ETV Bharat / bharat

ఆరో దశ ప్రచారానికి తెర- 12న పోలింగ్​

లోక్​సభ ఎన్నికల ఆరో దశ ప్రచారం నేటితో ముగిసింది. మే 12న పోలింగ్ జరగనుంది. అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

author img

By

Published : May 10, 2019, 5:02 PM IST

Updated : May 10, 2019, 6:22 PM IST

ఆరో దశ ప్రచారానికి తెర- మే 12న పోలింగ్​
ఆరో దశ ప్రచారానికి తెర- 12న పోలింగ్​

సార్వత్రిక ఎన్నికల ఆరో దశ ప్రచారం ముగిసింది. దేశ రాజధాని దిల్లీ సహా ఆరు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు ఈ దఫా పోలింగ్ జరగనుంది. 979 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మైకులు బంద్

ఆరో దశ ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటివరకూ హోరెత్తిన మైకులు బందయ్యాయి. పోల్​ మేనేజ్​మెంట్​లో నేతలు బిజీ అయ్యారు. ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఎన్నికల సంఘం అధికారులు, భద్రతా సిబ్బంది ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.

ఆరు రాష్ట్రాలు... 59 స్థానాలు

ఉత్తర్​ప్రదేశ్​లో 14, హరియాణాలో 10, బిహార్​, మధ్యప్రదేశ్​, బంగాల్​లో 8 స్థానాలు, దిల్లీలో 7, జార్ఖండ్​లో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దఫాలో 10 కోట్ల 17 లక్షల 82వేల 472 మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

పోలింగ్ కేంద్రాలకు తరలుతున్న యంత్రాంగం

ఆరో దశ ఎన్నికల కోసం ఈసీ లక్షా 13వేల 167 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపులో అధికారులు నిమగ్నమయ్యారు. రేపు సాయంత్రంలోగా ఎన్నికల అధికారులు చేరుకోనున్నారు. ఆరో దశ ఎన్నిక కోసం పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరిస్తున్నాయి.

ఇదీ చూడండి: మోదీపై 'టైమ్'​ వివాదాస్పద కవర్​స్టోరీ

ఆరో దశ ప్రచారానికి తెర- 12న పోలింగ్​

సార్వత్రిక ఎన్నికల ఆరో దశ ప్రచారం ముగిసింది. దేశ రాజధాని దిల్లీ సహా ఆరు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు ఈ దఫా పోలింగ్ జరగనుంది. 979 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మైకులు బంద్

ఆరో దశ ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటివరకూ హోరెత్తిన మైకులు బందయ్యాయి. పోల్​ మేనేజ్​మెంట్​లో నేతలు బిజీ అయ్యారు. ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఎన్నికల సంఘం అధికారులు, భద్రతా సిబ్బంది ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.

ఆరు రాష్ట్రాలు... 59 స్థానాలు

ఉత్తర్​ప్రదేశ్​లో 14, హరియాణాలో 10, బిహార్​, మధ్యప్రదేశ్​, బంగాల్​లో 8 స్థానాలు, దిల్లీలో 7, జార్ఖండ్​లో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దఫాలో 10 కోట్ల 17 లక్షల 82వేల 472 మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

పోలింగ్ కేంద్రాలకు తరలుతున్న యంత్రాంగం

ఆరో దశ ఎన్నికల కోసం ఈసీ లక్షా 13వేల 167 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపులో అధికారులు నిమగ్నమయ్యారు. రేపు సాయంత్రంలోగా ఎన్నికల అధికారులు చేరుకోనున్నారు. ఆరో దశ ఎన్నిక కోసం పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరిస్తున్నాయి.

ఇదీ చూడండి: మోదీపై 'టైమ్'​ వివాదాస్పద కవర్​స్టోరీ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
At Sea - Recent (CCTV - No access Chinese mainland)
1. Aerial shot of ship at sea
2. Various of scientists on deck
3. Various of dolphins
4. Scientist taking photos
5. Various of dolphins
6. Photos of dolphins
A scientific team from the Institute of Deep-sea Science and Engineering, under the Chinese Academy of Sciences, returned to south China's Hainan Province on Friday, after a 14-day expedition to study cetacean species in the South China Sea.
During the two-week expedition, scientists observed 27 groups of deep diving and pelagic cetacean species.
It was the first time for scientists to spot six species of cetacean, including sperm whales and goose-beaked whales, in the area.
Pairs of mother and baby cetaceans were found in groups of sperm whales and beaked whales in the northern part of the South China Sea, indicating that the two species are inhabiting the area.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : May 10, 2019, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.