ETV Bharat / bharat

జనావాసాల్లో గజరాజు బీభత్సం... నలుగురు మృతి - elephant entered into residential

ఒడిశాలో గజేంద్రుడు బీభత్సం సృష్టించాడు. జనావాసాల్లోకి ప్రవేశించి పౌరులపై దాడి చేయగా.. నలుగురు మృతి చెందారు. ప్రజల తప్పిదాలతోనే పౌరులు ప్రాణాలు కోల్పోయారని అటివీ అధికారులు వెల్లడించారు.

elephant entered into residential areas and attacked people in Bhubaneswar
జనావాసాల్లోకి గజేంద్రుడు... దాడిలో నలుగురు పౌరులు మృతి
author img

By

Published : Feb 24, 2020, 11:07 PM IST

Updated : Mar 2, 2020, 11:24 AM IST

ఒడిశా భువనేశ్వర్​లో జనావాసాల్లోకి వచ్చిన ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మనుషులపై దాడి చేసింది. ఘటనలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడ్డారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.

చందక వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నుంచి దేలాంగ్​ ప్రాంతానికి ఏనుగు వెళ్లినట్లు ప్రధాన అటవీ సంరక్షణాధికారి హెచ్​ఎస్​ ఉపాధ్యాయ తెలిపారు. గజేంద్రుడిని చూసి ప్రజలు దగ్గరకు వచ్చి ఫొటోలు తీయడం, తాకడానికి ప్రయత్నం చేశారని.. ఈ క్రమంలోనే పౌరులపై ఏనుగు దాడి చేసిందని చెప్పారు.

జనావాసాల్లో గజరాజు బీభత్సం... నలుగురు మృతి

ఇదీ చూడండి: అధ్యక్షుడికి రాష్ట్రపతి విందుకు మన్మోహన్ గైర్హాజరు!

ఒడిశా భువనేశ్వర్​లో జనావాసాల్లోకి వచ్చిన ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మనుషులపై దాడి చేసింది. ఘటనలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడ్డారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.

చందక వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నుంచి దేలాంగ్​ ప్రాంతానికి ఏనుగు వెళ్లినట్లు ప్రధాన అటవీ సంరక్షణాధికారి హెచ్​ఎస్​ ఉపాధ్యాయ తెలిపారు. గజేంద్రుడిని చూసి ప్రజలు దగ్గరకు వచ్చి ఫొటోలు తీయడం, తాకడానికి ప్రయత్నం చేశారని.. ఈ క్రమంలోనే పౌరులపై ఏనుగు దాడి చేసిందని చెప్పారు.

జనావాసాల్లో గజరాజు బీభత్సం... నలుగురు మృతి

ఇదీ చూడండి: అధ్యక్షుడికి రాష్ట్రపతి విందుకు మన్మోహన్ గైర్హాజరు!

Last Updated : Mar 2, 2020, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.