెలుసుకున్నా. వాటిలో పాల్గొనాలని నిర్ణయించుకొని, ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకున్నా. ఈ విషయాన్ని జైపుర్‌లోని నా కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. వారికి తెలిస్తే నన్ను ఈ ప్రయోగానికి అనుమతించబోరన్న ఉద్దేశంతో విషయాన్ని వారి దృష్టికి తీసుకురాలేదు" అని ఆయన తెలిపారు. ఈ పరీక్షల్లో పాల్గొన్నందుకు డబ్బు తీసుకోకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. "వాలంటీరు అంటే స్వచ్ఛందమని అర్థం. డబ్బు తీసుకుంటే సామాజిక సేవ ఉద్దేశం దెబ్బతింటుంది" అని పేర్కొన్నారు.

త్వరలోనే వస్తుంది:

ఈ ప్రయోగం వల్ల తన శరీరంలో అసాధారణ అంశాలేవీ తలెత్తలేదని దీపక్‌ తెలిపారు. ఎలాంటి దుష్ప్రభావాలూ ఉత్పన్నం కాలేదన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ నిర్వహించిన మూడు దశల ప్రయోగాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయని, అందువల్ల ఈ టీకా త్వరలోనే మార్కెట్‌లోకి రావచ్చని చెప్పారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు.

ప్రయోగం రోజున..:

తనపై టీకా ప్రయోగం మే 11న జరిగిందని దీపక్‌ చెప్పారు. ‘‘ఓ వాలంటీరు చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం వల్ల.. ప్రయోగానికి ముందు రోజు నా మనసులో ఓ మూల భయం తలెత్తింది. ప్రయోగానికి ముందు వైద్యులు నాకు కొన్ని వీడియోలు చూపారు. వెనక్కి తగ్గాలనుకుంటే వెళ్లిపోవచ్చని చెప్పారు. పరీక్షలో పాల్గొనడం తప్పనిసరేమీ కాదన్నారు. అయినా వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నా. దీంతో వైద్యుడు నాకు టీకా ఇంజెక్షన్‌ వేశారు. 2 గంటల పాటు నన్ను పరిశీలనలో ఉంచారు. ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తాయా అన్నది గమనించారు. ఆ తర్వాత నిశితంగా పరీక్షలు చేసి, ఇంటికి పంపేశారు’’ అని తెలిపారు.

ఇదీ చూడండి:నవంబర్​ నాటికి ఆక్స్​ఫర్డ్​ టీకా.. ధరెంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.