ETV Bharat / bharat

కేంద్ర రవాణాశాఖ మంత్రికే తప్పని ట్రాఫిక్​ చలానా!

author img

By

Published : Sep 9, 2019, 7:11 PM IST

Updated : Sep 30, 2019, 12:53 AM IST

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కఠిన నిబంధనలు తప్పనిసరిగా అవసరమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ పునరుద్ఘాటించారు. వాహనాన్ని వేగంగా నడిపినందుకు ఆయనకు కూడా జరిమానా పడిందని గుర్తుచేసుకున్నారు గడ్కరీ.

నితిన్​ గడ్కరీ

రహదారులపై ప్రమాదాలు జరగకూడదంటే వాహనదారులు ట్రాఫిక్​ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ స్పష్టం చేశారు. అందుకే కఠిన నిబంధనలు, భారీ జరిమానాలు విధించామని ఆయన తెలిపారు.

"మోటారు వాహనాల చట్టానికి ఆమోదం లభించటం గొప్ప విజయంగా భావిస్తున్నాం. ప్రజల సాఫీ ప్రయాణమే లక్ష్యంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాం. ముంబయిలో బాంద్రా- వర్లీ రహదారిలో పరిమితికి మించిన వేగంతో వెళ్లినందుకు గతంలో నేను కూడా జరిమానా కట్టాను."

- నితిన్​ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి

100 రోజుల్లో మోదీ విజయాలు

గడిచిన 100 రోజుల్లో మోదీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుందన్నారు గడ్కరీ. ముమ్మార్​ తలాక్, ఆర్టికల్​ 370 రద్దు, మోటార్​ వాహనాల చట్టం సవరణ బిల్లు, జాతీయ వైద్య బిల్లుతోపాటు చాలా కీలక బిల్లులకు చట్టరూపం ఇచ్చామన్నారు. ఇది మోదీ విజయమని పేర్కొన్నారు. భారత్​ని ప్రపంచ ఆర్థిక శక్తిగా​ మార్చటమే ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి: 'మోదీ వల్లే శాస్త్రవేత్తలు తిరిగి పని ప్రారంభించారు'

రహదారులపై ప్రమాదాలు జరగకూడదంటే వాహనదారులు ట్రాఫిక్​ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ స్పష్టం చేశారు. అందుకే కఠిన నిబంధనలు, భారీ జరిమానాలు విధించామని ఆయన తెలిపారు.

"మోటారు వాహనాల చట్టానికి ఆమోదం లభించటం గొప్ప విజయంగా భావిస్తున్నాం. ప్రజల సాఫీ ప్రయాణమే లక్ష్యంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాం. ముంబయిలో బాంద్రా- వర్లీ రహదారిలో పరిమితికి మించిన వేగంతో వెళ్లినందుకు గతంలో నేను కూడా జరిమానా కట్టాను."

- నితిన్​ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి

100 రోజుల్లో మోదీ విజయాలు

గడిచిన 100 రోజుల్లో మోదీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుందన్నారు గడ్కరీ. ముమ్మార్​ తలాక్, ఆర్టికల్​ 370 రద్దు, మోటార్​ వాహనాల చట్టం సవరణ బిల్లు, జాతీయ వైద్య బిల్లుతోపాటు చాలా కీలక బిల్లులకు చట్టరూపం ఇచ్చామన్నారు. ఇది మోదీ విజయమని పేర్కొన్నారు. భారత్​ని ప్రపంచ ఆర్థిక శక్తిగా​ మార్చటమే ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి: 'మోదీ వల్లే శాస్త్రవేత్తలు తిరిగి పని ప్రారంభించారు'

Vadodara (Gujarat), Sep 08 (ANI): In order to make people aware against cervical and breast cancer, two women who started the campaign from Bengaluru have arrived in Gujarat's Vadodara. The ride was started on September 1. Both the riders aim to cover all the states in India to spread the message.
Last Updated : Sep 30, 2019, 12:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.